Political News

తెలంగాణ‌కు వరాలు ఇచ్చి హైద‌రాబాద్‌కు షాకిచ్చిన కేసీఆర్‌

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న తెలంగాణ‌లో లాక్ డౌన్ నిబంధ‌న‌ల అమ‌లు విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. త‌న అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశం అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో కేసీఆర్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

తెలంగాణ‌లోని కంటైన్మెంట్ జోన్లు మిన‌హా మిగ‌తా అన్ని జోన్ల‌ను గ్రీన్ జోన్లుగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే, ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌కు వ‌రాలు ఇచ్చిన కేసీఆర్ హైద‌రాబాద్ విష‌యంలో మాత్రం ఆంక్ష‌లు విధించారు. ఇక నుంచి కరోనాతో కలిసి జీవించాల‌ని పేర్కొన్న కేసీఆర్ ఇప్పట్లో మందు రాదని, అలాగని బతకలేకుండా ఉండలేమని అన్నారు.

`రాష్ట్రంలో అన్ని షాపులు, అన్ని వ్యాపారాలు ప్రారంభించుకోవ‌చ్చు. హైదరాబాద్ లో ప్రత్యామ్నాయ పద్దతుల్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. సెలూన్లు కూడా తెరుచుకోవచ్చు హైదరబాద్ మినహా రాష్ట్రంలో అన్ని బస్సులు నడుస్తాయి. ఇతర రాష్ట్రాల నుండి బస్సులకు అనుమతి లేదు. సినిమా హాల్, ఫంక్షన్ హాల్‌ల‌కు అనుమతి లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

టాక్సీలు, కారుల‌ల్లో 1+3 చొప్పున అనుమతి ఉంటుంద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ-కామర్స్‌లో అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్ప‌ష్టం చేశారు. కర్వ్యూ రాష్ట్రం అంతా యథాతథంగా ఉంటుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

`ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలకు లోబడి తమ కార్యకలపాలను కొనసాగించవచ్చు. అన్ని రకాల ప్రార్థన మందిరాలు, ఉత్స‌వాలు బంద్ ఉంటాయి. సభలు, ర్యాలీలు, సమావేశాలు విద్యా సంస్థలు బంద్ చేయాల్సిందే. జన సమూహానికి ఆస్కారం ఉన్న అన్ని ప్రదేశాలు బంద్ చేయాల్సిందే. బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధరించాలి లేకుంటే 1000 రూపాయల జరిమాన త‌ప్ప‌దు అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగ‌త శానిటైజేశన్ పాటించాలని తెలిపారు.

ప్రతి షాపులో విరివిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, కోవిడ్ రూల్స్ ప్రతి ఒక్క షాపు పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. నిబంధ‌న‌ల వెసులుబాటు క‌ల్పించారు కదా అని అనవసరంగా రోడ్ల మీదకు రావద్దు. వృద్ధులు, చిన్నవారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ప్రజలందరూ చక్కటి సహకారం అందిస్తున్నారు. అందరికీ చేతులెత్తి మొక్కుతున్న...స్వీయ నిర్బంధం పాటించి కరోనా రాకుండా కాపాడుకుందాం అని విజ్ఞ‌ప్తి చేశారు. మే 31 త‌ర్వాత లాక్ డౌన్ అమ‌లు విష‌య‌మై త‌దుప‌రి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

This post was last modified on May 18, 2020 8:55 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

1 hour ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

3 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

3 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

4 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

5 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

5 hours ago