మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. గడచిన ఏడాదిన్నరగా యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న విషయం తెలిసిందే. చాలా దేశాల్లో లక్షలమంది చనిపోయారు. చాలా దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందలైపోయింది. కరోనా వైరస్ దెబ్బకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి. చాలా దేశాల్లో ఎన్నెన్నో జరిగిపోతున్నా ఉత్తర కొరియాలో మాత్రం ఒక్కటంటే కనీసం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట.
ఈ విషయాన్ని ఎవరో చెప్పటం కాదు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధే (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అంటే డబ్ల్యూహెచ్ఓకు ఉత్తరకొరియా ఇచ్చిన నివేదికే ఆధారం లేండి. ఎందుకంటే ఆ దేశంలోకి మరేతిర దేశాలను అనుమతించరు కదా. దేశాధ్యక్షుడు, నియంత కిమ్ అనుమతి లేకుండా ఎవరు దేశంలోకి వచ్చేందుకు లేదు దేశం విడిచి వెళ్ళేందుకు లేదు.
ఇలాంటి దేశానికి సంబంధించిన ఏ సమాచారమైనా దేశాధ్యక్షుడు ఆదేశాల ప్రకారం తయారవ్వాల్సిందే. అందుకనే తాజా రిపోర్టు ప్రకారం ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కేసులు నిల్ అట. అదేమిటి చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న దేశం, చైనా దిగుమతుల మీదే ఆధారపడ్డ దేశం కదా ఉత్తరకొరియా మరలాంటపుడు కరోనా కేసులు లేకపోవటం ఏమిటి ? అని ఎంతమందికి ఎన్ని డౌట్లున్నా రిపోర్టును చదువుకోవటం మినహా చేయగలిగేదేమీ లేదు.
జూన్ 4-10 తేదీల మధ్య 733 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 149 మందిలో ఇన్ ఫ్లుయెంజా, శ్వాశకోశ సమస్యలు బయటపడ్డాయే కానీ కరోనా లక్షణాలే కనబడలేదట. నిజానికి చైనా-ఉత్తరకొరియా మధ్య రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కరోనాకు చైనానే పుట్టిల్లని మొత్తం ప్రపంచం నమ్ముతోంది. ఇలాంటి సమయంలో చైనా నుండి ఉత్తరకొరియాలోకి కరోనా వైరస్ కేసులు చొరబడలేదంటే ప్రపంచంలో ఎవరు నమ్మటం లేదు. కానీ చేయగలిగేది ఏముంది ?
This post was last modified on June 23, 2021 3:48 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…