Political News

ఫుట్ బాల్ క్రీడాకారుడు.. రోజుకూలీగా ఎందుకు మారాడు?

ప్రపంచాన్ని కరోనా కు ముందు.. తర్వాత అన్న విభజన రేఖ తప్పనిసరి. రానున్న రోజుల్లో ఇదే తరహా పోలిక.. ప్రస్తావన తరచూ చేయటం ఖాయం. ఎందుకంటే.. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనంత మహా సంక్షోభాన్ని ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్న చందంగా.. అందరూ ప్రభావితమయ్యారు. వలస కార్మికుల కష్టాలు కళ్లకు కట్టినట్లుగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే.. చాలామంది దిగువ.. మధ్యతరగతి జీవుల కష్టాలు నాలుగు గోడల్లోనే బందీ అయ్యాయి.

తాజాగా ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడు.. తాజా పరిణామాల నేపథ్యంలో రోజుకూలీగా మారిపోయిన దైన్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన ఉన్న మన్ ఫలుట్ అనే చిన్న పట్టణంలో మాహరుస్ మహమూద్ అనే పుట్ బాల్ క్రీడాకారుడు ఉన్నాడు. పదహారేళ్లకే ప్రొషెషనల్ గా మారిన అతను ఒక క్లబ్ తరఫున ఆడుతుండేవాడు.

ఆటతో వచ్చే ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడు. కరోనాతో అన్ని దేశాల్లో విధించిన చందంగానే ఈజిప్టులోనూ లాక్ డౌన్ విధించారు. దీంతో.. క్లబ్ మూసేశారు. ఆట ఆగింది. దీంతో పాటు.. పార్ట్ టైం జాబ్ బంద్ అయింది. దీంతో.. కుటుంబాన్ని ఆదుకునేందుకు అతను ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితి.

ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా పని చేయటం షురూ చేశారు. అక్కడ కూడా పని పోవటంతో ప్రస్తుతం బేకరీలో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. పిండి వంటలు చేస్తూ.. వచ్చే డబ్బుతో బతికేస్తున్నాడు. మరి.. కరోనా ముప్పు భయం లేదా? అంటే.. ఎందుకు లేదు? ఆ భయంతో ఇంట్లో ఉంటే.. ఇంట్లో వారికి డబ్బులు ఎవరు ఇస్తారు? అని ప్రశ్నించే వైనం అయ్యో అనిపించకమానదు.

This post was last modified on May 21, 2020 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

33 minutes ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

2 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

2 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

4 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

4 hours ago