ఏపీలో కరోనా కట్టడి కోసం జగన్ సర్కారు కొన్నాళ్లుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ దశల వారీగా పెంచుతున్నారు. గత నెలలో ప్రారంబించిన ఈ కర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమలు చేశారు. అయితే.. సాధారణ ప్రజలకు, వ్యాపారులకు, హాకర్లకు ఒకింత వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక, మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
కర్ఫ్యూ సమయంలో ఎలాంటి వ్యాపారాలు జరగకుండా.. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ప్రభుత్వం కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే.. అదేసమయంలో అత్యవసర సేవలు సహా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు అంటే.. ఈ నెల 1న తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 10తో కర్ఫ్యూ ముగి యనుంది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కర్ఫ్యూను మరో 10 రోజుల పాటు పొడిగించారు. అయితే.. ఈ పొడిగింపులోనూ ప్రజలకు ఒకింత సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ వెసులుబాటును మరో రెండు గంటలు పెంచారు. అంటే.. ఈ నెల 10వ తారీకు నుంచి కర్ఫ్యూ వెసులుబాటు సమయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. తాజాగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం ప్రకటించారు.
ఈ నిర్ణయంతో వ్యాపారులకు, హాకర్లకు, సాధారణ ప్రజానీకానికి మేలు జరుగుతుందని.. మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ వెసులుబాటుతో వ్యాపారాలు సజావుగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సర్కారు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇదేసమయంలో అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. మరోవైపు ఈ నెల ఆఖరుతో కర్ఫ్యూను దాదాపు ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దీంతోనే సీఎం కర్ఫ్యూను సడలించారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 7, 2021 2:03 pm
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…