ఏపీలో కరోనా కట్టడి కోసం జగన్ సర్కారు కొన్నాళ్లుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ దశల వారీగా పెంచుతున్నారు. గత నెలలో ప్రారంబించిన ఈ కర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమలు చేశారు. అయితే.. సాధారణ ప్రజలకు, వ్యాపారులకు, హాకర్లకు ఒకింత వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక, మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
కర్ఫ్యూ సమయంలో ఎలాంటి వ్యాపారాలు జరగకుండా.. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ప్రభుత్వం కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే.. అదేసమయంలో అత్యవసర సేవలు సహా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు అంటే.. ఈ నెల 1న తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 10తో కర్ఫ్యూ ముగి యనుంది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కర్ఫ్యూను మరో 10 రోజుల పాటు పొడిగించారు. అయితే.. ఈ పొడిగింపులోనూ ప్రజలకు ఒకింత సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ వెసులుబాటును మరో రెండు గంటలు పెంచారు. అంటే.. ఈ నెల 10వ తారీకు నుంచి కర్ఫ్యూ వెసులుబాటు సమయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. తాజాగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం ప్రకటించారు.
ఈ నిర్ణయంతో వ్యాపారులకు, హాకర్లకు, సాధారణ ప్రజానీకానికి మేలు జరుగుతుందని.. మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ వెసులుబాటుతో వ్యాపారాలు సజావుగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సర్కారు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇదేసమయంలో అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. మరోవైపు ఈ నెల ఆఖరుతో కర్ఫ్యూను దాదాపు ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దీంతోనే సీఎం కర్ఫ్యూను సడలించారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 7, 2021 2:03 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…