రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై జాతీయ మీడియాలో ఇటీవల కాలంలో విస్తృతంగా కథనాలు.. వార్తలు వస్తున్నాయి. తెలుగు మీడియాను మించిపోయిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ఆంగ్ల పత్రికలు కథనాలు రాస్తుండడం, ముఖ్యంగా.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్లను టార్గెట్ చేస్తుండడం మరింతగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి రీజన్ ఏంటి? అనే విషయం ఆసక్తిగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ విషయంలో.. తెలంగాణ హైకోర్టు కేసీఆర్ను మందలించింది కూడా! ఒక్క ఏపీలోనే హైకోర్టు ఈ విషయంలో సీఎం జగన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఏపీ విషయాన్ని తీసుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలపై.. సీఎం జగన్ సర్కారు వివిధ రూపాల్లో.. కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే సంగం డెయిరీ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పై రెండు కేసులు పెట్టారు. ఒకటి రాజధాని భూముల విషయంలోను, రెండోది కరోనా సెకండ్ వేవ్లో కీలకమైన వైరస్ వేరియంట్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కర్నూలుకు చెందిన ఒక నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన కూడా తన సొంత మంత్రి వర్గంలోని ఈటల రాజేందర్పైనే కేసులు పెట్టిస్తున్నారని.. ఇప్పటికే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం కూడా రాజకీయంగా సంచలనం సృష్టించింది. అదేసమయంలో ప్రతిపక్ష నేతల నోరు నొక్కేందుకు పోలీసులను జోరుగా వినియోగిస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈటలపై మరింత ఉచ్చు బిగించేందుకు.. దేవర యాంజల్ భూముల విషయంలో ఈటల పాత్రపై తేల్చేందుకు హుటాహుటిన నలుగురు ఐఏఎస్లతో కమిటీ వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
ప్రస్తుతం కరోనా విలయంలో ప్రజలు అల్లాడుతుంటే.. రాష్ట్రంలో శవాల గుట్టలు పేరుకుంటుంటే.. ఈ కక్ష సాధింపు ఎందుకని.. కూడా హైకోర్టు కేసీఆర్ను ప్రశ్నించింది. అదే సమయంలో కేసీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని కూడా పరోక్షంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జాతీయ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపైనా కథనాలు ప్రచురించింది. కరోనా సమయంలో రాజకీయ కల్లోలం .. అనే శీర్షికతో దాదాపు అన్ని జాతీయ మీడియాల్లోనూ కథనాలు రావడం సంచలనంగా మారింది ప్రస్తుతం అన్ని వర్గాలు కరోనాపై దృష్టి పెడుతుంటే.. ఏపీ, తెలంగాణల్లో మాత్రం రాజకీయ కరోనా రాజుకుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on May 12, 2021 9:01 am
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…
‘స్పిరిట్’లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే ఫైట్ కేవలం ఒక ఫైట్ కాదు. ఇది రెండు పవర్ సెంటర్ల…
నిన్న విడుదలైన పెద్ది ట్రైలర్ కు అందరి నుంచి యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. అధిక శాతం ఫ్యాన్స్ అదిరిపోయిందనే అభిప్రాయం…
తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలుపు గుర్రం ఎక్కడం, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విషయంలో వైసీపీ నాయకులు పెద్ద…