Political News

హైదరాబాద్ లో బాబును కలిసిన వైసీపీ నేత ఎవరు?

వరుస ఎదురుదెబ్బలతో కిందా మీదా పడిపోతూ.. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు..ఆయన పార్టీ నేతలకు కాసింత ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? బాబు ఇంటికి ఎందుకు వెళ్లినట్లు? అన్న విషయాల్లోకి వెళితే..

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ సభ్యుడు కమ్ వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాబు ఇంటికి వెళ్లారు. ఇద్దరు భేటీ అయ్యారు. రాయచోటి నియోజకవర్గంలోన తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. పార్టీలో చేరే అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఆర్ఆర్ సోదరులతో కలిసి పని చేయటం.. పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అయితే.. రాంప్రసాద్ రెడ్డి బాబును కలవటం ఇదే తొలిసారి కాదు. ఈ మధ్య జరిగిన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం శ్రీకాళహస్తికి వెళ్లిన సందర్భంలోనూ వీరిద్దరి భేటీ జరిగింది. స్థానిక రాజకీయ పరిణామాలతోనే ఆయన పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. వీరిద్దరి భేటీపై వైసీపీ అధినాయకత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

38 minutes ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

43 minutes ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

2 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

3 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

3 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

4 hours ago