Political News

మహానాడులో తెలంగాణా ఊసేలేదే

తెలుగుదేశంపార్టీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు జరుపుకోనున్న విషయం తెలిసిందే. జూమ్ యాప్ ద్వారా పార్టీ రెండు రోజుల పండుగను జరిపేందుకు రెడీ అయిపోయింది. మహానాడులో చర్చించబోయే అంశాలన్నీ ఏపికి సంబంధించినవి, జగన్మోహన్ రెడ్డిని డైరెక్టుగా ‘ఎటాక్ చేస్తున్నవే. కోవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు..తల్లకిందులైన కుటుంబాల ఆదాయాలు’ మొదటి అంశం.

ఇక రెండో అంశంగా ‘రాష్ట్ర ఉగ్రవాదం..చట్టాలకు విఘాతం..ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’. మూడో అంశం ఏమిటంటే ‘అదుపులేని ధరలు..పెంచిన పన్నులు, అప్పులు’. నాలుగోది ‘పరిశ్రమలపై దాడులు..అమరావతి సంపద విధ్వంసం..పెరుగుతున్న నిరుద్యోగం’. నిజానికి ఈ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా మహానాడు అనే రెండు రోజుల కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సిన అవసరమేలేదు.

ఎందుకంటే ఇప్పటికే పై అంశాలపై గడచిన రెండేళ్ళుగా వైసీపీ ప్రభుత్వాన్ని, డైరెక్టుగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయనిరోజులేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నదగ్గర నుండి జగన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయని రోజంటు లేదు. తమ డిమాండ్లను జగన్ ఏమాత్రం లెక్కచేయడని తెలిసి కూడా పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు కూడా అంతా తనిష్టం అన్నట్లే వ్యవహించారు. ఇపుడు జగన్ కూడా అదే ధోరణిలో వెళుతుంటే మాత్రం సహించలేకపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మహానాడులో చర్చించే అంశాలన్నీ జగన్ను తప్పుపట్టడానికి, బురద చల్లేయటానికి మాత్రమే పనికొస్తాయి. మరి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చేలేదే. ఇదే సందర్భంగా తెలంగాణా పార్టీ ఊసేలేదు. ఏపిలో ఎలాంటి పరిస్ధితి ఉందని చంద్రబాబు అనుకుంటున్నారో దాదాపు అలాంటి పరిస్ధితే తెలంగాణాలో కూడా ఉంది. మరి జాతీయపార్టీ అయిన టీడీపీ తెలంగాణాలోని పరిస్ధితులపై ఎందుకని చర్చించటంలేదు ?

ఈ మహానాడులో తెలంగాణాకు చెందిన పార్టీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అయినా మహానాడు మొత్తం ఏపిలో జగన్ పాలన గురించే చర్చించబోతోంది. అంటే తెలంగాణాలో పరిస్దితులపై చర్చించేందుకు భయపడుతున్నారా ? లేకపోతే తెలంగాణాలో టీడీపీని గాలికొదిలేశారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా తెలంగాణాలోని పరిస్ధితులపై మాట్లాడటానికి ఇష్టపడట లేదంటే అర్దమేంటి ?

This post was last modified on May 26, 2021 3:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

1 hour ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

2 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

2 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

3 hours ago