Political News

అశోక్ గ‌జ‌ప‌తిరాజుకే ప‌ట్టం.. జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టులో మ‌రో గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది. విజ‌య‌న‌గ‌రం గ‌జ‌ప‌తి వంశీయుల‌కు చెందిన మాన్సాస్ ట్ర‌స్టు, సింహాచ‌లం ఆల‌య ట్ర‌స్టుల చైర్మ‌న్‌గా ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజును రాత్రికిరాత్రి మారుస్తూ.. సీఎం జ‌గ‌న్ జీవో 72ను తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు సోద‌రుడు దివంగ‌త ఆనందగ‌జ‌ప‌తి రాజు కుమార్తె సంచ‌యిత ను నియ‌మించారు.

అప్ప‌ట్లో తీవ్ర వివాదాల‌కు దారితీసిన ఈ వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. జ‌గ‌న్ ఇచ్చిన జీవోను అడ్డు పెట్టుకుని రాత్రికిరాత్రి ఢిల్లీ నుంచి వ‌చ్చిన సంచ‌యిత సింహాచ‌లం దేవ‌స్థానం చైర్మ‌న్‌గా, మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో ఈ వివాదంపై అశోక్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై ప‌లు ద‌ఫాలుగా విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. కొన్నాళ్ల కింద‌టే.. అశోక్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ.. ఉత్త‌ర్వులు ఇచ్చింది. తాజాగా తుది తీర్పు వెలువ‌రించింది.

మాన్సాస్‌, సింహాచల ట్రస్టుల ఛైర్మన్‌ నియామక జీవో 72ను కొట్టేసిన హైకోర్టు.. సంచయిత గజపతిరాజు నియామకం చెల్ల‌ద‌ని తేల్చిచెప్పింది. అశోక్‌ గజపతిరాజును ట్రస్టుల ఛైర్మన్‌గా పునర్నియమించాలని జ‌గ‌న్ స‌ర్కారును ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టులో సవాల్‌ చేసిన అశోక్‌ గజపతిరాజు స‌హా ప్ర‌భుత్వం స‌హా సంచ‌యిత త‌ర‌ఫున వాదనలు విన్న హైకోర్టు.. అశోక్‌కు అనుకూలంగా తీర్పు వెలువ‌రించింది. అంతేకాదు.. మ‌హాల‌క్ష్మి దేవ‌స్థానం ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా కూడా అశోక్‌ను నియ‌మించాల‌ని ఆదేశించింది.

Satya

Recent Posts

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

29 minutes ago

త‌మ‌న్‌కు ఇలా షాకిచ్చారేంటి?

సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో త‌మ‌న్ ఒక‌డు. తెలుగు వ‌ర‌కు చూస్తే కొన్నేళ్ల నుంచి అత‌నే నంబ‌ర్ వ‌న్.…

51 minutes ago

బహదూర్ VS బంధం – ఆషామాషీ పోటీ కాదు

స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…

3 hours ago

కిచిడీ కామెడీకి వంద కోట్ల వసూళ్లు

దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…

3 hours ago

తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…

4 hours ago

ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…

4 hours ago