Political News

ఆ ప‌ట్టుద‌ల‌కు 550 రోజులు.. స‌పోర్ట్ చేయాల్సిందే!

ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 550 రోజులుగా సాగుతున్న ఉద్య‌మం. అది కూడా ఐదుకోట్ల మంది కోసం చేస్తున్న ఉద్య‌మం..మ‌రి దీనిలో మ‌న పాత్ర ఎంత‌? అనేది త‌ర‌చి చూసుకోవాలి..

అది క‌ల‌ల రాజ‌ధాని. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా వ‌ర్థిల్లాల్సిన రాజ‌ధాని. అయితే.. మారిన పాల‌కుడి కార‌ణంగా.. ఈ ప్ర‌భ స‌న్న‌గిల్లిపో యింది. ప్ర‌పంచ స్థాయి న‌గ‌రం.. ఇప్పుడు క‌న్నీరు పెడుతోంది. అదే న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి. దీనిని నిల‌బెట్టుకునేందుకు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. ఇక్క‌డి రైతులు, మ‌హిళ‌లు.. చిన్నారులు వృద్ధులు ఉద్య‌మ బాట ప‌ట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 550 రోజులుగా అమ‌రావ‌తి ఉద్య‌మ పోరు న‌డుస్తోంది.

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో ఊరూవాడా ఏకమై.. కనిపించిన ఏ అవ‌కాశాన్నీ వదులుకోకుండా.. రాజధాని కోసం గళమెత్తుతూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ ఆకాంక్షను వినిపిస్తూనే ఉన్నారు. లాఠీలు విరిగినా, నెత్తురోడినా, పోరాటపటిమను సడలనివ్వలేదు. అక్రమ కేసులు పెట్టినా, కరోనా ప్రాణ భయం వెంటాడుతున్నా.. దేన్నీ లెక్కచేయకుండా సుదీర్ఘంగా వారు చేస్తున్న పోరాటం 550వ రోజులుగా సాగుతోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఏకం చేస్తూ.. అమ‌రావ‌తి జేఏసీ స‌హా అనేక ఉద్య‌మ సంఘాలు ఏర్ప‌డి.. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. వ‌స్తున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో సుమారు 34,322 ఎకరాలను 29,881 మంది రైతులు భూసమీకరణలో భాగంగా ఇచ్చారు. వారిలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే. ప్రభుత్వం మారినా.. రాజధాని ఇక్కడే ఉంటుందన్న భరోసాతో ఉన్న రైతులకు 2019 డిసెంబరు 17న శాసనసభలో.. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ఆలోచన శరాఘాతంలా మారింది. ఆ మర్నాటి నుంచే రాజధానిలో ఉద్యమం ఊపిరిలూదుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలై… క్రమంగా రాజధానిలోని అన్ని గ్రామాలకూ ఉద్యమం విస్తరించింది.

రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి అధికార వైసీపీ తప్ప, మిగతా అన్ని పార్టీలూ సంఘీభావం ప్రకటించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బీజేపీ అప్ప‌టి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు తదితరులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్రం నలుమూలల, ఇతర రాష్ట్రాల నుంచి రైతులు, రైతు నాయకులు వచ్చి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.

అయితే.. ఇప్ప‌టికీ రాజ‌ధాని ఉద్య‌మం ర‌గులుతూనే ఉంది. దీనికి ప్ర‌భుత్వ నేత‌లు.. అనుస‌రిస్తున్న వైఖ‌రే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కూడా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. రాజ‌ధాని మార్పు త‌థ్య‌మ‌ని.. ఏ క్ష‌ణంలో అయినా విశాఖ‌కు త‌ర‌లిపోతుంద‌ని.. ఎవ‌రూ దీనిని ఆప‌లేర‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో 550 రోజు ముగిసినా.. ఈ ఉద్య‌మం మ‌రింత తీవ్రంగా ముందుకు సాగేలా చూడాల‌ని ఉద్యమ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ.. రాజ‌ధాని ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో పిలుపునిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 20, 2021 9:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

3 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

4 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago