Political News

‘క‌రోనా పేద్ధ‌ ర‌హ‌స్యం’!.. ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న కామెంట్లు!

ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా పుట్టింది? ఎక్క‌డ పుట్టింది? ఎందుకు పుట్టింది? అనే అంశాలు నేటికీ.. అత్యంత ర‌హ‌స్యంగానే ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా సృష్టించిన విల‌యం నుంచి ఇంకా సంప‌న్న దేశాలు సైతం కోలుకోలేక‌పోతున్నాయి. అగ్ర‌రాజ్యం అమెరికా నుంచి అభివృద్ధి చెందుతు న్న దేశం భార‌త్ వ‌ర‌కు క‌రోనాపై అవిశ్రాంత పోరును సాగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌రోనాను అణ్వాయుధాల‌ను మించిన దాడిగా అభివ‌ర్ణిస్తూ.. సంచ‌ల‌న కామెంట్లు చేశారు ప్ర‌ముఖ పారిశ్రామిక దిగ్గ‌జం.. ఆనంద్ మ‌హీంద్రా.

కరోనా వైరస్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే అణ్వాయుధాలను మించిన నష్టాన్ని కలిగించిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు వుహాన్ ప్రయోగశాలలో సృష్టించారని, ఈ విలయానికి చైనాయే కారణమని వచ్చిన నివేదికపై ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. ‘మనం ఎప్పటికీ నిజం ఏమిటో తెలుసుకోలేము. ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం లాగే జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.’ అని వ్యాఖ్య‌లు చేశారు.

కరోనా వైరస్‌ ఇప్పటికే అణ్వాయుధాలను మించిన నష్టాన్ని కలిగించిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నా రు. ఈ విష‌యం ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించాల‌న్న మ‌హీంద్ర‌.. జీవాయుధాల నిరోధ‌క ఒప్పందం ఆవ‌శ్య‌క‌త‌ను వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం మ‌హీంద్ర చేసిన చేసిన ట్వీట్‌.. జోరుగా వైర‌ల్ అవుతోంది. దేశంలో క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఆనంద్ మ‌హీంద్ర అనేక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది తొలి ద‌శ‌లో లాక్‌డౌన్ కార‌ణంగా.. ఇబ్బందులు ఎదుర్కొన్న వ‌ల‌స‌కూలీల‌కు ఆనంద్ ఫౌండేష‌న్ ద్వారా సేవ‌లందించారు. ఈ ఏడాది కూడా ఆయ‌న సేవ‌ల‌ను కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on June 2, 2021 6:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

3 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

3 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

5 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

5 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

7 hours ago