బీహార్లో లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అద్యక్షుడు చిరాగా పాశ్వాన్ కే పార్టీ ఎంపిలు పెద్ద షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ అద్యక్షుడిగా చిరాగ్ ను తప్పించిన ఎంపిలు తాజాగా పార్టీ అధ్యక్షునిగానే తీసి పడేశారు. చిరాగ్ కు ఎల్జేపీకి సంబంధమే లేదని ఎంపిలు కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఛైర్మన్ గా చిరాగ్ ను తొలగించారు. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వచ్చిన అబ్బాయ్ ను పశుపతి తనింట్లోకి కూడా రానీయలేదు. చాలాసేపు రోడ్డుమీదే వెయిట్ చేసి చేసేది లేక వెళ్ళిపోయారు.
రెండు రోజుల క్రితం ఎల్జేపీని చీల్చేసిన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాశర్ చిరాగ్ కు వ్యతిరేకంగా చాలా స్పీడుగా పావులు కదుపుతున్నారు. పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత అబ్బాయ్-బాబాయ్ మధ్య మొదలైన గొడవలే చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పాశ్వాన్ మరణించిన తర్వాత ఓ సమావేశంలో బాబాయ్ తో చిరాగ్ మాట్లాడుతు ‘నువ్వసలు నాకు బాబాయ్ వే కాదు నీకు నాకు రక్త సంబంధమే లేదు’ అని అవమానకరంగా మాట్లాడారట. నిజానికి అప్పటివరకు అన్న పాశ్వాన్ తరపున రాష్ట్రంలో మొత్తం వ్యవహారాలన్నింటినీ పశుపతే చూసుకునేవారట. చిరాగ్ చేతికి పార్టీపగ్గాలు అందిన తర్వాతే పశుపతికి అవమానాలు మొదలైనట్లు సమాచారం. అలాంటి ఘటనలు పెరిగిపోయి చివరకు పార్టీ చీలికకు దారితీసింది.
మొత్తానికి కారణం ఏదైనా పార్టీ రెండుగా చీలిపోయిందన్నది వాస్తవం. బాబాయ్ తో సయోధ్య చేసుకునేందుకు చిరాగ్ చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. బాబాయ్ తో మాట్లాడేందుకు ఇంటికి వచ్చిన అబ్బాయ్ ను ఇంట్లోకి అనుమతించలేదు. దాంతో గంటసేపు రోడ్డుపైనే వెయిట్ చేసిన చిరాగ్ చివరకు వెళ్ళిపోయారు. మొత్తానికి బాబాయ్-అబ్బాయ్ మద్య మొదలైన వ్యక్తి వివాదం కారణంగా పార్టీ చీలిపోవటమే కాకుండా చిరాగ్ ను రోడ్డున పడేట్లు చేసింది.
This post was last modified on June 16, 2021 10:38 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…