కరోనా వైరస్ విషయంలో ఇంతకుముందు ప్రపంచ వార్తల మీదే అమితమైన ఆసక్తి ఉండేది. మన దగ్గర ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేని సమయంలో ఎక్కడ ఏ దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎక్కడ మరణాలు ఎక్కువన్నాయంటూ ఆసక్తిగా చూసేవాళ్లు. అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా ఉద్ధృతి గురించి తెగ చర్చించుకునేవాళ్లం. కానీ గత నెల రోజుల్లో కథ మారిపోయింది. మన దగ్గర వైరస్ విజృంభణ మొదలయ్యాక మన బాధలతోనే సరిపోయింది.
ప్రపంచం గురించి పట్టించుకోవడం మానేశాం. ఇండియాలోనే ఇప్పుడు ఏకంగా లక్షా 12 వేల కేసులు, 3500 దాకా మరణాలు నమోదయ్యాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది.. ఎన్ని కేసులు నమోదయ్యాయి.. మరణాలు ఎన్ని ఏ దేశంలో పరిస్థితి ఏంటి? ఒకసారి పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏకంగా అరకోటికి చేరడం గమనార్హం. అందులో అత్యధికంగా 15 లక్షల మందికి పైగా బాధితులున్నది ఒక్క అమెరికాలోనే. వరల్డ్ వైడ్ మొత్తం కరోనా మరణాలు 3 లక్షల 26 వేలు కాగా.. అమెరికాలో మాత్రమే 90 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఓవరాల్గా నంబర్ పెద్దదైనా అమెరికాలో ఇప్పుడు కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చినట్లే అంటున్నారు. ఇంతకుముందు కరోనా విలయ తాండవం చేసిన యూరప్ దేశాలు ఇటలీ, స్పెయిన్ల్లోనూ పరిస్థితి మెరుగైంది. ఐతే ఇప్పుడు కరోనా ధాటికి ఎక్కువగా బాధ పడుతున్నది బ్రెజిల్, రష్యా దేశాలే.
అక్కడ రోజూ వందల్లో కరోనా మరనాలు సంభవిస్తున్నాయి. బ్రెజిల్లో ఒక్క రోజులో 1200 మంది దాకా ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. రష్యాలో సైతం కొన్ని రోజులుగా ప్రతి దినం 500కు తక్కువ కాకుండా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే భారత్ ఇప్పటికీ చాలా మెరుగనే అంటున్నారు. ఐతే బుధవారం దేశవ్యాప్తంగా ఏకంగా 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటిదాకా రికార్డు.
This post was last modified on May 21, 2020 1:35 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…