Political News

ఫుట్ బాల్ క్రీడాకారుడు.. రోజుకూలీగా ఎందుకు మారాడు?

ప్రపంచాన్ని కరోనా కు ముందు.. తర్వాత అన్న విభజన రేఖ తప్పనిసరి. రానున్న రోజుల్లో ఇదే తరహా పోలిక.. ప్రస్తావన తరచూ చేయటం ఖాయం. ఎందుకంటే.. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనంత మహా సంక్షోభాన్ని ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్న చందంగా.. అందరూ ప్రభావితమయ్యారు. వలస కార్మికుల కష్టాలు కళ్లకు కట్టినట్లుగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే.. చాలామంది దిగువ.. మధ్యతరగతి జీవుల కష్టాలు నాలుగు గోడల్లోనే బందీ అయ్యాయి.

తాజాగా ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడు.. తాజా పరిణామాల నేపథ్యంలో రోజుకూలీగా మారిపోయిన దైన్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన ఉన్న మన్ ఫలుట్ అనే చిన్న పట్టణంలో మాహరుస్ మహమూద్ అనే పుట్ బాల్ క్రీడాకారుడు ఉన్నాడు. పదహారేళ్లకే ప్రొషెషనల్ గా మారిన అతను ఒక క్లబ్ తరఫున ఆడుతుండేవాడు.

ఆటతో వచ్చే ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడు. కరోనాతో అన్ని దేశాల్లో విధించిన చందంగానే ఈజిప్టులోనూ లాక్ డౌన్ విధించారు. దీంతో.. క్లబ్ మూసేశారు. ఆట ఆగింది. దీంతో పాటు.. పార్ట్ టైం జాబ్ బంద్ అయింది. దీంతో.. కుటుంబాన్ని ఆదుకునేందుకు అతను ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితి.

ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా పని చేయటం షురూ చేశారు. అక్కడ కూడా పని పోవటంతో ప్రస్తుతం బేకరీలో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. పిండి వంటలు చేస్తూ.. వచ్చే డబ్బుతో బతికేస్తున్నాడు. మరి.. కరోనా ముప్పు భయం లేదా? అంటే.. ఎందుకు లేదు? ఆ భయంతో ఇంట్లో ఉంటే.. ఇంట్లో వారికి డబ్బులు ఎవరు ఇస్తారు? అని ప్రశ్నించే వైనం అయ్యో అనిపించకమానదు.

This post was last modified on May 21, 2020 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago