Political News

సీఎం జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ లేఖ‌.. డిమాండ్ ఏంటంటే

సీఐడీ పోలీసుల అరెస్టు.. త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌నే వాద‌న‌.. కోర్టు బెయిల్ మంజూరు వంటి అనేక అంశాల నేప‌థ్యంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఈ లేఖ అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ లేఖ‌లో ఎక్క‌డా త‌న‌పై సీఐడీ అధికారుల దౌర్జ‌న్యం కానీ, ప్ర‌భుత్వం ప‌రంగా త‌న‌పై చూపిస్తున్న వివ‌క్ష‌ను కానీ.. ఎంపీ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సామాజిక పింఛ‌ను దారుల‌కు పెంచుతామ‌న్న పింఛ‌న్ సొమ్ముల‌పై సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తూ.. ఎంపీ ర‌ఘురామ లేఖ‌ను సంధించ‌డం గ‌మ‌నార్హం. “గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు పింఛ‌ను దారుల ఓట్ల‌ను మ‌న పార్టీ వైపు తిప్పుకొనేందుకు మీరు ఎంతో శ్ర‌మించారు. అప్ప‌టి వ‌ర‌కు రూ.2000గా ఉన్న పింఛ‌ను మొత్తాన్ని రూ.3000ల‌కు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు” అని ర‌ఘురామ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

అదేస‌మ‌యంలో.. “ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పింఛ‌న్ పెంచి ఉంటే.. ప్ర‌తి ఒక్క‌రికీ రూ.2500 చొప్పున అంది ఉండాల్సింద‌ని.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పింఛ‌నును కేవ‌లం రూ.250 చొప్పున మాత్ర‌మే పెంచారు. ఇప్ప‌టికైనా పింఛ‌ను దారుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి. త‌క్ష‌ణమే పింఛ‌న్‌ను రూ.2750 చేయండి. అదేస‌మ‌యంలో ఈ రెండేళ్ల కాలంలో పింఛ‌న్ దారులు న‌ష్ట‌పోయిన‌.. సొమ్మును కూడా క‌లిపి రూ.3000 చొప్పున ఇవ్వండి” అని ర‌ఘురామ లేఖ‌లో డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ లేఖపై వైసీపీ వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

This post was last modified on June 10, 2021 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ పాలిత రాష్ట్రంలో… రేప్ నిందితుడికి ఘ‌న స్వాగ‌తం!

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వారు ఏం చేసినా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి.…

14 minutes ago

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

2 hours ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

2 hours ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

3 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

3 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

3 hours ago