Political News

వైసీపీ నేతల్లో నిరుత్సాహం ?

వరుసగా రెండోసారి కూడా అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలు వాయిదా వేసుకోవాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగానే ఈ సంవత్సరంలో నిర్వహించాలని అనుకున్న ప్లీనరీని కూడా వాయిదా వేయాలని జగన్మోహన్ రెడ్డి అత్యత ముఖ్యనేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగాల్సిన మొదటి ప్లీనరీని ఎంతో ఘనంగా నిర్వహించాలని పోయిన సంవత్సరమే అనుకున్నారు.

జూలై 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో బ్రహ్మాండంగా జరిపేందుకు జగన్ ఆధ్వర్యంలో నిర్ణయం కూడా జరిగింది. అయితే హఠాత్తుగా కరోనా వైరస్ సమస్య మొదలవ్వటంతో మొదటి ప్లీనరీ వాయిదాపడింది. దాంతో ఈ సంవత్సరం జూలైలో అయినా రెండోప్లీనరీని నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఇపుడు కూడా ప్లీనరీ నిర్వహించే పరిస్ధితులు కనబడటంలేదు.

కరోనా తీవ్రత కారణంగా రెండో ప్లీనరీ సమావేశాలను కూడా వాయిదా వేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. నిజానికి జూలై 9, 10 తేదీలంటే ఇక ఎక్కువ వ్యవధికూడా లేదు. ఒకవైపు జనాలను భౌతిక దూరం పాటించాలని చెబుతు అధికారపార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించటం మంచిది కాదని జగన్ అభిప్రాయపడ్డారట. అధికారంలో ఉంది కాబట్టి ఎంత వద్దని చెప్పినా నేతలు, కార్యకర్తలు భారీగా హాజరవ్వటం ఖాయం.

కరోనా మళ్ళీ విజృంభిస్తున్నదనే సంకేతాలు, థర్డ్ వేవ్ మరింత ప్రమాధకరమనే ఆందోళనల మధ్య ప్లీనరీ సమావేశాలను నిర్వహించకపోవటమే అన్నీ విధాల మంచిదని జగన్ డిసైడ్ చేయటంతోనే సమావేశాలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్లీనరీని కూడా అంతే ఘనంగా నిర్వహించాలని ఉన్న నిర్వహించలేకపోవటంతో నేతలంతా తెగ బాధపడిపోతున్నారు.

This post was last modified on June 27, 2021 3:23 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

40 mins ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

4 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

4 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

4 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

5 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

6 hours ago