రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై జాతీయ మీడియాలో ఇటీవల కాలంలో విస్తృతంగా కథనాలు.. వార్తలు వస్తున్నాయి. తెలుగు మీడియాను మించిపోయిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ఆంగ్ల పత్రికలు కథనాలు రాస్తుండడం, ముఖ్యంగా.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్లను టార్గెట్ చేస్తుండడం మరింతగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి రీజన్ ఏంటి? అనే విషయం ఆసక్తిగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ విషయంలో.. తెలంగాణ హైకోర్టు కేసీఆర్ను మందలించింది కూడా! ఒక్క ఏపీలోనే హైకోర్టు ఈ విషయంలో సీఎం జగన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఏపీ విషయాన్ని తీసుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలపై.. సీఎం జగన్ సర్కారు వివిధ రూపాల్లో.. కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే సంగం డెయిరీ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పై రెండు కేసులు పెట్టారు. ఒకటి రాజధాని భూముల విషయంలోను, రెండోది కరోనా సెకండ్ వేవ్లో కీలకమైన వైరస్ వేరియంట్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కర్నూలుకు చెందిన ఒక నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన కూడా తన సొంత మంత్రి వర్గంలోని ఈటల రాజేందర్పైనే కేసులు పెట్టిస్తున్నారని.. ఇప్పటికే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం కూడా రాజకీయంగా సంచలనం సృష్టించింది. అదేసమయంలో ప్రతిపక్ష నేతల నోరు నొక్కేందుకు పోలీసులను జోరుగా వినియోగిస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈటలపై మరింత ఉచ్చు బిగించేందుకు.. దేవర యాంజల్ భూముల విషయంలో ఈటల పాత్రపై తేల్చేందుకు హుటాహుటిన నలుగురు ఐఏఎస్లతో కమిటీ వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
ప్రస్తుతం కరోనా విలయంలో ప్రజలు అల్లాడుతుంటే.. రాష్ట్రంలో శవాల గుట్టలు పేరుకుంటుంటే.. ఈ కక్ష సాధింపు ఎందుకని.. కూడా హైకోర్టు కేసీఆర్ను ప్రశ్నించింది. అదే సమయంలో కేసీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని కూడా పరోక్షంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జాతీయ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపైనా కథనాలు ప్రచురించింది. కరోనా సమయంలో రాజకీయ కల్లోలం .. అనే శీర్షికతో దాదాపు అన్ని జాతీయ మీడియాల్లోనూ కథనాలు రావడం సంచలనంగా మారింది ప్రస్తుతం అన్ని వర్గాలు కరోనాపై దృష్టి పెడుతుంటే.. ఏపీ, తెలంగాణల్లో మాత్రం రాజకీయ కరోనా రాజుకుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on May 12, 2021 9:01 am
రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…