Political News

సీఎం జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ లేఖ‌.. డిమాండ్ ఏంటంటే

సీఐడీ పోలీసుల అరెస్టు.. త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌నే వాద‌న‌.. కోర్టు బెయిల్ మంజూరు వంటి అనేక అంశాల నేప‌థ్యంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఈ లేఖ అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ లేఖ‌లో ఎక్క‌డా త‌న‌పై సీఐడీ అధికారుల దౌర్జ‌న్యం కానీ, ప్ర‌భుత్వం ప‌రంగా త‌న‌పై చూపిస్తున్న వివ‌క్ష‌ను కానీ.. ఎంపీ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సామాజిక పింఛ‌ను దారుల‌కు పెంచుతామ‌న్న పింఛ‌న్ సొమ్ముల‌పై సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తూ.. ఎంపీ ర‌ఘురామ లేఖ‌ను సంధించ‌డం గ‌మ‌నార్హం. “గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు పింఛ‌ను దారుల ఓట్ల‌ను మ‌న పార్టీ వైపు తిప్పుకొనేందుకు మీరు ఎంతో శ్ర‌మించారు. అప్ప‌టి వ‌ర‌కు రూ.2000గా ఉన్న పింఛ‌ను మొత్తాన్ని రూ.3000ల‌కు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు” అని ర‌ఘురామ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

అదేస‌మ‌యంలో.. “ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పింఛ‌న్ పెంచి ఉంటే.. ప్ర‌తి ఒక్క‌రికీ రూ.2500 చొప్పున అంది ఉండాల్సింద‌ని.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పింఛ‌నును కేవ‌లం రూ.250 చొప్పున మాత్ర‌మే పెంచారు. ఇప్ప‌టికైనా పింఛ‌ను దారుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి. త‌క్ష‌ణమే పింఛ‌న్‌ను రూ.2750 చేయండి. అదేస‌మ‌యంలో ఈ రెండేళ్ల కాలంలో పింఛ‌న్ దారులు న‌ష్ట‌పోయిన‌.. సొమ్మును కూడా క‌లిపి రూ.3000 చొప్పున ఇవ్వండి” అని ర‌ఘురామ లేఖ‌లో డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ లేఖపై వైసీపీ వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

This post was last modified on June 10, 2021 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago