బీహార్లో లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అద్యక్షుడు చిరాగా పాశ్వాన్ కే పార్టీ ఎంపిలు పెద్ద షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ అద్యక్షుడిగా చిరాగ్ ను తప్పించిన ఎంపిలు తాజాగా పార్టీ అధ్యక్షునిగానే తీసి పడేశారు. చిరాగ్ కు ఎల్జేపీకి సంబంధమే లేదని ఎంపిలు కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఛైర్మన్ గా చిరాగ్ ను తొలగించారు. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వచ్చిన అబ్బాయ్ ను పశుపతి తనింట్లోకి కూడా రానీయలేదు. చాలాసేపు రోడ్డుమీదే వెయిట్ చేసి చేసేది లేక వెళ్ళిపోయారు.
రెండు రోజుల క్రితం ఎల్జేపీని చీల్చేసిన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాశర్ చిరాగ్ కు వ్యతిరేకంగా చాలా స్పీడుగా పావులు కదుపుతున్నారు. పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత అబ్బాయ్-బాబాయ్ మధ్య మొదలైన గొడవలే చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పాశ్వాన్ మరణించిన తర్వాత ఓ సమావేశంలో బాబాయ్ తో చిరాగ్ మాట్లాడుతు ‘నువ్వసలు నాకు బాబాయ్ వే కాదు నీకు నాకు రక్త సంబంధమే లేదు’ అని అవమానకరంగా మాట్లాడారట. నిజానికి అప్పటివరకు అన్న పాశ్వాన్ తరపున రాష్ట్రంలో మొత్తం వ్యవహారాలన్నింటినీ పశుపతే చూసుకునేవారట. చిరాగ్ చేతికి పార్టీపగ్గాలు అందిన తర్వాతే పశుపతికి అవమానాలు మొదలైనట్లు సమాచారం. అలాంటి ఘటనలు పెరిగిపోయి చివరకు పార్టీ చీలికకు దారితీసింది.
మొత్తానికి కారణం ఏదైనా పార్టీ రెండుగా చీలిపోయిందన్నది వాస్తవం. బాబాయ్ తో సయోధ్య చేసుకునేందుకు చిరాగ్ చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. బాబాయ్ తో మాట్లాడేందుకు ఇంటికి వచ్చిన అబ్బాయ్ ను ఇంట్లోకి అనుమతించలేదు. దాంతో గంటసేపు రోడ్డుపైనే వెయిట్ చేసిన చిరాగ్ చివరకు వెళ్ళిపోయారు. మొత్తానికి బాబాయ్-అబ్బాయ్ మద్య మొదలైన వ్యక్తి వివాదం కారణంగా పార్టీ చీలిపోవటమే కాకుండా చిరాగ్ ను రోడ్డున పడేట్లు చేసింది.
This post was last modified on June 16, 2021 10:38 am
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…