Political News

రేవంత్ రెడ్డికి మేయర్ స్పెషల్ విషెస్.. ఫోటోలు వైరల్..!

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం కాదు.. స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి మరీ స్పెషల్ గా విషెస్ తెలియజేయడం ఇక్కడ విశేషం.

ఆమె అలా శుభాకాంక్షలు తెలియడం పట్ల అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. విజయలక్ష్మీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. మేయర్ గా గెలుపొందారు. ఆమె.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలుపొందిన ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా… ఆయన మంగళవారం జరిగిన కౌన్సిల్ వరచ్చువల్ మీటింగ్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి వచ్చారు.

కార్పొరేటర్ గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. అనంతరం పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్ మీటింగ్ కు ఆన్ లైన్ లో హాజరు కావాల్సి ఉండగా… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నేరుగా వర్చువల్ సమావేశం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కి రావడం గమనార్హం.

This post was last modified on June 29, 2021 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు ఏం చేశారయ్యా మీరంతా?’ – పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…

31 minutes ago

రాకా సంగీతానికి పెద్ద ఛాలెంజ్ ఉంది

అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్…

1 hour ago

యువ హీరోకి బాబాయితో చెడిందా

యువ కథానాయకుడు రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. తన కొత్త సినిమాను…

1 hour ago

సైకిల్ ఎక్కిన వైసీపీ భూమన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా… జగన్ కోసం ఏమైనా చేసేందుకు అనునిత్యం సిద్ధంగా…

2 hours ago

జాతీయ రాజకీయాలపై రేవంత్ కన్ను

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన…

2 hours ago

మీరంతా బొద్దింక‌లు.. ప‌రాన్న జీవులు: సీజేఐ తీవ్ర వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజేఐ) జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్స‌ర్లు, స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ప్ర‌భుత్వాన్ని, కోర్టుల‌ను ప్ర‌శ్నించేవారిపై…

2 hours ago