Political News

బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. ఎప్ప‌టిదాకా అంటే..!


ఏపీలో క‌రోనా క‌ట్టడి కోసం జ‌గ‌న్ స‌ర్కారు కొన్నాళ్లుగా అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ ద‌శ‌ల వారీగా పెంచుతున్నారు. గ‌త నెల‌లో ప్రారంబించిన ఈ క‌ర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమ‌లు చేశారు. అయితే.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, వ్యాపారుల‌కు, హాక‌ర్ల‌కు ఒకింత వెసులుబాటు క‌ల్పించారు. ఈ క్ర‌మంలోనే ఉద‌యం 6గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఇక‌, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 వ‌ర‌కు క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.

క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎలాంటి వ్యాపారాలు జ‌ర‌గ‌కుండా.. ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రాకుండా ప్ర‌భుత్వం క‌ట్టుది ట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే.. అదేస‌మ‌యంలో అత్యవ‌స‌ర సేవ‌లు స‌హా భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చింది. దీంతో ప్ర‌జా జీవ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. ఈ నెల 1న తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఈ నెల 10తో క‌ర్ఫ్యూ ముగి యనుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌ర్ఫ్యూను మ‌రో 10 రోజుల పాటు పొడిగించారు. అయితే.. ఈ పొడిగింపులోనూ ప్ర‌జ‌ల‌కు ఒకింత సానుకూల నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఉన్న క‌ర్ఫ్యూ వెసులుబాటును మ‌రో రెండు గంట‌లు పెంచారు. అంటే.. ఈ నెల 10వ తారీకు నుంచి క‌ర్ఫ్యూ వెసులుబాటు స‌మ‌యం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. తాజాగా జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యంతో వ్యాపారుల‌కు, హాక‌ర్ల‌కు, సాధార‌ణ ప్ర‌జానీకానికి మేలు జ‌రుగుతుంద‌ని.. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ వెసులుబాటుతో వ్యాపారాలు స‌జావుగా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌ర్కారు అభిప్రాయ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో అత్యవ‌స‌ర సేవ‌లు య‌థాత‌థంగా కొన‌సాగ‌నున్నాయి. మ‌రోవైపు ఈ నెల ఆఖ‌రుతో క‌ర్ఫ్యూను దాదాపు ఎత్తివేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతోనే సీఎం క‌ర్ఫ్యూను స‌డ‌లించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 7, 2021 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

53 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago