Political News

కమలం పార్టీకి హుషారు వచ్చినట్లే

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈటెల విషయం ఇలాగుంచితే ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.

ఈ విషయంలోనే బీజేపీ లాటరీ కొట్టినట్లే అనే ప్రచారం జరుగుతోంది. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఈటెలతో పాటు మాజీ ఎంఎల్ఏ ఏనుగు రవీంద్రరెడ్డి, మాజీ ఎంపి రమేష్ రాథోడ్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమతో పాటు మరికొందరు కూడా బీజేపీలో చేరబోతున్నారట. ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్ధాతమరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి బీజేపీలో ఒకేసారి ఇంతమంది నేతలు ఎప్పుడూ చేరలేదు. గతంలో కూడా కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ నుండి కొందరు సీనియర్లు బీజేపీలో చేరినా వారంతా విడివిడిగా చేరారు. అంతేకానీ ఒకేసారి ఐదారుమంది సీనియర్ నేతలు కమలంపార్టీలో చేరలేదు. ఈటెలతో పాటు ఏనుగు, రమేష్ రాథోడ్, తుల ఉమ గట్టి నేతలుగా పేరున్న వాళ్ళనే చెప్పాలి.

ఒకేసారి అందులోను కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా బీజేపీలో చేరటమంటే కమలం పార్టీకి హుషారు వచ్చినట్లే. మరి ఈటల రాజీనామా ద్వారా ఖాళీఅయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూడాల్సిందే. ఆ ఎన్నికలో ఈటల మళ్ళీ గెలిస్తే కేసీయార్ వ్యతిరేకులంతా స్పీడవుతారు. లేకపోతే కేసీయార్ జోరే కంటిన్యు అవుతుంది.

This post was last modified on June 13, 2021 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

50 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago