కర్నాకటలో అసమ్మతి నేతలు రూటు మార్చినట్లున్నారు. యడ్యూరప్పను సీఎం పదవిలో నుండి తొలగించే విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీ నుండి అరుణ్ సింగ్ అనే దూతను అగ్రనేతలు పంపిన విషయం తెలిసిందే. ఎలాగైనా యడ్డీని పదవిలో నుండి దింపేయాలనే ఉద్దేశ్యంతో వ్యతిరేక వర్గాలన్నీ ఏకమవుతున్న విషయం తెలిసిందే.
అరుణ్ తో భేటీ అయిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు యడ్డీ విషయమై తమ అభిప్రాయాలను స్పష్టంగానే చెప్పారు. అయితే అభిప్రాయసేకరణ తర్వాత యడ్డీనే పదవిలో కంటిన్యు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం డిసైడ్ చేసినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో యడ్డీ వ్యతిరేకులంతా తమ రూటును మార్చుకున్నట్లు అనిపిస్తోంది.
సీఎంను వదిలేసి ఆయన కొడుకు విజయేంద్రపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. బీజేపీ ఎంఎల్సీ హెచ్ విశ్వనాద్ మాట్లాడుతు ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కొడుకు విజయేంద్ర జోక్యం చేసుకుంటున్నట్లు తీవ్రమైన ఆరోపణలుచేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఆర్ధికశాఖ అనుమతి లేకున్నారు. 21,473 కోట్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు.
విజయేంద్ర జోక్యం కారణంగానే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచినట్లు బహిరంగంగా ఆరోపించారు. కాంట్రాక్టర్లతో కుమ్మకైన విజయేంద్ర ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు పిలిచేట్లు చేశారన్నారు. అలాగే జిందాల్ ఉక్కు కర్మాగారం విస్తరణ కోసం 3667 హెక్టార్ల భూమిని అత్యంత తక్కువ ధరకే అమ్మాలనే నిర్ణయం వెనుక కూడా విజయేంద్రే ఉన్నట్లు మండిపడ్డారు.
కాంగ్రెస్, జేడీఎస్ తో విజయేంద్ర కుమ్మకైన కారణంగానే పై పార్టీలు కూడా ప్రభుత్వంలో అవినీతిపై నోరెత్తటం లేదన్నారు. సరే విశ్వనాధ్ ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. ఆరోపణలు చేయటం విశ్వనాధ్ కు మామూలైపోయిందంటు యడ్డీ ధ్వజమెత్తారు. మొత్తానికి యడ్డీ వ్యతిరేకుల తీరు చూస్తుంటే రూటు మార్చుకుని కొడుకు విజయేంద్రను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.
This post was last modified on June 19, 2021 8:12 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…