టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం కాదు.. స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి మరీ స్పెషల్ గా విషెస్ తెలియజేయడం ఇక్కడ విశేషం.
ఆమె అలా శుభాకాంక్షలు తెలియడం పట్ల అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. విజయలక్ష్మీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. మేయర్ గా గెలుపొందారు. ఆమె.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలుపొందిన ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా… ఆయన మంగళవారం జరిగిన కౌన్సిల్ వరచ్చువల్ మీటింగ్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి వచ్చారు.
కార్పొరేటర్ గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. అనంతరం పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్ మీటింగ్ కు ఆన్ లైన్ లో హాజరు కావాల్సి ఉండగా… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నేరుగా వర్చువల్ సమావేశం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కి రావడం గమనార్హం.
This post was last modified on June 29, 2021 1:59 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…