Political News

మోడీని అరగంట వెయిట్ చేయించిన సీఎం

#Absentcm.. శుక్రవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్. దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు పడ్డాయి. ఇంతకీ ఎవరా సీఎం.. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం వెనుక కథ ఏంటి అంటే..

యస్ తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. దీనిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆ రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. ముందుగా ఒడిషాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పార్టీలు వేరని చూడకుండా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పద్ధతిగా ఈ సమావేశానికి హాజరయ్యారు.

తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశం ముగించుకున్నాక పీఎం మోడీ.. కోల్‌కతాకు బయల్దేరారు. అక్కడికి చేరుకుని సమావేశం కోసం ఎంచుకున్న కార్యాలయానికి కూడా చేరుకున్నారు. మామూలుగా ప్రధాని వస్తున్నాడంటే ముందే ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుని స్వాగతం పలుకుతుంటారు. ఐతే ప్రధాని పేరెత్తితే మండిపోయే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలా చేస్తుందన్న అంచనాలు ఎవరికీ లేవు. కానీ ఆమె ప్రధాని వచ్చాక కూడా సమావేశానికి రాలేదు. ఆయన్ని అరగంట పాటు వేచి చూసేలా చేసింది. తాను రాకపోయినా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులనైనా పంపాల్సింది. కానీ అదీ చేయలేదు.

ప్రధాని, కేంద్రం నియమించిన గవర్నర్, ఇంకా ఒకరో ఇద్దరో అధికారులు మాత్రమ మీటింగ్‌కు హాజరయ్యారు. అరగంట పాటు మోడీ ఎదురు చూశాక అక్కడికి వచ్చిన మమత.. ఒక నివేదిక ఇచ్చేసి వెంటనే వెళ్లిపోయారు. వేరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున ఆలస్యమైందని, మళ్లీ ముఖ్యమైన పనులుండటం వల్ల వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు.

ఎంత రాజకీయ వైరం ఉన్నప్పటికీ ప్రధానికి కాస్తయినా గౌరవం ఇవ్వాల్సిందని, ఇలా కావాలనే సమావేశానికి ఆలస్యంగా రావడం, ప్రధానికి మొక్కుబడిగా ఒక నివేదిక ఇచ్చి వెళ్లిపోవడం మోడీని అవమానించడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మోడీ మద్దతుదారులు, మమత వ్యతిరేకులు #Absentcm హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఐతే ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా తమ సమస్యలు వివరించబోతే మోడీ మమతకు అవకాశమే ఇవ్వలేదని.. దానికి ఇది ప్రతీకారం అని.. భాజపాయేతర ముఖ్యమంత్రులతో మోడీ వ్యవహరించే తీరు దృష్ట్యా మమత ఇలా చేయడం సరైందే అన్న వాదన మరోవైపు నుంచి వినిపిస్తోంది.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

2 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

2 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

4 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

6 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

7 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

8 hours ago