బీహార్లో లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అద్యక్షుడు చిరాగా పాశ్వాన్ కే పార్టీ ఎంపిలు పెద్ద షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ అద్యక్షుడిగా చిరాగ్ ను తప్పించిన ఎంపిలు తాజాగా పార్టీ అధ్యక్షునిగానే తీసి పడేశారు. చిరాగ్ కు ఎల్జేపీకి సంబంధమే లేదని ఎంపిలు కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఛైర్మన్ గా చిరాగ్ ను తొలగించారు. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వచ్చిన అబ్బాయ్ ను పశుపతి తనింట్లోకి కూడా రానీయలేదు. చాలాసేపు రోడ్డుమీదే వెయిట్ చేసి చేసేది లేక వెళ్ళిపోయారు.
రెండు రోజుల క్రితం ఎల్జేపీని చీల్చేసిన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాశర్ చిరాగ్ కు వ్యతిరేకంగా చాలా స్పీడుగా పావులు కదుపుతున్నారు. పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత అబ్బాయ్-బాబాయ్ మధ్య మొదలైన గొడవలే చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పాశ్వాన్ మరణించిన తర్వాత ఓ సమావేశంలో బాబాయ్ తో చిరాగ్ మాట్లాడుతు ‘నువ్వసలు నాకు బాబాయ్ వే కాదు నీకు నాకు రక్త సంబంధమే లేదు’ అని అవమానకరంగా మాట్లాడారట. నిజానికి అప్పటివరకు అన్న పాశ్వాన్ తరపున రాష్ట్రంలో మొత్తం వ్యవహారాలన్నింటినీ పశుపతే చూసుకునేవారట. చిరాగ్ చేతికి పార్టీపగ్గాలు అందిన తర్వాతే పశుపతికి అవమానాలు మొదలైనట్లు సమాచారం. అలాంటి ఘటనలు పెరిగిపోయి చివరకు పార్టీ చీలికకు దారితీసింది.
మొత్తానికి కారణం ఏదైనా పార్టీ రెండుగా చీలిపోయిందన్నది వాస్తవం. బాబాయ్ తో సయోధ్య చేసుకునేందుకు చిరాగ్ చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. బాబాయ్ తో మాట్లాడేందుకు ఇంటికి వచ్చిన అబ్బాయ్ ను ఇంట్లోకి అనుమతించలేదు. దాంతో గంటసేపు రోడ్డుపైనే వెయిట్ చేసిన చిరాగ్ చివరకు వెళ్ళిపోయారు. మొత్తానికి బాబాయ్-అబ్బాయ్ మద్య మొదలైన వ్యక్తి వివాదం కారణంగా పార్టీ చీలిపోవటమే కాకుండా చిరాగ్ ను రోడ్డున పడేట్లు చేసింది.
This post was last modified on June 16, 2021 10:38 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…