క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈటెల విషయం ఇలాగుంచితే ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.
ఈ విషయంలోనే బీజేపీ లాటరీ కొట్టినట్లే అనే ప్రచారం జరుగుతోంది. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఈటెలతో పాటు మాజీ ఎంఎల్ఏ ఏనుగు రవీంద్రరెడ్డి, మాజీ ఎంపి రమేష్ రాథోడ్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమతో పాటు మరికొందరు కూడా బీజేపీలో చేరబోతున్నారట. ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్ధాతమరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి బీజేపీలో ఒకేసారి ఇంతమంది నేతలు ఎప్పుడూ చేరలేదు. గతంలో కూడా కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ నుండి కొందరు సీనియర్లు బీజేపీలో చేరినా వారంతా విడివిడిగా చేరారు. అంతేకానీ ఒకేసారి ఐదారుమంది సీనియర్ నేతలు కమలంపార్టీలో చేరలేదు. ఈటెలతో పాటు ఏనుగు, రమేష్ రాథోడ్, తుల ఉమ గట్టి నేతలుగా పేరున్న వాళ్ళనే చెప్పాలి.
ఒకేసారి అందులోను కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా బీజేపీలో చేరటమంటే కమలం పార్టీకి హుషారు వచ్చినట్లే. మరి ఈటల రాజీనామా ద్వారా ఖాళీఅయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూడాల్సిందే. ఆ ఎన్నికలో ఈటల మళ్ళీ గెలిస్తే కేసీయార్ వ్యతిరేకులంతా స్పీడవుతారు. లేకపోతే కేసీయార్ జోరే కంటిన్యు అవుతుంది.
This post was last modified on June 13, 2021 1:16 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…