ఒక ఫొటో.. ఇండియాలో లాక్ డౌన్ కష్టాలకు అద్దం పడుతోంది. వలస కార్మికుల దయనీయ స్థితిని కళ్లకు కడుతోంది. లాక్ డౌన్ గురించి ఎవరు ఏం రాయాలన్నా దానికి సపోర్ట్గా ఆ ఫొటోను వాడుతున్నారు. సోషల్ మీడియాలో వలస కార్మికుల బాధల్ని చూపిస్తూ పెడుతున్న ఫొటోల్లో అది కచ్చితంగా ఉంటోంది. ఇంటికి చేరే మార్గం దొరక్క ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతున్న ఓ నడి వయస్కుడికి సంబంధించిన ఫొటో అది. దాని వెనుక కన్నీళ్లు తెప్పించే కథ ఉంది.
ఢిల్లీలో ఒక లేడీ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో అది. అందులో ఉన్న వ్యక్తి పేరు రామ్ పుకార్ పండిట్. అతడి వయసు 39 ఏళ్లు. రామ్ పుకార్ ఓ భవన నిర్మాణ కార్మికుడు. బీహార్ నుంచి వలస వచ్చి ఢిల్లీలో పనులు చేసుకుంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు అమ్మాయి, ఓ అబ్బాయి ఉన్నారు. వాళ్లంతా తమ స్వస్థలంలోనే ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అతను రెండు నెలలుగా ఢిల్లీలోనే చిక్కుకుపోయి ఉన్నాడు. ఇంటికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఐతే ఇంతలో ఏడాది లోపు వయసున్న అతడి కొడుక్కి జబ్బు చేసింది. సరైన వైద్యం అందలేదు. దీంతో పరిస్థితి విషమించింది. అతడి ప్రాణం నిలిచే అవకాశం లేదని తేలిపోయింది. కొడుకును చివరి చూపు అయినా చూసుకుందామని బయల్దేరాడు రూప్ కుమార్. కానీ అతను చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అక్కడ కొడుకు ప్రాణం పోతోందని ఫోన్లో తెలుసుకున్న అతను విలవిలలాడిపోయాడు.
ఆ బాధతో ఏడుస్తూ మాట్లాడుతుండగా కెమెరా క్లిక్మంది. ఫొటో జర్నలిస్టు అతడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. డబ్బులిచ్చి, పోలీసుల అనుమతి కూడా సంపాదించి అతణ్ని ఢిల్లీ దాటించింది. ఐతే బీహార్లోని బెగుసరాయ్ సిటీకి చేరుకున్నాడు కానీ.. అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్లలేకపోయాడు. ఈలోపే కొడుకు చనిపోయాడు. ఖననం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం బెగసరాయ్లోనే అతను క్వారంటైన్లో ఉన్నాడు.
This post was last modified on May 18, 2020 4:08 pm
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…