అవును ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్ఓ)చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాధన్ చెప్పారంటే ఆలోచించాల్సిన విషయమే. ఇంతకీ విషయం ఏమిటంటే మన కేంద్రప్రభుత్వం చేసిన పనివల్ల 91 దేశాల్లో కరోనా వైరస్ టీకాల కార్యక్రమానికి తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయట. కరోనా వైరస్ కు విరుగుడుగా కోవీషీల్డ్ టీకాలను సరఫరా చేస్తానని సీరమ్ కంపెనీ కాంట్రాక్టు కుదుర్చుకుందట.
సీరమ్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాల్లో అత్యధికం ఆఫ్రికా దేశాలే ఎక్కువగా ఉన్నాయట. అయితే భారత్ లో ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్ వల్ల టీకాల ఎగుమతిపై కేంద్రప్రభుత్వం బ్యాన్ విధించినట్లు సౌమ్య చెప్పారు. కేంద్రం పెట్టిన బ్యాన్ వల్ల సీరమ్ కంపెనీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టీకాలను ఆప్రికా దేశాలకు సరఫరా చేయలేకపోయిందని మండిపడ్డారు.
వస్తుందని అనుకున్న టీకాలు అందక, ఇప్పటికప్పుడు ఇతర కంపెనీలతో టీకాల కోసం ఒప్పందాలు చేసుకోలేక ఆఫ్రికాదేశాలు నానా అవస్తలు పడుతున్నాయట. సౌమ్య చెప్పినదాని ప్రకారమైతే చాలా దేశాల్లో 0.5 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందట. చాలా దేశాల్లో ఆరోగ్య సిబ్బందికి కూడా టీకాలు వేయలేదని సౌమ్య చెప్పారు. మొత్తంమీద కేంద్రప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల దేశంలోపలే కాదు ప్రపంచదేశాలు కూడా టీకాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి.
This post was last modified on June 1, 2021 3:19 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…