Political News

రూటు మార్చిన అసమ్మతి

కర్నాకటలో అసమ్మతి నేతలు రూటు మార్చినట్లున్నారు. యడ్యూరప్పను సీఎం పదవిలో నుండి తొలగించే విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీ నుండి అరుణ్ సింగ్ అనే దూతను అగ్రనేతలు పంపిన విషయం తెలిసిందే. ఎలాగైనా యడ్డీని పదవిలో నుండి దింపేయాలనే ఉద్దేశ్యంతో వ్యతిరేక వర్గాలన్నీ ఏకమవుతున్న విషయం తెలిసిందే.

అరుణ్ తో భేటీ అయిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు యడ్డీ విషయమై తమ అభిప్రాయాలను స్పష్టంగానే చెప్పారు. అయితే అభిప్రాయసేకరణ తర్వాత యడ్డీనే పదవిలో కంటిన్యు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం డిసైడ్ చేసినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో యడ్డీ వ్యతిరేకులంతా తమ రూటును మార్చుకున్నట్లు అనిపిస్తోంది.

సీఎంను వదిలేసి ఆయన కొడుకు విజయేంద్రపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. బీజేపీ ఎంఎల్సీ హెచ్ విశ్వనాద్ మాట్లాడుతు ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కొడుకు విజయేంద్ర జోక్యం చేసుకుంటున్నట్లు తీవ్రమైన ఆరోపణలుచేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఆర్ధికశాఖ అనుమతి లేకున్నారు. 21,473 కోట్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు.

విజయేంద్ర జోక్యం కారణంగానే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచినట్లు బహిరంగంగా ఆరోపించారు. కాంట్రాక్టర్లతో కుమ్మకైన విజయేంద్ర ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు పిలిచేట్లు చేశారన్నారు. అలాగే జిందాల్ ఉక్కు కర్మాగారం విస్తరణ కోసం 3667 హెక్టార్ల భూమిని అత్యంత తక్కువ ధరకే అమ్మాలనే నిర్ణయం వెనుక కూడా విజయేంద్రే ఉన్నట్లు మండిపడ్డారు.

కాంగ్రెస్, జేడీఎస్ తో విజయేంద్ర కుమ్మకైన కారణంగానే పై పార్టీలు కూడా ప్రభుత్వంలో అవినీతిపై నోరెత్తటం లేదన్నారు. సరే విశ్వనాధ్ ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. ఆరోపణలు చేయటం విశ్వనాధ్ కు మామూలైపోయిందంటు యడ్డీ ధ్వజమెత్తారు. మొత్తానికి యడ్డీ వ్యతిరేకుల తీరు చూస్తుంటే రూటు మార్చుకుని కొడుకు విజయేంద్రను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.

This post was last modified on June 19, 2021 8:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

9 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

9 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

11 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

11 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

15 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

17 hours ago