నేతల మధ్య రాజకీయం.. పార్టీకి, పార్టీ అధినేతకు శాపంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా రాజకీయంగా కీలకమైన విజయవాడలో కావడం గమనార్హం. విజయవాడ టీడీపీ నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలకు పాల్పడడం వంటివి పార్టీనే కాకుండా.. పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఇబ్బందికరంగా మారాయి. నిజానికి ఏదైనా సమస్య వస్తే.. నేతల మధ్య సర్దు బాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది.
విజయవాడ పరిస్థితిని తీసుకుంటే.. ఇక్కడి నేతలు కూడా అందరూ సీనియర్లే. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ కూడా సమన్వయంతో ముందుకు సాగడం లేదు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తలెత్తిన ఆధిపత్య పోరు.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. అయితే.. ఈ వివాదాన్ని సర్దు బాటు చేసే ఉద్దేశంతో చంద్రబాబు జోక్యం చేసుకుని.. తానే స్వయంగా ప్రచారంలోకి దిగారు. అయితే.. ఇది స్వయంగా ఏ నేతకు కూడా స్వాంతన కలిగించలేదు.
అంటే.. చంద్రబాబు.. నేరుగా చెప్పకపోయినా.. ఎంపీ కేశినేని నానిని సమర్ధిస్తున్నారని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న,మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వంటివారు భావించే పరిస్థితి తెచ్చింది. పోనీ.. నానీ అయినా.. యాక్టివ్ అయ్యారా? అంటే.. అది కూడా లేదు. తన ఇగో శాటిస్ ఫై కాలేదని ఆయన ఫీలవుతున్నారు. అంటే.. చంద్రబాబు తనను హైలెట్ చేయడం లేదని.. ఎంపీ నాని ముభావంతో ఉన్నారు. అటు బుద్ధా, బొండా మాత్రం చంద్రబాబు సొంత కులానికి చెందిన ఎంపీకే సపోర్ట్ చేస్తున్నారని వాపోతున్నారు.
ఇక గద్దె లాంటి వాళ్లతోనూ బుద్ధా, బొండాకు పొసగని పరిస్థితి. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా అంటే వీళ్లలో ఎవరికి పడదు. ఇలా ఎవరికి వారు.. విజయవాడ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం చేసుకుంటున్న పోరాటం.. వ్యక్తిగతాలు దాటి చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్టుగా పేర్కొంటున్నారు పరిశీలకులు. నిజానికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు.. నాయకులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ.. ముందుకు సాగాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ వివాదంలో చంద్రబాబుకు తలనొప్పులు ఎప్పుడు తప్పుతాయో అంటున్నారు.
This post was last modified on May 27, 2021 8:11 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…