కరోనా మహమ్మారికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందు తయారు చేయడం.. అది కాస్త కొద్ది రోజులకే పాపులారిటీ తెచ్చుకోవడం.. వెనువెంటనే ప్రభుత్వం దృష్టి ఆ మందు మీద పడటం.. దానికి అనుమతులు ఇవ్వడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఆనందయ్య మందుకి అనుమతి లభించింది అని తెలియగానే చాలామంది సంబరపడిపోయారు. ఈ మందు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో తెలిస్తే.. వెంటనే వెళ్లి క్యూలు కట్టేద్దామని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసమే.. కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చారు.
మందు కోసం జనాలు భారీగా క్యూ కట్టడం వల్ల.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే.. వెంటనే ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ప్రోటోకాల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ప్రభుత్వం ఈ మందు పంపిణీ విషయంలో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఈ మందు పంపిణీ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ని కూడా రూపొందిస్తుండటం విశేషం.
మందు తయారీపై వన మూలికలు, ముడి పదార్థాలు సేకరిస్తూనే… మందు పంపిణీపై ఆనందయ్య కార్యాచరణ ఆలోచిస్తున్నారు. మందు పంపిణీ స్టార్ట్ చేయటం మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉండగా, మందు పంపిణీపై ఆనందయ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తో సమావేశం అయ్యారు.
మందు కోసం ఎవరూ నెల్లూరు రావద్దని, అవసరం అయితే మొబైల్ యాప్ ద్వారా… ఆనందయ్య మందును డోర్ డెలివరీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆనందయ్య కూడా ఈ అంశానికి మద్ధతు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా మందు పంపిణీ చేస్తే కరోనా నిబంధనల ఉల్లంఘన జరగదన్నారు. అయితే, ఆనందయ్య పంపిణీ కోసం మరో ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
This post was last modified on June 1, 2021 3:23 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…