బెంగాలీ నటి, టీఎంసీ నుస్రత్.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సాధారణంగా రాజకీయ నాయకులు వార్తల్లోకి ఎక్కారంటే ఏదైనా పొలిటికల్ ఇష్యూ అయ్యి ఉంటుంది. అయితే.. నుస్రత్ జహాన్ మాత్రం.. తన పెళ్లి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన రూమర్స్ తో వార్తల్లోకి ఎక్కారు.
గత కొద్దిరోజులుగా… నుస్రత్ గర్భం దాల్చారంటూ వస్తున్నారు. మరో వైపు ఆమె భర్తతో కలిసి ఉండటం లేదంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా.. వాటిపై ఆమె స్పందించారు. తాను తన భర్త నుంచి విడిపోయానని స్పష్టం చేశారు.
అసలు నిఖిల్ తో తన పెళ్లి టర్కిష్ చట్టం ప్రకారం జరిగింది.. అది ఇండియాలో చెల్లదని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలోనే నిఖిల్ జైన్పై పలు ఆరోపణలు చేశారు నుస్రత్. తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను నిఖిల్ అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని నిధులను దుర్వినియోగం చేశారన్నారు.
ఇదిలా ఉండగా.. నుస్రత్ గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. నుస్రత్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తనకు ఎటువంటి సంబంధంలేదని నిఖిల్ నేషనల్ మీడియాతో చెప్పినట్లు కూడా వార్తలొస్తున్నాయి. పెళ్లి బంధం తెంచుకున్నట్లు ప్రకటించిన ఆమె.. తన ప్రగ్నెన్సీ గురించి మాత్రం నోరు విప్పలేదు.
కాగా.. నుస్రత్..నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను జూన్ 19,2019న టర్కీలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బెంగాల్లో టీఎంసీ తరపున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దాంతో అటు పెళ్లి, ఆ వెంటనే రాజకీయ అరంగేట్రం అన్నీ ఆమెకు కలిసి వస్తున్నాయనుకున్నారు. ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్.. కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే.. ఆ బంధం ఏంతో కాలం నిలపడలేదు.
This post was last modified on June 9, 2021 5:17 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…