రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని.. కేంద్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఏపీ సర్కారు మీద కేసీఆర్ బండలు వేయటం కొత్తేం కాదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ వాదనను సమర్థంగా వినిపించటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల చిట్టాను వరుస పెట్టి చదివారు.
ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవటానికి ఈ ప్రాజెక్టులు అంటూ ఏపీ వైఖరిని స్పష్టం చేసిన అనిల్.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరును తప్పు పట్టారు. “ఢిల్లీలో వారు ధర్నాలు చేస్తే చేయనివ్వండి. ఏపీ తన వాదనతో ముందుకు వెళుతుంది. అపెక్సు కౌన్సిల్ లోనే పోరాడతాం. మాకు కేటాయించిన నీటిని వాడుకుంటే అది ఎందుకు తప్పు అవుతుంది. నిబంధనల మేరకే పథకాల్ని చేపట్టాం. ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకునేందుకే ఈ ప్రాజెక్టులు” అంటూ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పిన మంత్రి.. వాటి వివరాల్ని వెల్లడించారు. “పాలమూరు – రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల కన్నా దిగువ నుంచే నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్నారు. కల్వకుర్తి.. భీమా.. నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని తెలంగాణ పెంచుతోంది. రాయలసీమ ఎత్తిపోతల, రాజోలిబండ ప్రాజెక్టులు విభజన చట్టానికి లోబడే ఉన్నాయి. ఏదీ కొత్త ప్రాజెక్టు కాదు” అని చెప్పారు. సుంకేశుల బ్యారేజి జల విస్తరణ ప్రాంతం నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని.. ఇది అక్రమ ప్రాజెక్టు కాదా? దానికి ఏం అనుమతులు ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. మంచితనం బలహీనత కాదంటూ ఏపీ వైఖరిని సూటిగా చెప్పేశారు మంత్రి అనిల్.
This post was last modified on June 22, 2021 11:26 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…