Political News

ఈటలను బీజేపీ అవమానిస్తోందా ?

‘పార్టీ నియమావళి ప్రకారం ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన తర్వాతే మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారు’. ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు. బండి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే నియమావళి పేరుతో ఈటలను బీజేపీ అవమానిస్తోందనే చర్చ పెరిగిపోతోంది. ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకునేటపుడు ముందు పదవికి రాజీనామా చేయాలనే నియమావళి ఒకటుందని కూడా చాలామందికి తెలీదు.

ఎందుకంటే ఇలాంటి నియమావళిని పాటించినట్లు ఎక్కడా వినలేదు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే రెండోసారి గెలిచింది. రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వెంటనే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించారు. మరి వాళ్ళు అప్పుడు ఎంపి పదవులకు రాజీనామాలు చేయలేదు. బండి చెబుతున్న పార్టీ నియమావళి అపుడు వారికి ఎందుకు వర్తింపచేయలేదు ?

ఇదే నియమావళి పశ్చిమబెంగాల్లో వర్తించదా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 29 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను తృణమూల్ కాంగ్రెస్ లో నుండి బీజేపీలోకి లాక్కున్నారు. పార్టీ ఫిరాయించేటపుడు ఎంఎల్ఏలు కానీ ఎంపిలు కానీ తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. పైగా పార్టీలు ఫిరాయించిన వారందరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే బీజేపీ కండువాలు కప్పుకున్నారు.

ఏపి, బెంగాల్లో ప్రజాప్రతినిధులకు వర్తించని పార్టీ నియమావళి గురించి తెలంగాణాలో మాత్రమే బండి సంజయ్ ఎందుకని ప్రస్తావిస్తున్నట్లు ? ఏపిలో నలుగురు రాజ్యసభ ఎంపిలు తన పార్టీలోకి ఫిరాయించటం బీజేపికి చాలా అవసరం. అలాగే తృణమూల్ ఎంఎల్ఏలు, ఎంపిలు చేరటం కూడా బీజేపీకి చాలా అవసరం. కాబట్టి వాళ్ళు పార్టీలు ఫిరాయించినా రాజీనామాలు అడగలేదు. నియమావళి పార్టీ ఫిరాయించేవాళ్ళకు కాదు పార్టీలో చేరేవారికి మాత్రమే వర్తిస్తుందన్నట్లుగా ఉంది బండి వ్యాఖ్యలు.

ఇక తెలంగాణా బీజేపీలో చేరటం రాజేందర్ అవసరమని కమలంపార్టీ నేతలు భావిస్తున్నారా ? తన అవసరార్ధం వస్తున్నారు కాబట్టే ఈటల ముందుగా రాజీనామా చేయాలని షరతు విధించినట్లున్నారు. అంటే బీజేపీ అవసరమైతే ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. అదే నేతల అవసరమైతే మాత్రం పార్టీ నియమావళని ఇంకోటని కతలు చెబుతున్నారు. మొత్తానికి పార్టీలోకి చేర్చుకునే ముందే ఈటలను నియమావళి పేరుతో బీజేపీ అవమానిస్తున్నదనే చర్చ పెరిగిపోతోంది.

This post was last modified on June 4, 2021 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉచితాల‌తో మ‌భ్య‌పెట్టాల‌ని చూశారు: వెంక‌య్య కామెంట్స్‌

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నాయ‌కుడు ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు.. తాజాగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీ నేత‌ల‌పై సెట‌ర్లు గుప్పించారు.…

26 minutes ago

టాక్ తేడాగా ఉన్నా కలెక్షన్లు అదిరిపోతున్నాయ్

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…

1 hour ago

బాలయ్యకు ‘జాట్’ ఫార్ములా వద్దు

ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…

1 hour ago

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…

2 hours ago

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

4 hours ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

4 hours ago