సీఐడీ పోలీసుల అరెస్టు.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే వాదన.. కోర్టు బెయిల్ మంజూరు వంటి అనేక అంశాల నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ లేఖలో ఎక్కడా తనపై సీఐడీ అధికారుల దౌర్జన్యం కానీ, ప్రభుత్వం పరంగా తనపై చూపిస్తున్న వివక్షను కానీ.. ఎంపీ ప్రస్తావించకపోవడం గమనార్హం.
అయితే.. గత ఎన్నికల సమయంలో సామాజిక పింఛను దారులకు పెంచుతామన్న పింఛన్ సొమ్ములపై సీఎం జగన్ను నిలదీస్తూ.. ఎంపీ రఘురామ లేఖను సంధించడం గమనార్హం. “గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు పింఛను దారుల ఓట్లను మన పార్టీ వైపు తిప్పుకొనేందుకు మీరు ఎంతో శ్రమించారు. అప్పటి వరకు రూ.2000గా ఉన్న పింఛను మొత్తాన్ని రూ.3000లకు పెంచుతామని హామీ ఇచ్చారు” అని రఘురామ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
అదేసమయంలో.. “ఇప్పటి వరకు ఈ పింఛన్ పెంచి ఉంటే.. ప్రతి ఒక్కరికీ రూ.2500 చొప్పున అంది ఉండాల్సిందని.. కానీ, ఇప్పటి వరకు ఈ పింఛనును కేవలం రూ.250 చొప్పున మాత్రమే పెంచారు. ఇప్పటికైనా పింఛను దారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తక్షణమే పింఛన్ను రూ.2750 చేయండి. అదేసమయంలో ఈ రెండేళ్ల కాలంలో పింఛన్ దారులు నష్టపోయిన.. సొమ్మును కూడా కలిపి రూ.3000 చొప్పున ఇవ్వండి” అని రఘురామ లేఖలో డిమాండ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ లేఖపై వైసీపీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొంది.
This post was last modified on June 10, 2021 5:14 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…