బీహార్లో లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అద్యక్షుడు చిరాగా పాశ్వాన్ కే పార్టీ ఎంపిలు పెద్ద షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ అద్యక్షుడిగా చిరాగ్ ను తప్పించిన ఎంపిలు తాజాగా పార్టీ అధ్యక్షునిగానే తీసి పడేశారు. చిరాగ్ కు ఎల్జేపీకి సంబంధమే లేదని ఎంపిలు కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఛైర్మన్ గా చిరాగ్ ను తొలగించారు. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వచ్చిన అబ్బాయ్ ను పశుపతి తనింట్లోకి కూడా రానీయలేదు. చాలాసేపు రోడ్డుమీదే వెయిట్ చేసి చేసేది లేక వెళ్ళిపోయారు.
రెండు రోజుల క్రితం ఎల్జేపీని చీల్చేసిన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాశర్ చిరాగ్ కు వ్యతిరేకంగా చాలా స్పీడుగా పావులు కదుపుతున్నారు. పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత అబ్బాయ్-బాబాయ్ మధ్య మొదలైన గొడవలే చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పాశ్వాన్ మరణించిన తర్వాత ఓ సమావేశంలో బాబాయ్ తో చిరాగ్ మాట్లాడుతు ‘నువ్వసలు నాకు బాబాయ్ వే కాదు నీకు నాకు రక్త సంబంధమే లేదు’ అని అవమానకరంగా మాట్లాడారట. నిజానికి అప్పటివరకు అన్న పాశ్వాన్ తరపున రాష్ట్రంలో మొత్తం వ్యవహారాలన్నింటినీ పశుపతే చూసుకునేవారట. చిరాగ్ చేతికి పార్టీపగ్గాలు అందిన తర్వాతే పశుపతికి అవమానాలు మొదలైనట్లు సమాచారం. అలాంటి ఘటనలు పెరిగిపోయి చివరకు పార్టీ చీలికకు దారితీసింది.
మొత్తానికి కారణం ఏదైనా పార్టీ రెండుగా చీలిపోయిందన్నది వాస్తవం. బాబాయ్ తో సయోధ్య చేసుకునేందుకు చిరాగ్ చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. బాబాయ్ తో మాట్లాడేందుకు ఇంటికి వచ్చిన అబ్బాయ్ ను ఇంట్లోకి అనుమతించలేదు. దాంతో గంటసేపు రోడ్డుపైనే వెయిట్ చేసిన చిరాగ్ చివరకు వెళ్ళిపోయారు. మొత్తానికి బాబాయ్-అబ్బాయ్ మద్య మొదలైన వ్యక్తి వివాదం కారణంగా పార్టీ చీలిపోవటమే కాకుండా చిరాగ్ ను రోడ్డున పడేట్లు చేసింది.
This post was last modified on June 16, 2021 10:38 am
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…