Political News

బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. ఎప్ప‌టిదాకా అంటే..!


ఏపీలో క‌రోనా క‌ట్టడి కోసం జ‌గ‌న్ స‌ర్కారు కొన్నాళ్లుగా అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ ద‌శ‌ల వారీగా పెంచుతున్నారు. గ‌త నెల‌లో ప్రారంబించిన ఈ క‌ర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమ‌లు చేశారు. అయితే.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, వ్యాపారుల‌కు, హాక‌ర్ల‌కు ఒకింత వెసులుబాటు క‌ల్పించారు. ఈ క్ర‌మంలోనే ఉద‌యం 6గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఇక‌, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 వ‌ర‌కు క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.

క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎలాంటి వ్యాపారాలు జ‌ర‌గ‌కుండా.. ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రాకుండా ప్ర‌భుత్వం క‌ట్టుది ట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే.. అదేస‌మ‌యంలో అత్యవ‌స‌ర సేవ‌లు స‌హా భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చింది. దీంతో ప్ర‌జా జీవ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. ఈ నెల 1న తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఈ నెల 10తో క‌ర్ఫ్యూ ముగి యనుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌ర్ఫ్యూను మ‌రో 10 రోజుల పాటు పొడిగించారు. అయితే.. ఈ పొడిగింపులోనూ ప్ర‌జ‌ల‌కు ఒకింత సానుకూల నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఉన్న క‌ర్ఫ్యూ వెసులుబాటును మ‌రో రెండు గంట‌లు పెంచారు. అంటే.. ఈ నెల 10వ తారీకు నుంచి క‌ర్ఫ్యూ వెసులుబాటు స‌మ‌యం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. తాజాగా జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యంతో వ్యాపారుల‌కు, హాక‌ర్ల‌కు, సాధార‌ణ ప్ర‌జానీకానికి మేలు జ‌రుగుతుంద‌ని.. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ వెసులుబాటుతో వ్యాపారాలు స‌జావుగా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌ర్కారు అభిప్రాయ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో అత్యవ‌స‌ర సేవ‌లు య‌థాత‌థంగా కొన‌సాగ‌నున్నాయి. మ‌రోవైపు ఈ నెల ఆఖ‌రుతో క‌ర్ఫ్యూను దాదాపు ఎత్తివేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతోనే సీఎం క‌ర్ఫ్యూను స‌డ‌లించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 7, 2021 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

1 hour ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

4 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

6 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

7 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

8 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

8 hours ago