Political News

అచ్చెన్న కానివాడైపోయాడా ?

ఈ అనుమానమే అందరిలోను పెరిగిపోతోంది. మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జిల్లాలోని టీడీపీ సీనియర్లలోని మెజారిటి నేతలతో గ్యాప్ పెరిగిపోతోందని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు మంత్రి హోదాలో అచ్చెన్న జిల్లాలో ఫుల్లుగా చక్రం తిప్పారు. మిగిలిన ఎంఎల్ఏలతో పాటు చాలామంది సీనియర్లను కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలకు కొదవేలేదు.

అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నంటే మంటగా ఉన్న చాలామంది నేతలు దూరంగానే ఉంటున్నారు. విషయం అర్ధమైపోయిన అచ్చెన్న కూడా వాళ్ళను కలుపుకుని పోవటానికి పెద్దగా ప్రయత్నాలు చేయలేదని సమాచారం. ఇందుకనే తాజాగా అచ్చెన్న కుటుంబంలోని కొందరిపై ప్రభుత్వం రౌడీషీటర్ తెరిచినా జిల్లాలోని నేతలు చాలా లైటుగా తీసుకున్నారు.

అచ్చెన్న సోదరుడు హరివరప్రసాద్ తో పాటు మరో సోదరుడి కొడుకు, వరసకు తమ్ముడు లాంటి దగ్గర బంధువులపై ప్రభుత్వం రౌడీషీటర్ ఓపెన్ చేసింది. కింజరాపు కుటుంబాల్లోని వాళ్ళపై నమోదైన కేసులను చూసిన తర్వాతే రౌడీషీటర్ ఓపెన్ చేసింది ప్రభుత్వం. ఇలాంటి కేసుల్లో ఎక్కువకేసులు చాలా సంవత్సరాలుగా కంటిన్యు అవుతున్నవే.

ఒకపుడు టీడీపీ నేతల్లో ఎవరిపైన కేసు పెట్టినా మిగిలిన నేతలు వెంటనే స్పందించేవారు. అలాంటిది రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న కుటుంబసభ్యులపైన రౌడీషీటర్ ఓపెన్ చేస్తే కూడా నేతల్లో చాలామంది తమకేమీ సంబంధం లేదన్నట్లే వ్యవహరించటం ఆశ్చర్యంగా ఉంది. అచ్చెన్న కుటుంబానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఎందుకని నోరిప్పలేదో అర్ధం కావటంలేదు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల్లో జిల్లాలో అచ్చెన్న మిగిలిన నేతలకు అంత కానీవాడైపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on June 27, 2021 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

20 minutes ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

1 hour ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

1 hour ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

4 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

4 hours ago

ఆహా… కనులవిందుగా కమల్ & రజిని

గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…

4 hours ago