రాజకీయంగా కేసీయార్ కు కష్టాలు మొదలైనట్లే అనిపిస్తోంది. ప్రభుత్వపరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా రాజకీయంగా ఏకకాలంలో ఇద్దరు గట్టి ప్రత్యర్ధులను ఎదుర్కోవటం మాత్రం కేసీయార్ కు ఇబ్బందనే చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రూపంలో గట్టి ప్రత్యర్ధి నిలబడ్డారు. తాజాగా పీసీసీ అధ్యక్షుని నియామకంతో రేవంత్ రెడ్డి కూడా మరోవైపు కేసీయార్ ను చెడుగుడు ఆడుకోవటానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కేసీయార్ పై ఒంటికాలిపై లేచే రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పీఠం దక్కటమంటే చిన్న విషయం కాదు.
కేసీయార్ ను రాజకీయంగా ఎదుర్కోవటంలో బీజేపీ నేతల్లో చాలామందికి చేతకాదనే చెప్పాలి. ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కేసీయార్ ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది వాస్తవమే. ప్రత్యర్ధులను దూషించటంలోకానీ లేదా విమర్శలతో విరుచుకుపడటంలో కానీ కేసీయార్ స్టైలే వేరు. కేసీయార్ స్టైల్లోనే కేసీయార్ కు గట్టిగా సమాధానం చెప్పేస్ధాయి కమలనాదుల్లో ఎవరికీ లేకుండాపోయింది. అందుకే బీజేపీ గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు.
ఇలాంటి సమయంలో హఠాత్తుగా బండిసంజయ్ అధ్యక్షుడయ్యారు. బండి పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి మంచి దూకుడు మీదున్నారు. కేసీయార్ ఒకటంటే ఆయన రెండంటున్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బండి దూకుడు ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. అన్నీ వేళలా దూకుడుమంత్రం పనిచేయకపోవచ్చు. కానీ పార్టీలో, జనాల్లో కేసీయార్ కు గట్టి ప్రత్యర్ధి దొరికాడని అనుకోవటంతో మాత్రం బండి సక్సెస్ అయ్యారు.
బండి సంగతి పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ లో కేసీయార్ ను ధీటుగా ఎదుర్కుంటున్నది రేవంత్ మాత్రమే అని అందరికీ తెలిసిందే. చెప్పుకోవటానికి చాలామంది సీనియర్లున్నా కేసీయార్ ను ఎదుర్కోవటంలో ఎవరూ పనికిరారు. పైగా ఉన్న సీనియర్లలో చాలామంది కేసీయార్ కోవర్టులే అనే ఆరోపణలున్నాయి. వీళ్ళందరినీ కాదని రేవంత్ మాత్రమే కేసీయార్ పై నిఖార్సయిన ఫైట్ ఇస్తున్నారు. ఇలాంటి రేవంత్ కు అధిష్ఠానం పీసీసీ పగ్గాలు అప్పగించింది.
అంటే ఒకవైపు బండి సంజయ్, మరోవైపు కేవంత్ టీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ కు పక్కలో బల్లాలుగా తయారవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. ఇద్దరిదీ దూకుడు స్వభావమే. కేసీయార్ రెండు మాటలంటే వీళ్ళద్దిరు కూడా నాలుగు వీలైతే పదిమాటలు అనేవాళ్ళే. పైగా పార్టీ క్యాడర్ తో పాటు జనాల్లో జోష్ నింపేవాళ్ళనటంలో సందేహంలేదు. సరిగ్గా హుజరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ముందు రేవంత్ నియామకం జరగటంతో ఫైట్ మంచి పట్టుమీదుంటుందనే అనుకోవాలి. మొత్తంమీద ఇద్దరు గట్టి ప్రత్యర్ధులతో కేసీయార్ కు రాజకీయంగా ఇబ్బందులు మొదలైందనే ప్రచారం మొదలైపోయింది.
This post was last modified on June 28, 2021 10:57 am
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…