Political News

రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ?

వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని రైతు చట్టాలు వెంటాడుతున్నాయా ? అవుననే అంటున్నాయి యూపిలోని ప్రతిపక్షాలు. దాదాపు ఏడాది క్రిందట నరేంద్రమోడి సర్కార్ ఆమోదించిన మూడూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని యూనియన్ నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఎట్టి పరిస్ధితుల్లోను చట్టాలను రద్దు చేసేది లేదని మోడి గట్టిగా కూర్చున్నారు. ఎందుకంటే వ్యవసాయ చట్టాలను రద్దు చేయటాన్ని మోడి ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. అందుకనే ఢిల్లీ శివార్లలో రైతులు గడచిన ఏడాదిగా ఎన్ని ఆందోళనలు చేసినా మోడి ఏమాత్రం పట్టించుకోవటంలేదు. చట్టాల అమలుపై కేంద్రమంత్రులతో చర్చలు జరిగినా, సుప్రింకోర్టు జోక్యం చేసుకున్నా పరిష్కారమైతే కనబడలేదు. దాంతో ఇటు కేంద్రప్రభుత్వం అటు రైతుసంఘాల మధ్య ప్రతిష్టంభన కంటిన్యు అవుతోంది.

ఈ నేపధ్యంలోనే తొందరలో జరగబోయే యూపీ ఎన్నికల్లో రైతుల ఆందోళన ప్రభావం పడటం ఖాయమని అర్ధమవుతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణలో యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే లవ్ జీహాద్, గాయ్ ఆతంక్(కౌ టెర్రర) వివాదాలు పెరిగిపోతున్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినేసింది. ఫలితంగా యోగి ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. దీని ప్రభావం మొన్ననే జరిగిన స్దానికసంస్ధల ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది.

సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే రైతు సంఘాలు కూడా తమ ఆందోళనను మరింత ఉధృతం చేయబోతున్నాయి. రాకేష్ తికాయత్ జాట్ వర్గానికి చెందిన నేత. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో జాట్లంతా తికాయత్ కు మద్దతుగా నిలబడ్డారు. అంటే జాట్లంతా బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయినట్లే అనుకోవాలి. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌధరి కూడా తికాయత్ తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించారు.

అంటే ఒకవైపు రైతులు మరోవైపు ఎస్పీ+ఆర్ఎల్డీ, బీఎస్పీ లాంటి బలమైన ప్రతిపక్షాలు ఇదే సమయంలో జనాల్లో వ్యతిరేకత..వెరసి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కష్టమనే సంకేతాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కూడా రైతు సంఘాలు బీజేపీకి ఓట్లేయద్దని పదుల సంఖ్యలో బహిరంగసభలు నిర్వహించాయి. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే మోడిని రైతు చట్టాలు వెంటాడుతున్నట్లే ఉంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on June 16, 2021 10:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago