Political News

జంపింగ్‌ల‌కే జ‌గ‌న్ ప‌ద‌వులు… వైసీపీలో కొత్త కుంప‌ట్లు ?


ఏపీలో కింది నుంచి పై స్థాయి దాకా అన్ని ప‌ద‌వులు అధికార వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఏపీలో ఉన్న ప‌ద‌వుల్లో 99 శాతం ప‌ద‌వులు అన్ని వైసీపీ నేత‌ల‌కే ద‌క్కుతున్నాయి. అయితే ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పార్టీ నేత‌ల్లో 40 మంది వ‌ర‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీరిలో కొంద‌రికి వీరు చేసిన త్యాగాలు, పార్టీ కోసం ప‌డిన క‌ష్టం నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఇస్తాన‌ని ఓపెన్‌గానే చెప్పారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డిన నేత‌లు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి న్యాయం చేస్తోన్న జ‌గ‌న్ కొంద‌రు క‌మిటెడ్ నేత‌ల విష‌యంలో మాత్రం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వైసీపీలో అసంతృప్తి అనేది చాప‌కింద నీరులా పాకుతోంది.

పార్టీ కోసం కష్ట‌ప‌డిన వాళ్లు.. 2014, 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడినవారు, పార్టీ జిల్లా అధ్య‌క్షులుగా ఉన్నవారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసిన వారు, వైసీపీ అభ్య‌ర్థుల చేతిల్లో ఓడిన వారికే ఇప్పుడు ప‌ద‌వులు ద‌క్కుతున్నాయి.. వారినే అంద‌లాలు ఎక్కిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలో ఎంపీగా ఉన్న పండుల ర‌వీంద్ర‌బాబు వైసీపీలోకి వ‌చ్చిన వెంట‌నే ఎమ్మెల్సీ అయ్యారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి కట్ట‌బెట్ట‌డంతో పార్టీలో ఉన్న సీనియ‌ర్ ఎస్సీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. పార్టీ కోసం ప‌దేళ్లుగా క‌ష్ట‌ప‌డిన వారికి కాద‌ని.. పార్టీ కోసం ఏ మాత్రం క‌ష్టం లేకుండా ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన వారికి ఎమ్మెల్సీ ఇస్తార‌న్న అసంతృప్తి తీవ్రంగా ఉంది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ప్ర‌స్తుత మంత్రి చెల్లుబోయిన వేణు చేతిలో ఓడిన తోట త్రిమూర్తులు వైసీపీలోకి వ‌చ్చిన వెంట‌నే జాక్‌పాట్ కొట్టేశారు. ఆయ‌న‌కు ఏకంగా అమ‌లాపురం పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఏకంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా వ‌చ్చేసింది. తోట అంటే మంత్రి వేణుతో పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు పిల్లి బోస్‌కు ఏ మాత్రం ప‌డ‌దు. వీరు తోట పార్టీ ఎంట్రీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా జ‌గ‌న్ పార్టీలో చేర్చుకుని రెండు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. పైగా అటు పండుల‌, ఇటు తోట ఇద్ద‌రూ ఒకే జిల్లా.. అందులోనూ గ‌తంలో టీడీపీలో క‌లిసి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే.

ఇక జ‌గ‌న్ ఐదారేళ్లుగా ఎమ్మెల్సీ ఇస్తా అన్నా అని చెప్పిన నేత‌ల‌కే ఇప్పుడు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ చిల‌క‌లూరిపేట సీటు త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌డం లేదు. గొట్టిపాటి భ‌ర‌త్‌, జంకే వెంక‌ట‌రెడ్డి లాంటి వారు 2014 టైంలో పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డడంతో పాటు ఆర్థికంగా ఎంతో న‌ష్ట‌పోయారు. వీరికి జ‌గ‌న్ హామీ ఇచ్చి కూడా ప‌ద‌వులు ఇవ్వ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి నేత‌ల లిస్టు చాంతాడంత ఉంది. వీరిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వైసీపీలో పెద్ద బ‌డ‌బాగ్ని ర‌గిలే ఛాన్సులే ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ వీరికి న్యాయం చేసి.. ఆ అస‌మ్మ‌తి జ్వాల‌ల‌ను ఎలా ఆర్పుతారో ? చూడాలి.

This post was last modified on June 16, 2021 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

1 hour ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

4 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

7 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

8 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

8 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

8 hours ago