రేవంత్ రెడ్డి ఆశలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీళ్ళు చల్లినట్లే అనిపిస్తోంది. ఎలాగైనా తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటికి (టీపీసీసీ)కి అధ్యక్షుడు కావాలన్నది రేవంత్ టార్గెట్. దానికి తగ్గట్లుగానే పార్టీలో చేరకముందు నుండే పావులు కదుపుతున్నారు. అయితే అధిష్టానం నుండి వచ్చిన హామీతో పార్టీలో చేరారు. ముందు ప్రచార కమిటికి ఛైర్మన్ అయ్యారు. వెంటనే టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు.
నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్ధానంలోనే ప్రెసిడెంట్ అవ్వాల్సింది. అయితే తెలుసుగా కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులున్నాయో. రేవంత్ కు ప్రెసిడెంట్ కిరీటం అనగానే చాలా గ్రూపులు ఏకమై వ్యతిరేకించాయి. దాంతో పెద్ద కథే నడిచి చివరకు వేరేదారిలేక రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టింది అధిష్టానం.
గడచిన ఆరుమాసాలుగా పార్టీ ప్రెసిడెంట్ గా ప్రకటించటానికి అధిష్టానం ప్రయత్నించటం, నేతలు వాయిదా వేయించటంతోనే సమయం గడచిపోతోంది. చివరకు నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత ప్రెసిడెంట్ ను ప్రకటించమని జానారెడ్డి చేసిన విజ్ఞప్తికి అధిష్టానం సానుకూలంగా స్పందించటంతో ప్రకటన కాస్త ఆగిపోయింది. ఈరోజో రేపే రేవంత్ ను ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా ఓటుకునోటు కేసులో ఎన్పోర్స్ మెంటు డైరెక్టరేట్ దాఖలు చేసింది.
ఈ చార్జిషీటులో రేవంత్ పై తీవ్రమైన అభియోగాలు చేసింది. మొత్తం కుట్రలో రేవంతే ప్రధాన భాగస్వామిగా చార్జిషీటులో ఈడీ చెప్పింది. దాంతో ఈ కేసులో రేవంత్ అరెస్టు తప్పేట్లు లేదు. ఇప్పటికే అరెస్టయిన రేవంత్ బెయిల్ పై బయట తిరుగుతున్నారు. చార్జిషీటు దాఖలు చేసిన నేపధ్యంలో బెయిల్ రద్దు చేసినా చేయచ్చు. ఇలాంటి సమయంలో ఇక రేవంత్ కు పీసీసీ పగ్గాలు దక్కటం ఇప్పట్లో అసాధ్యమని అర్దమవుతోంది. కేసులో నుండి బయటపడితే అప్పుడు సంగతి అప్పుడు చూడాల్సిందే.
This post was last modified on May 28, 2021 11:00 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…