గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో పుష్కర్ ఘాట్ సమీపంలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తతో కలిసి.. పుష్కర్ ఘాట్కు వచ్చిన యువతిని ఆమెకు కాబోయే భర ముందే అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నిందితుల ఘటన.. పెద్ద ఎత్తున వివాదంగా మారింది. సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో ఇలా జరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ తాజాగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. సీఎం జగన్పై తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. “రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారు.. ఇప్పుడు ఏమయ్యారు?” అని లోకేష్ నిలదీశారు.
జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారూ! మీ ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా? అని లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్ధకమైంది..అంటూ.. జగన్పై లోకేష్ నిప్పులు చెరిగారు. ఈ ట్వీట్కు సదరు అత్యాచార ఘటనకు సంబంధించిన వార్తలను జత చేశారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on June 21, 2021 7:16 pm
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…