Political News

బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. ఎప్ప‌టిదాకా అంటే..!


ఏపీలో క‌రోనా క‌ట్టడి కోసం జ‌గ‌న్ స‌ర్కారు కొన్నాళ్లుగా అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ ద‌శ‌ల వారీగా పెంచుతున్నారు. గ‌త నెల‌లో ప్రారంబించిన ఈ క‌ర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమ‌లు చేశారు. అయితే.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, వ్యాపారుల‌కు, హాక‌ర్ల‌కు ఒకింత వెసులుబాటు క‌ల్పించారు. ఈ క్ర‌మంలోనే ఉద‌యం 6గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఇక‌, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 వ‌ర‌కు క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.

క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎలాంటి వ్యాపారాలు జ‌ర‌గ‌కుండా.. ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రాకుండా ప్ర‌భుత్వం క‌ట్టుది ట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే.. అదేస‌మ‌యంలో అత్యవ‌స‌ర సేవ‌లు స‌హా భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చింది. దీంతో ప్ర‌జా జీవ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. ఈ నెల 1న తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఈ నెల 10తో క‌ర్ఫ్యూ ముగి యనుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌ర్ఫ్యూను మ‌రో 10 రోజుల పాటు పొడిగించారు. అయితే.. ఈ పొడిగింపులోనూ ప్ర‌జ‌ల‌కు ఒకింత సానుకూల నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఉన్న క‌ర్ఫ్యూ వెసులుబాటును మ‌రో రెండు గంట‌లు పెంచారు. అంటే.. ఈ నెల 10వ తారీకు నుంచి క‌ర్ఫ్యూ వెసులుబాటు స‌మ‌యం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. తాజాగా జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యంతో వ్యాపారుల‌కు, హాక‌ర్ల‌కు, సాధార‌ణ ప్ర‌జానీకానికి మేలు జ‌రుగుతుంద‌ని.. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ వెసులుబాటుతో వ్యాపారాలు స‌జావుగా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌ర్కారు అభిప్రాయ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో అత్యవ‌స‌ర సేవ‌లు య‌థాత‌థంగా కొన‌సాగ‌నున్నాయి. మ‌రోవైపు ఈ నెల ఆఖ‌రుతో క‌ర్ఫ్యూను దాదాపు ఎత్తివేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతోనే సీఎం క‌ర్ఫ్యూను స‌డ‌లించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 7, 2021 2:03 pm

Share

Recent Posts

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

1 hour ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

2 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

10 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

11 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

11 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

15 hours ago