Political News

మహానాడులో తెలంగాణా ఊసేలేదే

తెలుగుదేశంపార్టీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు జరుపుకోనున్న విషయం తెలిసిందే. జూమ్ యాప్ ద్వారా పార్టీ రెండు రోజుల పండుగను జరిపేందుకు రెడీ అయిపోయింది. మహానాడులో చర్చించబోయే అంశాలన్నీ ఏపికి సంబంధించినవి, జగన్మోహన్ రెడ్డిని డైరెక్టుగా ‘ఎటాక్ చేస్తున్నవే. కోవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు..తల్లకిందులైన కుటుంబాల ఆదాయాలు’ మొదటి అంశం.

ఇక రెండో అంశంగా ‘రాష్ట్ర ఉగ్రవాదం..చట్టాలకు విఘాతం..ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’. మూడో అంశం ఏమిటంటే ‘అదుపులేని ధరలు..పెంచిన పన్నులు, అప్పులు’. నాలుగోది ‘పరిశ్రమలపై దాడులు..అమరావతి సంపద విధ్వంసం..పెరుగుతున్న నిరుద్యోగం’. నిజానికి ఈ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా మహానాడు అనే రెండు రోజుల కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సిన అవసరమేలేదు.

ఎందుకంటే ఇప్పటికే పై అంశాలపై గడచిన రెండేళ్ళుగా వైసీపీ ప్రభుత్వాన్ని, డైరెక్టుగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయనిరోజులేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నదగ్గర నుండి జగన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయని రోజంటు లేదు. తమ డిమాండ్లను జగన్ ఏమాత్రం లెక్కచేయడని తెలిసి కూడా పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు కూడా అంతా తనిష్టం అన్నట్లే వ్యవహించారు. ఇపుడు జగన్ కూడా అదే ధోరణిలో వెళుతుంటే మాత్రం సహించలేకపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మహానాడులో చర్చించే అంశాలన్నీ జగన్ను తప్పుపట్టడానికి, బురద చల్లేయటానికి మాత్రమే పనికొస్తాయి. మరి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చేలేదే. ఇదే సందర్భంగా తెలంగాణా పార్టీ ఊసేలేదు. ఏపిలో ఎలాంటి పరిస్ధితి ఉందని చంద్రబాబు అనుకుంటున్నారో దాదాపు అలాంటి పరిస్ధితే తెలంగాణాలో కూడా ఉంది. మరి జాతీయపార్టీ అయిన టీడీపీ తెలంగాణాలోని పరిస్ధితులపై ఎందుకని చర్చించటంలేదు ?

ఈ మహానాడులో తెలంగాణాకు చెందిన పార్టీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అయినా మహానాడు మొత్తం ఏపిలో జగన్ పాలన గురించే చర్చించబోతోంది. అంటే తెలంగాణాలో పరిస్దితులపై చర్చించేందుకు భయపడుతున్నారా ? లేకపోతే తెలంగాణాలో టీడీపీని గాలికొదిలేశారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు పార్టీ కార్యక్రమాల్లో కూడా తెలంగాణాలోని పరిస్ధితులపై మాట్లాడటానికి ఇష్టపడట లేదంటే అర్దమేంటి ?

This post was last modified on May 26, 2021 3:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

22 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago