Political News

‘5జీ’ పై ఎందుకంత ర‌గ‌డ‌.. వాస్త‌వాలు ఏంటి?

కొన్నాళ్ల కింద‌ట శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా వ‌చ్చిన ‘రోబో 2.0’ సినిమా గుర్తుంది క‌దా! సెల్ ఫోన్ ట‌వ‌ర్లు, వాటి నుంచి వ‌చ్చే రేడియేష‌న్ల కార‌ణంగా.. పక్షులు చ‌నిపోతున్నాయ‌ని.. సో.. సెల్ ఫోన్ వినియోగం త‌గ్గించాల‌ని, రేడియేష‌న్ కూడా త‌గ్గించాల‌నే థీమ్‌తో వ‌చ్చిన మూవీ అది. అప్ప‌ట్లో.. అంటే ఆ సినిమా విడుద‌ల‌య్యేనాటికి.. మ‌న దేశంలో 4జీ మాత్ర‌మే వ‌చ్చింది. 4జీ వ‌చ్చిన సంద‌ర్భంలోనే ద‌ర్శ‌కుడు శంక‌ర్ మూవీ తీశారు. అయితే.. అప్ప‌ట్లో కేవ‌లం పక్షుల‌పై మాత్ర‌మే రేడియేష‌న్ ప్ర‌భావం ఉంటుంద‌ని మూవీ చెప్పింది.

వివాదం ఇదీ..

అయితే.. ఇప్పుడు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్న 5జీ(ఫిఫ్త్ జ‌న‌రేష‌న్) టెక్నాల‌జీతో మ‌నుషుల‌పై కూడా ప్ర‌భావం ఉంటుంద‌ని.. పెద్ద ఎత్తున నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌శుప‌క్ష్యాదుల‌తోపాటు ప్రాణి కోటిపై 5జీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. దీంతో 5జీ రాక‌పై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, మాన‌వ హ‌క్కుల ఉద్య‌మ‌కారులు కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నాయి. 5జీ వ‌ద్ద‌ని.. వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే..కేంద్రం మాత్రం 5జీ వైపు మొగ్గు చూపుతోంది.

కాయ్ ఏమందంటే..

ఈ విష‌యంలో ఇంకా నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. 5జీ ఫోన్ల త‌యారీకి మాత్రంకేంద్రం ప‌చ్చ‌జెండా ఊప‌డంతో ఇప్పుడు ఇది వివాదంగా మారింది. దీనిపై స్పందించిన‌… సెల్యుల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మాత్రం.. 5జీ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యం పైనా ప్రభావం చూపదని తెలిపింది. 5జీ టెక్నాలజీ పూర్తి సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని కాయ్‌ వివరించింది. రాబోయే కాలంలో 5జీ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విస్తృతమైన ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంది.

బ‌డా సంస్థ‌ల మొగ్గు!

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి అతి పెద్ద టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తక్కువ రేడియేషన్‌తోనే ఈ సేవలను తీసుకురానున్నాయి. ‘5జీ విషయంలో అంతర్జాతీయంగా ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ ప్రమాణాలతో పోలిస్తే పదో వంతు మాత్రమే ఉండేలా భారత్‌ నిబంధనలు విధించింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్న ప్రతిసారీ ఇలాంటి అసత్య ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి’ అని కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ హైకోర్టు కొట్టేసినా..

తాజాగా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా వేసిన పిటిషన్‌ను డిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా డిల్లీ కోర్టు తీర్పును ఎస్పీ కొచ్చర్‌ స్వాగతించారు. సామాజిక మాధ్యమాల వేదికగా 5జీ విషయంలో వచ్చే అసత్య సందేశాలను నమ్మొద్దని కొచ్చర్‌ పేర్కొన్నారు. కానీ, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తామ‌ని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు 5జీపై మోడీ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on June 7, 2021 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

36 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

44 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago