గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు మీద విమర్శలు చేసి వివాదాల్లోకెక్కిన డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా? ఆయన శుక్రవారం చనిపోయాడు. సుధాకర్ గుండెపోటుతో తనువు చాలించినట్లు తెలుస్తోంది. సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని.. ఆయన మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ డాక్టర్గా ఉన్న సుధాకర్.. వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కులు కూడా ఇవ్వట్లేదంటూ జగన్ సర్కారు మీద విమర్శలు, ఆరోపణలు చేసి వార్తల్లో నిలవడం, ఆ తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం, ప్రభుత్వం కేసులు కూడా పెట్టడం తెలిసిన సంగతే. తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఆయన విశాఖపట్నంలో రోడ్డు మీద దయనీయ స్థితిలో కనిపించారు. అర్ధ నగ్న స్థితిలో, మాట తడబడుతూ కనిపించిన సుధాకర్ను పోలీసులు ఆయన కాళ్లు చేతులకు తాళ్లు కట్టి.. కర్రలతో కొట్టడం.. తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించడం సంచలనం రేపింది.
ఈ ఘటన అనంతరం సుధాకర్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కోర్టు ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే కాక.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు ఆదేశించడం మరో సంచలనం. కాగా తర్వాత సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల విచారణ వ్యక్తం చేస్తూ, తన ఉద్యోగం తనకు ఇప్పించాలని మీడియా ముందు మాట్లాడారు. ఆ తర్వాత సుధాకర్ పెద్దగా వార్తల్లో లేరు. ఇప్పుడు సుధాకర్ కేసును అందరూ మరిచిపోయారు. ఈ టైంలో ఆయన మరణవార్త బయటికి వచ్చింది. ప్రభుత్వంపై విమర్శలు చేశాక జరిగిన పరిణామాలు సుధాకర్ మీద మానసికంగా తీవ్ర ప్రభావమే చూపినట్లుగా భావిస్తున్నారు.
This post was last modified on May 22, 2021 9:09 am
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…
వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది.…