నేతల మధ్య రాజకీయం.. పార్టీకి, పార్టీ అధినేతకు శాపంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా రాజకీయంగా కీలకమైన విజయవాడలో కావడం గమనార్హం. విజయవాడ టీడీపీ నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలకు పాల్పడడం వంటివి పార్టీనే కాకుండా.. పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఇబ్బందికరంగా మారాయి. నిజానికి ఏదైనా సమస్య వస్తే.. నేతల మధ్య సర్దు బాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది.
విజయవాడ పరిస్థితిని తీసుకుంటే.. ఇక్కడి నేతలు కూడా అందరూ సీనియర్లే. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ కూడా సమన్వయంతో ముందుకు సాగడం లేదు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తలెత్తిన ఆధిపత్య పోరు.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. అయితే.. ఈ వివాదాన్ని సర్దు బాటు చేసే ఉద్దేశంతో చంద్రబాబు జోక్యం చేసుకుని.. తానే స్వయంగా ప్రచారంలోకి దిగారు. అయితే.. ఇది స్వయంగా ఏ నేతకు కూడా స్వాంతన కలిగించలేదు.
అంటే.. చంద్రబాబు.. నేరుగా చెప్పకపోయినా.. ఎంపీ కేశినేని నానిని సమర్ధిస్తున్నారని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న,మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వంటివారు భావించే పరిస్థితి తెచ్చింది. పోనీ.. నానీ అయినా.. యాక్టివ్ అయ్యారా? అంటే.. అది కూడా లేదు. తన ఇగో శాటిస్ ఫై కాలేదని ఆయన ఫీలవుతున్నారు. అంటే.. చంద్రబాబు తనను హైలెట్ చేయడం లేదని.. ఎంపీ నాని ముభావంతో ఉన్నారు. అటు బుద్ధా, బొండా మాత్రం చంద్రబాబు సొంత కులానికి చెందిన ఎంపీకే సపోర్ట్ చేస్తున్నారని వాపోతున్నారు.
ఇక గద్దె లాంటి వాళ్లతోనూ బుద్ధా, బొండాకు పొసగని పరిస్థితి. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా అంటే వీళ్లలో ఎవరికి పడదు. ఇలా ఎవరికి వారు.. విజయవాడ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం చేసుకుంటున్న పోరాటం.. వ్యక్తిగతాలు దాటి చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్టుగా పేర్కొంటున్నారు పరిశీలకులు. నిజానికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు.. నాయకులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ.. ముందుకు సాగాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ వివాదంలో చంద్రబాబుకు తలనొప్పులు ఎప్పుడు తప్పుతాయో అంటున్నారు.
This post was last modified on May 27, 2021 8:11 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…