జూపూడి ప్రభాకర్. దాదాపు అందరూ మరిచిపోయిన నాయకుడు. టీడీపీ సర్కారు హయాంలో ఎస్సీ కార్పొరే షన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన దళిత నేత. ఇప్పటి వరకు అంటే.. దాదాపు రెండేళ్లుగా ఎక్కడా ఊసులో కూడా లేని జూపూడి ఒక్కసారిగా మీడియాలోకి వచ్చారు. హఠాత్తుగా టీడీపీపైనా.. చంద్రబాబు పైనా.. ఆయన కుమారుడిపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దళితులకు మీరు ఏం చేశారు? అంటూ జూపూడి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ప్రభుత్వం ప్రజలకు డబ్బులు పంచడాన్ని భారీ ఎత్తున సమర్ధించారు. అసలు ప్రభుత్వం ఉన్నదే పప్పుబెల్లాల మాదిరిగా పంపకాలు చేయడానికేనని జూపూడి భాష్యం చెప్పారు. జగన్ను విమర్శించే అర్హత టీడీపీ నేతలకు ఏమాత్రం లేదన్నారు. మొత్తంగా టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జూపూడి.
అయితే.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత.. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన జూపూడి ఈ రేంజ్లో టీడీపీపై విరుచుకుపడడం వెనుక ‘పెద్ద రీజన్’ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఊరికేనే జూపూడి మీడియా ముందుకు రాలేదని అంటున్నారు. పెద్ద ప్లాన్ తోనే జూపూడి జగన్ను , ఆయన సర్కారును, సీఎం నిర్ణయాలను వెనుకేసుకు వచ్చారని చెబుతున్నారు.
నిలకడలేని రాజకీయాలు చేయడంలో ముందుండే జూపూడి.. గతంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గళం వినిపించిన విషయాన్ని చెబుతున్నారు. అదేసమయంలో వైసీపీ తరఫున కొండపి నుంచి పోటీ చేయడం అక్కడ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. మళ్లీ చంద్రబాబు చెంతకు చేరడం.. ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని దక్కించుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పడిపోవడంతో మళ్లీ జగన్ చెంతకు చేరిపోయారు.
ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జూపూడి.. ఎమ్మెల్సీ పదవిపై ఆశతోనే టీడీపీని టార్గెట్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ పదవుల్లో ఒకదానిని దక్కించుకునేందుకు జూపూడి చేసిన ప్రయత్నమే ‘ఈ విరుచుకుపడడం’ అంటున్నారు పరిశీలకులు. మరి ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం.. జూపూడి ఇంతగా కష్టపడాలా? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి కూడా ఎదురు కావడం గమనార్హం. మరి దీనికి జూపూడి ఏమంటారో చూడాలి.
This post was last modified on June 4, 2021 9:26 am
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…
ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…
సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు…