టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం కాదు.. స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి మరీ స్పెషల్ గా విషెస్ తెలియజేయడం ఇక్కడ విశేషం.
ఆమె అలా శుభాకాంక్షలు తెలియడం పట్ల అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. విజయలక్ష్మీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. మేయర్ గా గెలుపొందారు. ఆమె.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలుపొందిన ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా… ఆయన మంగళవారం జరిగిన కౌన్సిల్ వరచ్చువల్ మీటింగ్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి వచ్చారు.
కార్పొరేటర్ గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. అనంతరం పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్ మీటింగ్ కు ఆన్ లైన్ లో హాజరు కావాల్సి ఉండగా… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నేరుగా వర్చువల్ సమావేశం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కి రావడం గమనార్హం.
This post was last modified on June 29, 2021 1:59 pm
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…