Political News

తెలంగాణ జల వివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు

కొద్ది నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పంచాయితీలు లేకుండా..సాఫీగా సాగిపోతుందనుకుంటున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గళం విప్పటం.. ఏపీ సర్కారు నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టుపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అంటే.. దానికి పది మాటల్ని జేర్చి.. టీఆర్ఎస్ నేతలు కొందరు చెలరేగిపోతున్నారు. ఇదంతా జరుగుతున్న వేళ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు. ఈ ఇష్యూను షురూ చేసిన కేసీఆర్ తర్వాత కామ్ గా ఉన్నప్పటికీ.. వారి మంత్రులు మాత్రం విరుచుకుపడుతున్నారు.
దీనికి ప్రతిగా ఏపీ మంత్రులు.. వైసీపీ నేతలు పలువురు స్పందించారు. ఇలా మాటా.. మాటా పెరుగుతూ.. వివాదం అంతకంతకూ ముదురుతున్న వేళ.. అనూహ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వాడేస్తున్న వైనంపై ఇప్పటికే ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ రోజున జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్ తీవ్రంగా తప్ప పట్టింది. ఈ వ్యవహారాన్ని కేంద్రానికి తీసుకెళ్లానని.. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయంలో కనీస డ్రాయింగ్ లెవల్ కు నీటిమట్టం చేరుకోకముందే.. పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయటం.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాలను పట్టించుకోకపోవటం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. తాజాగా ఇదే అంశంపై ఏపీ మంత్రివర్గంలో చర్చకు వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని.. వారిని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఎక్కువగా మాట్లాడటం లేదని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పినట్లుగా సమాచారం.

తాజాగా నెలకొన్న జలవివాదంలో తెలంగాణ మంత్రులు పలువురు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి.. నరరూప రాక్షసుడంటూ నోరు పారేసుకోవటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతోంది. అనవసరమైన వ్యాఖ్యలు సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

This post was last modified on June 30, 2021 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

24 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago