Political News

కరోనా అదుపులోకి వస్తేనే స్కూళ్లు !

పిల్లల చేసేదే అల్లరి. కలిసి ఆడుకోవడంలోనే వారికి సంతోషం. ఆటలు, చదువు తప్ప వారికి ఈ ప్రపంచంతో ఇంకేమీ సంబంధం లేదన్నట్లు జీవిస్తారు. ఏం చేయొద్దని చెబుతామో అది చేయడమే వారికి ఆనందాన్నిస్తుంది.

కరోనా రాకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కువేసుకోవడం వంటివి వారు 24 గంటలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటారనుకోవడం అసాధ్యం. వారి నుంచి మనం అది ఆశించడం కూడా తప్పు. అందుకే కరోనా అదుపులోకి రాకుండా స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎలా వాళ్లను రక్షించుకునేది అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

దేశంలో కోవిడ్ 19 అదుపులోకి వచ్చే వరకు పాఠశాలలు తెరిచే ప్రసక్తే లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించారు. అంటే లాక్ డౌన్ కి స్కూళ్లకు సంబంధం లేదు. భావితరాలను కాపాడుకోవడం దేశపు ప్రథమ ప్రయారిటీ అని మంత్రి వ్యాఖ్యానించారు.

అదుపులోకి వచ్చాక పాఠశాలలు ప్రారంభించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం దృష్టిపెట్టింది. ఎపుడైతే పాఠశాలలు ఓపెన్ చేస్తారో… అపుడు తొలుత 30 శాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా స్కూళ్లను ప్రారంభించాలని కేంద్రం సూచించింది.

ఇతర గైడ్ లైన్స్ రూపొందించడంలో ఎన్.సి.ఇ.ఆర్.టి (NCERT) తలమునకలై ఉంది. ఏడాది పాటు స్కూల్లో ఎటువంటి ప్రార్థనలు, సమావేశాలు, సెమినార్లు ఉండవని చెబుతున్నారు. భౌతిక దూరం బాధ్యత కచ్చితంగా టీచర్లు, పాఠశాలలదే అని కేంద్రం సూచించింది. అవకాశం ఉంటే స్కూల్స్ ను షిఫ్టుల్లో నడిపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా… ‘పేరెంట్ సర్కిల్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పాఠశాలలు ప్రారంభించిన తరువాత, దాదాపు నెల రోజుల వరకు తమ పిల్లలను స్కూలు పంపమని చాలామంది తల్లిదండ్రులు తెలిపారు. దీన్ని బట్టి తల్లిదండ్రులు దీని పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నారో ఇట్టే అర్థమైపోతుంది.

This post was last modified on May 16, 2020 12:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

6 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

7 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

10 hours ago