తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మెప్పూ పొందుతున్నాడు డీఎంకే అధినేత స్టాలిన్. కొవిడ్ నియంత్రణ దిశగా లాక్ డౌన్ సహా కొన్ని కఠిన చర్యలకు తోడు.. వైద్య సదుపాయాలు పెంచడానికి ఆయన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం ప్రశంసలందుకుంది. ఇక ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతిపక్ష నేత పన్నీర్ సెల్వంను మర్యాదపూర్వకంగా ఇంటికెళ్లి కలుసుకోవడం.. ఓ ప్రభుత్వ కమిటీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు చోటు ఇవ్వడం లాంటి నిర్ణయాలు కూడా ఆకట్టుకున్నాయి.
మున్ముందు ఎలా ఉంటుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి స్టాలిన్ పాలనా పరమైన నిర్ణయాలన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన మంచి పాలకుడిగా, అందరివాడిగా ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో ఆకర్షణీయమైన పనితో స్టాలిన్ వార్తల్లో వ్యక్తి అయ్యారు.
కరోనాపై జనాల్లో అవగాహన పెంచడానికి స్టాలిన్ నేరుగా రంగంలోకి దిగారు. మామూలుగా ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలపై, జనాల్లో అవగాహన పెంపొందించే విషయాలపై ప్రకటనలు చేయాల్సి వస్తే సినీ తారల వైపే చూస్తారు. ఐతే కరోనా నియంత్రణ దిశగా మాస్కు ధరించడం సహా కరోనా ఇతర జాగ్రత్తలపై ప్రభుత్వం రూపొందించిన ఓ ప్రకటనలో స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రే కనిపించారు. మాస్కు ప్రాధాన్యతను చెబుతూ.. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలా మెలగాలో చక్కగా వివరిస్తూ ఆయన ఈ వీడియోలో జనాలకు సందేశం ఇచ్చారు.
సామాన్యులందరికీ అర్థమయ్యేలా పూర్తిగా తమిళంలోనే మాట్లాడారు స్టాలిన్. మాస్కు అనకుండా దానికి కూడా ఒక తమిళ పదాన్నే స్టాలిన్ వాడటం విశేషం. ఇలా ఓ ముఖ్యమంత్రే కరోనాపై జాగ్రత్తలు చెబుతూ ప్రకటన చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది జనాలకు మంచి సంకేతాలు ఇస్తుందని, స్టాలిన్ను మిగతా నేతలు అనుసరించాలని అంటున్నారు.
This post was last modified on May 20, 2021 8:55 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…