సీఐడీ పోలీసుల అరెస్టు.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే వాదన.. కోర్టు బెయిల్ మంజూరు వంటి అనేక అంశాల నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ లేఖలో ఎక్కడా తనపై సీఐడీ అధికారుల దౌర్జన్యం కానీ, ప్రభుత్వం పరంగా తనపై చూపిస్తున్న వివక్షను కానీ.. ఎంపీ ప్రస్తావించకపోవడం గమనార్హం.
అయితే.. గత ఎన్నికల సమయంలో సామాజిక పింఛను దారులకు పెంచుతామన్న పింఛన్ సొమ్ములపై సీఎం జగన్ను నిలదీస్తూ.. ఎంపీ రఘురామ లేఖను సంధించడం గమనార్హం. “గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు పింఛను దారుల ఓట్లను మన పార్టీ వైపు తిప్పుకొనేందుకు మీరు ఎంతో శ్రమించారు. అప్పటి వరకు రూ.2000గా ఉన్న పింఛను మొత్తాన్ని రూ.3000లకు పెంచుతామని హామీ ఇచ్చారు” అని రఘురామ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
అదేసమయంలో.. “ఇప్పటి వరకు ఈ పింఛన్ పెంచి ఉంటే.. ప్రతి ఒక్కరికీ రూ.2500 చొప్పున అంది ఉండాల్సిందని.. కానీ, ఇప్పటి వరకు ఈ పింఛనును కేవలం రూ.250 చొప్పున మాత్రమే పెంచారు. ఇప్పటికైనా పింఛను దారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తక్షణమే పింఛన్ను రూ.2750 చేయండి. అదేసమయంలో ఈ రెండేళ్ల కాలంలో పింఛన్ దారులు నష్టపోయిన.. సొమ్మును కూడా కలిపి రూ.3000 చొప్పున ఇవ్వండి” అని రఘురామ లేఖలో డిమాండ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ లేఖపై వైసీపీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొంది.
This post was last modified on June 10, 2021 5:14 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…