మనోళ్లలో పలువురిని అగ్రరాజ్యం అమెరికా తిప్పి పంపేలా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల్ని అక్కడి అధికారులు గుర్తించారు. అమెరికాలోని మెక్సికన్ సరిహద్దు ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయుల్ని గుర్తించారు. అలాంటి వారిని అమెరికాలో ఉంచేందుకు వీలున్న న్యాయపరమైన అవకాశాలు తాజాగా ముగిశాయి.
దీంతో.. వారిని భారత్ కు తిప్పి పంపనున్నారు. ప్రత్యేక విమానంలో ఈ 161 మందిని భారత్ కు పంపనున్నారు. వీరిలో హర్యానాకు చెందిన 76 మంది.. పంజాబ్ కు చెందిన వారు 56.. గుజరాత్ కు చెందిన వారు పన్నెండు మంది ఉన్నారు. వీరితో పాటు.. యూపీ (5).. మహారాష్ట్ర (4).. కేరళ.. తెలంగాణ.. తమిళనాడులకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున ఉన్నారు. ఇక.. ఏపీ.. గోవాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఎలాంటి న్యాయపరమైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వారిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇలా అమెరికాలోకి ప్రవేశించిన వారంతా బ్రోకర్ల మాటలు నమ్మి రూ.35 నుంచి రూ.50 లక్షల మొత్తాన్ని చెల్లించి మరీ అమెరికాకు వెచ్చారు.
ఇప్పుడు భారీ మొత్తం పోవటమే కాదు.. కేసుల్లో చిక్కుకొని.. జైల్లో ఉంటూ.. చివరకు దేశానికి తిరిగి వచ్చేస్తున్న దుస్థితి. సో.. మాయమాటల్ని నమ్మి మోసం పోవటం.. అడ్డంగా బుక్ కావటం లాంటివి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
This post was last modified on May 19, 2020 2:03 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…