మనోళ్లలో పలువురిని అగ్రరాజ్యం అమెరికా తిప్పి పంపేలా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల్ని అక్కడి అధికారులు గుర్తించారు. అమెరికాలోని మెక్సికన్ సరిహద్దు ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయుల్ని గుర్తించారు. అలాంటి వారిని అమెరికాలో ఉంచేందుకు వీలున్న న్యాయపరమైన అవకాశాలు తాజాగా ముగిశాయి.
దీంతో.. వారిని భారత్ కు తిప్పి పంపనున్నారు. ప్రత్యేక విమానంలో ఈ 161 మందిని భారత్ కు పంపనున్నారు. వీరిలో హర్యానాకు చెందిన 76 మంది.. పంజాబ్ కు చెందిన వారు 56.. గుజరాత్ కు చెందిన వారు పన్నెండు మంది ఉన్నారు. వీరితో పాటు.. యూపీ (5).. మహారాష్ట్ర (4).. కేరళ.. తెలంగాణ.. తమిళనాడులకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. ఇక.. ఏపీ.. గోవాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఎలాంటి న్యాయపరమైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వారిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇలా అమెరికాలోకి ప్రవేశించిన వారంతా బ్రోకర్ల మాటలు నమ్మి రూ.35 నుంచి రూ.50 లక్షల మొత్తాన్ని చెల్లించి మరీ అమెరికాకు వెచ్చారు.
ఇప్పుడు భారీ మొత్తం పోవటమే కాదు.. కేసుల్లో చిక్కుకొని.. జైల్లో ఉంటూ.. చివరకు దేశానికి తిరిగి వచ్చేస్తున్న దుస్థితి. సో.. మాయమాటల్ని నమ్మి మోసం పోవటం.. అడ్డంగా బుక్ కావటం లాంటివి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
This post was last modified on May 19, 2020 2:03 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…