Political News

మంత్రిగారి మెడ‌కు.. అశోక్‌-ర‌ఘురామ వ్య‌వ‌హారం..!

ఏపీలో సామాజిక వ‌ర్గం రాజ‌కీయం హీటెక్కింది. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివాదాల జోలికీ పోని.. వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. దీనికి రీజ‌నేంటి? ఎందుకు? అంటే.. టీడీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు విష‌యంలో మంత్రులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, వైసీపీ సొంత ఎంపీ, రెబ‌ల్‌గా మారిన‌.. ర‌ఘురామ‌రాజు పై కూడా కొన్నాళ్లుగా మంత్రులు, ఇత‌ర నేత‌లు.. ఎమ్మెల్యేలు కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ రెండు విష‌యాల్లోనూ ర‌ఘురామ విష‌యాన్ని క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

పైగా వైసీపీ సొంత ఎంపీ కావ‌డ‌మో.. లేక.. ఇరు ప‌క్షాల్లోనూ త‌ప్పులు ఉండ‌డం వ‌ల్లో త‌లియ‌దు కానీ.. క్ష‌త్రియ వ‌ర్గం ర‌ఘురామ విష‌యంలో సైలెంట్ అయిపోయింది. కొంద‌రు క్ష‌త్రియులు ర‌ఘురామ అరెస్టు వ్య‌వ‌హారం త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టినా మెజార్టీ క్ష‌త్రియుల నుంచి ర‌ఘురామ‌కు స‌పోర్ట్ అయితే రాలేదు. కానీ, విజ‌య‌న‌గ‌రం జిల్లా కు చెందిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు విష‌యంలో మాత్రం.. మంత్రులు, వైసీపీ నాయ‌కులు మాన్సాస్ ట్ర‌స్టును అడ్డుపెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని స‌హించ‌లేక పోయింది. ఈ క్ర‌మంలోనే భారీ ఎత్తున ప‌త్రిక‌ల్లో ఈ విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ.. ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నేత‌లు.

అయితే.. ఇది సున్నిత వ్య‌వ‌హారం కావ‌డం. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు క్ష‌త్రియ నేత‌లు ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌రకు వివాదం కాక‌పో యేస‌రికి వారిపై సానుభూతి పెరిగింది. కానీ, హ‌ఠాత్తుగా.. మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజు జోక్యం చేసుకున్నారు. క్ష‌త్రియులు జ‌గ‌న్‌కు ఓ లేఖ‌ను విడుద‌ల చేస్తూ పేప‌ర్ల‌లో ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ర‌ఘునాథ‌రాజు ఈ ప్ర‌క‌ట‌న‌ను త‌ప్పుబ‌ట్టారు. పైగా ఈ ప్ర‌క‌ట‌న‌కు క్ష‌త్రియ వ‌ర్గానికి సంబంధం లేద‌ని చెప్పారు. అటు అశోక్‌పైనా.. ఇటు ర‌ఘురామ రాజుపైనా ఫైర‌య్యారు. మొత్త‌గా చూస్తే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆయ‌న వ‌కాల్తాపుచ్చుకుని.. వీరిపై ఫైర‌య్యారు. అయితే.. ఈ ప్ర‌యోగం విక‌టించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే.. క్ష‌త్రియ వ‌ర్గంలో మంత్రి రంగ‌నాథ‌రాజుపై సానుభూతి ఉంది.

జ‌గ‌న్ కేబినెట్‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చినా.. లేక 2019లో ఆచంట నుంచి విజ‌యం ద‌క్కించుకున్నా.. దీని వెనుక ఫుల్లు గా క్ష‌త్రియుల స‌పోర్టు ఉండ‌డంతోనే సాధ్య‌మైంది. కానీ, ఇప్పుడు వారికి వ్య‌తిరేకంగా.. ప్ర‌భుత్వానికి.. అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై క్ష‌త్రియులు మండిప‌డుతున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజు మాత్రం.. ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న ఒక్క‌రే కాదు.. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌లు మౌనంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రంగ‌నాథ‌రాజు మాత్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రించి.. ఆగ్ర‌హానికి గుర‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 24, 2021 2:06 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

5 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

6 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

10 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago