తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మెప్పూ పొందుతున్నాడు డీఎంకే అధినేత స్టాలిన్. కొవిడ్ నియంత్రణ దిశగా లాక్ డౌన్ సహా కొన్ని కఠిన చర్యలకు తోడు.. వైద్య సదుపాయాలు పెంచడానికి ఆయన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం ప్రశంసలందుకుంది. ఇక ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతిపక్ష నేత పన్నీర్ సెల్వంను మర్యాదపూర్వకంగా ఇంటికెళ్లి కలుసుకోవడం.. ఓ ప్రభుత్వ కమిటీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు చోటు ఇవ్వడం లాంటి నిర్ణయాలు కూడా ఆకట్టుకున్నాయి.
మున్ముందు ఎలా ఉంటుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి స్టాలిన్ పాలనా పరమైన నిర్ణయాలన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన మంచి పాలకుడిగా, అందరివాడిగా ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో ఆకర్షణీయమైన పనితో స్టాలిన్ వార్తల్లో వ్యక్తి అయ్యారు.
కరోనాపై జనాల్లో అవగాహన పెంచడానికి స్టాలిన్ నేరుగా రంగంలోకి దిగారు. మామూలుగా ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలపై, జనాల్లో అవగాహన పెంపొందించే విషయాలపై ప్రకటనలు చేయాల్సి వస్తే సినీ తారల వైపే చూస్తారు. ఐతే కరోనా నియంత్రణ దిశగా మాస్కు ధరించడం సహా కరోనా ఇతర జాగ్రత్తలపై ప్రభుత్వం రూపొందించిన ఓ ప్రకటనలో స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రే కనిపించారు. మాస్కు ప్రాధాన్యతను చెబుతూ.. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలా మెలగాలో చక్కగా వివరిస్తూ ఆయన ఈ వీడియోలో జనాలకు సందేశం ఇచ్చారు.
సామాన్యులందరికీ అర్థమయ్యేలా పూర్తిగా తమిళంలోనే మాట్లాడారు స్టాలిన్. మాస్కు అనకుండా దానికి కూడా ఒక తమిళ పదాన్నే స్టాలిన్ వాడటం విశేషం. ఇలా ఓ ముఖ్యమంత్రే కరోనాపై జాగ్రత్తలు చెబుతూ ప్రకటన చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది జనాలకు మంచి సంకేతాలు ఇస్తుందని, స్టాలిన్ను మిగతా నేతలు అనుసరించాలని అంటున్నారు.
This post was last modified on May 20, 2021 8:55 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…