అవును ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్ఓ)చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాధన్ చెప్పారంటే ఆలోచించాల్సిన విషయమే. ఇంతకీ విషయం ఏమిటంటే మన కేంద్రప్రభుత్వం చేసిన పనివల్ల 91 దేశాల్లో కరోనా వైరస్ టీకాల కార్యక్రమానికి తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయట. కరోనా వైరస్ కు విరుగుడుగా కోవీషీల్డ్ టీకాలను సరఫరా చేస్తానని సీరమ్ కంపెనీ కాంట్రాక్టు కుదుర్చుకుందట.
సీరమ్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాల్లో అత్యధికం ఆఫ్రికా దేశాలే ఎక్కువగా ఉన్నాయట. అయితే భారత్ లో ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్ వల్ల టీకాల ఎగుమతిపై కేంద్రప్రభుత్వం బ్యాన్ విధించినట్లు సౌమ్య చెప్పారు. కేంద్రం పెట్టిన బ్యాన్ వల్ల సీరమ్ కంపెనీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టీకాలను ఆప్రికా దేశాలకు సరఫరా చేయలేకపోయిందని మండిపడ్డారు.
వస్తుందని అనుకున్న టీకాలు అందక, ఇప్పటికప్పుడు ఇతర కంపెనీలతో టీకాల కోసం ఒప్పందాలు చేసుకోలేక ఆఫ్రికాదేశాలు నానా అవస్తలు పడుతున్నాయట. సౌమ్య చెప్పినదాని ప్రకారమైతే చాలా దేశాల్లో 0.5 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందట. చాలా దేశాల్లో ఆరోగ్య సిబ్బందికి కూడా టీకాలు వేయలేదని సౌమ్య చెప్పారు. మొత్తంమీద కేంద్రప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల దేశంలోపలే కాదు ప్రపంచదేశాలు కూడా టీకాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి.
This post was last modified on June 1, 2021 3:19 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…