మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. గడచిన ఏడాదిన్నరగా యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న విషయం తెలిసిందే. చాలా దేశాల్లో లక్షలమంది చనిపోయారు. చాలా దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందలైపోయింది. కరోనా వైరస్ దెబ్బకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి. చాలా దేశాల్లో ఎన్నెన్నో జరిగిపోతున్నా ఉత్తర కొరియాలో మాత్రం ఒక్కటంటే కనీసం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట.
ఈ విషయాన్ని ఎవరో చెప్పటం కాదు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధే (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అంటే డబ్ల్యూహెచ్ఓకు ఉత్తరకొరియా ఇచ్చిన నివేదికే ఆధారం లేండి. ఎందుకంటే ఆ దేశంలోకి మరేతిర దేశాలను అనుమతించరు కదా. దేశాధ్యక్షుడు, నియంత కిమ్ అనుమతి లేకుండా ఎవరు దేశంలోకి వచ్చేందుకు లేదు దేశం విడిచి వెళ్ళేందుకు లేదు.
ఇలాంటి దేశానికి సంబంధించిన ఏ సమాచారమైనా దేశాధ్యక్షుడు ఆదేశాల ప్రకారం తయారవ్వాల్సిందే. అందుకనే తాజా రిపోర్టు ప్రకారం ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కేసులు నిల్ అట. అదేమిటి చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న దేశం, చైనా దిగుమతుల మీదే ఆధారపడ్డ దేశం కదా ఉత్తరకొరియా మరలాంటపుడు కరోనా కేసులు లేకపోవటం ఏమిటి ? అని ఎంతమందికి ఎన్ని డౌట్లున్నా రిపోర్టును చదువుకోవటం మినహా చేయగలిగేదేమీ లేదు.
జూన్ 4-10 తేదీల మధ్య 733 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 149 మందిలో ఇన్ ఫ్లుయెంజా, శ్వాశకోశ సమస్యలు బయటపడ్డాయే కానీ కరోనా లక్షణాలే కనబడలేదట. నిజానికి చైనా-ఉత్తరకొరియా మధ్య రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కరోనాకు చైనానే పుట్టిల్లని మొత్తం ప్రపంచం నమ్ముతోంది. ఇలాంటి సమయంలో చైనా నుండి ఉత్తరకొరియాలోకి కరోనా వైరస్ కేసులు చొరబడలేదంటే ప్రపంచంలో ఎవరు నమ్మటం లేదు. కానీ చేయగలిగేది ఏముంది ?
This post was last modified on June 23, 2021 3:48 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…