ఈ అనుమానమే అందరిలోను పెరిగిపోతోంది. మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జిల్లాలోని టీడీపీ సీనియర్లలోని మెజారిటి నేతలతో గ్యాప్ పెరిగిపోతోందని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు మంత్రి హోదాలో అచ్చెన్న జిల్లాలో ఫుల్లుగా చక్రం తిప్పారు. మిగిలిన ఎంఎల్ఏలతో పాటు చాలామంది సీనియర్లను కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలకు కొదవేలేదు.
అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నంటే మంటగా ఉన్న చాలామంది నేతలు దూరంగానే ఉంటున్నారు. విషయం అర్ధమైపోయిన అచ్చెన్న కూడా వాళ్ళను కలుపుకుని పోవటానికి పెద్దగా ప్రయత్నాలు చేయలేదని సమాచారం. ఇందుకనే తాజాగా అచ్చెన్న కుటుంబంలోని కొందరిపై ప్రభుత్వం రౌడీషీటర్ తెరిచినా జిల్లాలోని నేతలు చాలా లైటుగా తీసుకున్నారు.
అచ్చెన్న సోదరుడు హరివరప్రసాద్ తో పాటు మరో సోదరుడి కొడుకు, వరసకు తమ్ముడు లాంటి దగ్గర బంధువులపై ప్రభుత్వం రౌడీషీటర్ ఓపెన్ చేసింది. కింజరాపు కుటుంబాల్లోని వాళ్ళపై నమోదైన కేసులను చూసిన తర్వాతే రౌడీషీటర్ ఓపెన్ చేసింది ప్రభుత్వం. ఇలాంటి కేసుల్లో ఎక్కువకేసులు చాలా సంవత్సరాలుగా కంటిన్యు అవుతున్నవే.
ఒకపుడు టీడీపీ నేతల్లో ఎవరిపైన కేసు పెట్టినా మిగిలిన నేతలు వెంటనే స్పందించేవారు. అలాంటిది రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న కుటుంబసభ్యులపైన రౌడీషీటర్ ఓపెన్ చేస్తే కూడా నేతల్లో చాలామంది తమకేమీ సంబంధం లేదన్నట్లే వ్యవహరించటం ఆశ్చర్యంగా ఉంది. అచ్చెన్న కుటుంబానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఎందుకని నోరిప్పలేదో అర్ధం కావటంలేదు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల్లో జిల్లాలో అచ్చెన్న మిగిలిన నేతలకు అంత కానీవాడైపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on June 27, 2021 3:28 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…