ఏపీ సీఎం జగన్కు హైకోర్టులో మరో గట్టి దెబ్బతగిలింది. విజయనగరం గజపతి వంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ ట్రస్టుల చైర్మన్గా ఉన్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును రాత్రికిరాత్రి మారుస్తూ.. సీఎం జగన్ జీవో 72ను తీసుకువచ్చారు. ఈ క్రమంలో అశోక్ గజపతిరాజు సోదరుడు దివంగత ఆనందగజపతి రాజు కుమార్తె సంచయిత ను నియమించారు.
అప్పట్లో తీవ్ర వివాదాలకు దారితీసిన ఈ వ్యవహారం.. రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. జగన్ ఇచ్చిన జీవోను అడ్డు పెట్టుకుని రాత్రికిరాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన సంచయిత సింహాచలం దేవస్థానం చైర్మన్గా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ వివాదంపై అశోక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు.. కొన్నాళ్ల కిందటే.. అశోక్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా తుది తీర్పు వెలువరించింది.
మాన్సాస్, సింహాచల ట్రస్టుల ఛైర్మన్ నియామక జీవో 72ను కొట్టేసిన హైకోర్టు.. సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని తేల్చిచెప్పింది. అశోక్ గజపతిరాజును ట్రస్టుల ఛైర్మన్గా పునర్నియమించాలని జగన్ సర్కారును ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టులో సవాల్ చేసిన అశోక్ గజపతిరాజు సహా ప్రభుత్వం సహా సంచయిత తరఫున వాదనలు విన్న హైకోర్టు.. అశోక్కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అంతేకాదు.. మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్గా కూడా అశోక్ను నియమించాలని ఆదేశించింది.
This post was last modified on June 14, 2021 1:45 pm
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…