ఈ అనుమానమే అందరిలోను పెరిగిపోతోంది. మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జిల్లాలోని టీడీపీ సీనియర్లలోని మెజారిటి నేతలతో గ్యాప్ పెరిగిపోతోందని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు మంత్రి హోదాలో అచ్చెన్న జిల్లాలో ఫుల్లుగా చక్రం తిప్పారు. మిగిలిన ఎంఎల్ఏలతో పాటు చాలామంది సీనియర్లను కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలకు కొదవేలేదు.
అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నంటే మంటగా ఉన్న చాలామంది నేతలు దూరంగానే ఉంటున్నారు. విషయం అర్ధమైపోయిన అచ్చెన్న కూడా వాళ్ళను కలుపుకుని పోవటానికి పెద్దగా ప్రయత్నాలు చేయలేదని సమాచారం. ఇందుకనే తాజాగా అచ్చెన్న కుటుంబంలోని కొందరిపై ప్రభుత్వం రౌడీషీటర్ తెరిచినా జిల్లాలోని నేతలు చాలా లైటుగా తీసుకున్నారు.
అచ్చెన్న సోదరుడు హరివరప్రసాద్ తో పాటు మరో సోదరుడి కొడుకు, వరసకు తమ్ముడు లాంటి దగ్గర బంధువులపై ప్రభుత్వం రౌడీషీటర్ ఓపెన్ చేసింది. కింజరాపు కుటుంబాల్లోని వాళ్ళపై నమోదైన కేసులను చూసిన తర్వాతే రౌడీషీటర్ ఓపెన్ చేసింది ప్రభుత్వం. ఇలాంటి కేసుల్లో ఎక్కువకేసులు చాలా సంవత్సరాలుగా కంటిన్యు అవుతున్నవే.
ఒకపుడు టీడీపీ నేతల్లో ఎవరిపైన కేసు పెట్టినా మిగిలిన నేతలు వెంటనే స్పందించేవారు. అలాంటిది రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న కుటుంబసభ్యులపైన రౌడీషీటర్ ఓపెన్ చేస్తే కూడా నేతల్లో చాలామంది తమకేమీ సంబంధం లేదన్నట్లే వ్యవహరించటం ఆశ్చర్యంగా ఉంది. అచ్చెన్న కుటుంబానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఎందుకని నోరిప్పలేదో అర్ధం కావటంలేదు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల్లో జిల్లాలో అచ్చెన్న మిగిలిన నేతలకు అంత కానీవాడైపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on June 27, 2021 3:28 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…