రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై జాతీయ మీడియాలో ఇటీవల కాలంలో విస్తృతంగా కథనాలు.. వార్తలు వస్తున్నాయి. తెలుగు మీడియాను మించిపోయిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ఆంగ్ల పత్రికలు కథనాలు రాస్తుండడం, ముఖ్యంగా.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్లను టార్గెట్ చేస్తుండడం మరింతగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి రీజన్ ఏంటి? అనే విషయం ఆసక్తిగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ విషయంలో.. తెలంగాణ హైకోర్టు కేసీఆర్ను మందలించింది కూడా! ఒక్క ఏపీలోనే హైకోర్టు ఈ విషయంలో సీఎం జగన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఏపీ విషయాన్ని తీసుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలపై.. సీఎం జగన్ సర్కారు వివిధ రూపాల్లో.. కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే సంగం డెయిరీ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పై రెండు కేసులు పెట్టారు. ఒకటి రాజధాని భూముల విషయంలోను, రెండోది కరోనా సెకండ్ వేవ్లో కీలకమైన వైరస్ వేరియంట్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కర్నూలుకు చెందిన ఒక నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన కూడా తన సొంత మంత్రి వర్గంలోని ఈటల రాజేందర్పైనే కేసులు పెట్టిస్తున్నారని.. ఇప్పటికే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం కూడా రాజకీయంగా సంచలనం సృష్టించింది. అదేసమయంలో ప్రతిపక్ష నేతల నోరు నొక్కేందుకు పోలీసులను జోరుగా వినియోగిస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈటలపై మరింత ఉచ్చు బిగించేందుకు.. దేవర యాంజల్ భూముల విషయంలో ఈటల పాత్రపై తేల్చేందుకు హుటాహుటిన నలుగురు ఐఏఎస్లతో కమిటీ వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
ప్రస్తుతం కరోనా విలయంలో ప్రజలు అల్లాడుతుంటే.. రాష్ట్రంలో శవాల గుట్టలు పేరుకుంటుంటే.. ఈ కక్ష సాధింపు ఎందుకని.. కూడా హైకోర్టు కేసీఆర్ను ప్రశ్నించింది. అదే సమయంలో కేసీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని కూడా పరోక్షంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జాతీయ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపైనా కథనాలు ప్రచురించింది. కరోనా సమయంలో రాజకీయ కల్లోలం .. అనే శీర్షికతో దాదాపు అన్ని జాతీయ మీడియాల్లోనూ కథనాలు రావడం సంచలనంగా మారింది ప్రస్తుతం అన్ని వర్గాలు కరోనాపై దృష్టి పెడుతుంటే.. ఏపీ, తెలంగాణల్లో మాత్రం రాజకీయ కరోనా రాజుకుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…