మనదేశంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన మొహూల్ చోక్సీ వ్యవహారం చాలా అనుమానాస్పదంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుండి రు. 13500 కోట్లు దోచుకున్న చోక్సీ మూడేళ్ళ క్రితం విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఆయన ఆచూకి కూడా తెలీలేదు. అయితే చివరకు ఆంటీగ్వా దీవుల్లో ఉన్నాడని కనుక్కున్నారు. అక్కడి నుండి మనదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కేంద్రం ఇలా ప్రయత్నాలు మొదలుపెట్టిందో లేదో వెంటనే చోక్సీ ఆంటీగ్వా నుండి డొమినికాకు పారిపోయాడు. తనను కిడ్నాప్ చేసి డొమినికాకు ఎత్తుకెళ్ళిపోయారని చోక్సీ వాదిస్తున్నాడు. అయితే డొమినికా పోలీసులు మాత్రం అక్రమంగా, ఉద్దేశ్యపూర్వకంగానే తమ దేశంలోకి చొరబడ్డాడని వాదిస్తున్నారు. ఇదే విషయమై చోక్సీపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇక్కడే చోక్సీ వ్యవహారశైలిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంట భారత్ కు రావటం ఇష్టంలేని చోక్సీనే ఉద్దేశ్యపూర్వకంగా ఏదో తప్పు చేయటం కొంతకాలం పాటు అదే దేశంలో ఉండేందుకు ప్రయత్నించటం ఆర్ధిక నేరగాళ్ళకు అలవాటే. ఇప్పటికే లండన్ కు పారిపోయిన విజయామాల్య, నీరవ్ మోడి ఇదే పద్దతిలో భారత్ రాకుండా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తాముంటున్న దేశాల్లోనే ఏదో ఓ నేరమో లేకపోతే తప్పు చేయటమో చేస్తారు. దాంతో అక్కడి చట్టాల ప్రకారం వాళ్ళపై విచారణ మొదలవుతుంది. ఆ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలీదు.
ఇక్కడ చోక్సీ బ్రదర్స్ కూడా డొమినికాలోనే ఉండేందుకు ఉన్నతస్ధాయి వ్యక్తులకు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెప్పారనే ఆరోపణలు వినబడతున్నాయి. ఆరోపణలు నిజమే అయితే చోక్సీని భారత్ కు అప్పగించే కార్యక్రమం ఇప్పట్లో పూర్తికాదు. ఎందుకంటే అక్కడి కోర్టుల్లో విచారణ తేదీలు మారుతుంటాయే కానీ ఎప్పటికీ పూర్తికాదు. విచిత్రమేమిటంటే చోక్సీ భారత్ లో ఉన్నపుడే విదేశాల్లో తనకు అనుకూలంగా అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడట. కాబట్టి చోక్సీ ఖర్మ కాలితే తప్ప మామూలుగా అయితే మనదేశానికి ఇప్పట్లో వచ్చేది అనుమానమనే చెప్పాలి.
This post was last modified on June 6, 2021 7:13 am
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…