Political News

హైదరాబాద్ లో బాబును కలిసిన వైసీపీ నేత ఎవరు?

వరుస ఎదురుదెబ్బలతో కిందా మీదా పడిపోతూ.. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు..ఆయన పార్టీ నేతలకు కాసింత ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? బాబు ఇంటికి ఎందుకు వెళ్లినట్లు? అన్న విషయాల్లోకి వెళితే..

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ సభ్యుడు కమ్ వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాబు ఇంటికి వెళ్లారు. ఇద్దరు భేటీ అయ్యారు. రాయచోటి నియోజకవర్గంలోన తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. పార్టీలో చేరే అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఆర్ఆర్ సోదరులతో కలిసి పని చేయటం.. పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అయితే.. రాంప్రసాద్ రెడ్డి బాబును కలవటం ఇదే తొలిసారి కాదు. ఈ మధ్య జరిగిన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం శ్రీకాళహస్తికి వెళ్లిన సందర్భంలోనూ వీరిద్దరి భేటీ జరిగింది. స్థానిక రాజకీయ పరిణామాలతోనే ఆయన పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. వీరిద్దరి భేటీపై వైసీపీ అధినాయకత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on June 19, 2021 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago