Political News

త్వరలో సాధారణ విమానాలు… ఇది అఫిషియల్

అన్నిటితో పాటు మార్చిలో విమానా రవాణా కూడా స్తంభించిపోయింది. విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం… మళ్లీ విమానాలు తిరగనున్నాయి. కరో-నా ఇపుడు అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో జాగ్రత్తలతో సర్వీసులను పునరుద్ధరించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైపోయింది.
అయితే, మునుపటిలా ప్యాసింజర్ హక్కులు ఉండవు. ప్రయాణ నిబంధనలు అన్నీ మారిపోనున్నాయి. ఈ ఏడాది కేవలం దేశీయ విమాన సర్వీసులు మాత్రమే తిరిగే అవకాశం ఉంది. అంతర్జాజాతీయ విమాన సర్వీసులు తిరగడం అనుమానమే.
ఇక దేశీ విమాన ప్రయాణాలు చేయాలంటే కొన్ని నిబంధనలు ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంటుంది.

వాటిలో ముఖ్యమైనవి :

  1. ఆరోగ్య సేతు యాప్ ఉన్న వారికి మాత్రమే ప్రయాణ అనుమతి.
  2. మాస్కులు, ఇతర రక్షణ వస్తువులు తప్పనిసరి.
  3. ప్రతి ఒక్కరి చేతిలో శానిటైజర్ తప్పనిసరి. 350 ఎంఎల్ తగ్గకుండా.
  4. ప్రతి ఒక్కరు ఇతర ప్యాసింజరు నుంచి 4 అడుగుల దూరం పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే సిబ్బంది ఊరుకోరు.
  5. వెబ్ చెకిన్ కంపల్సరీ. బోర్డింగ్ పాస్ ప్రింటవుట్ తీసుకురావాలి.
  6. సిబ్బందికి సహకరించకపోవడం చట్టరీత్యా నేరం. కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. అయితే ప్రయాణికులు కొన్ని నిబంధనలను పాటించాలని చెప్పింది. ప్రతి ప్రయాణికుడి వద్ద ఆరోగ్యసేతు యాప్ తప్పనిరిగా ఉండాలని తెలిపింది. ప్రయాణికుల మధ్య కనీసం నాలుగు అడుగుల దూరం ఉండాలని చెప్పింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపింది. విమానాశ్రయానికి వచ్చే ముందే బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకురావాలని చెప్పింది. ప్రతి ఒక్కరి వద్ద శానిటైజర్ ఉండాలని తెలిపింది. విమాన సిబ్బందికి ప్రయాణికులు పూర్తిగా సహకరించాలని సూచించింది.

This post was last modified on May 16, 2020 12:01 am

Share
Show comments
Published by
suman

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

5 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

6 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

7 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

7 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

7 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

8 hours ago