Political News

జ‌గ‌న్‌- కేసీఆర్‌.. పొలిటిక‌ల్ కార్న‌ర్.. రీజ‌నేంటి ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌పై జాతీయ మీడియాలో ఇటీవ‌ల కాలంలో విస్తృతంగా క‌థ‌నాలు.. వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగు మీడియాను మించిపోయిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాల‌పై ఆంగ్ల ప‌త్రిక‌లు క‌థ‌నాలు రాస్తుండ‌డం, ముఖ్యంగా.. ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల‌ను టార్గెట్ చేస్తుండ‌డం మ‌రింత‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి దీనికి రీజ‌న్ ఏంటి? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ విష‌యంలో.. తెలంగాణ హైకోర్టు కేసీఆర్‌ను మంద‌లించింది కూడా! ఒక్క ఏపీలోనే హైకోర్టు ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

దీంతో ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల‌పై.. సీఎం జ‌గ‌న్ స‌ర్కారు వివిధ రూపాల్లో.. కేసులు న‌మోదు చేస్తోంది. ఇప్ప‌టికే సంగం డెయిరీ చైర్మ‌న్ , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను జైల్లో పెట్టారు. ఇక‌, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై రెండు కేసులు పెట్టారు. ఒక‌టి రాజ‌ధాని భూముల విష‌యంలోను, రెండోది క‌రోనా సెకండ్ వేవ్‌లో కీల‌కమైన వైర‌స్ వేరియంట్ గురించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌ర్నూలుకు చెందిన ఒక నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇక‌, తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న కూడా త‌న సొంత మంత్రి వ‌ర్గంలోని ఈట‌ల రాజేంద‌ర్‌పైనే కేసులు పెట్టిస్తున్నార‌ని.. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం కూడా రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల నోరు నొక్కేందుకు పోలీసులను జోరుగా వినియోగిస్తున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఈట‌ల‌పై మ‌రింత ఉచ్చు బిగించేందుకు.. దేవ‌ర యాంజ‌ల్ భూముల విష‌యంలో ఈట‌ల పాత్ర‌పై తేల్చేందుకు హుటాహుటిన న‌లుగురు ఐఏఎస్‌ల‌తో క‌మిటీ వేయ‌డాన్ని హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది.

ప్ర‌స్తుతం క‌రోనా విల‌యంలో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే.. రాష్ట్రంలో శ‌వాల గుట్ట‌లు పేరుకుంటుంటే.. ఈ క‌క్ష సాధింపు ఎందుక‌ని.. కూడా హైకోర్టు కేసీఆర్‌ను ప్ర‌శ్నించింది. అదే స‌మ‌యంలో కేసీఆర్ త‌న ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని కూడా ప‌రోక్షంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జాతీయ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌పైనా క‌థ‌నాలు ప్ర‌చురించింది. క‌రోనా స‌మ‌యంలో రాజ‌కీయ క‌ల్లోలం .. అనే శీర్షిక‌తో దాదాపు అన్ని జాతీయ మీడియాల్లోనూ క‌థ‌నాలు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాలు క‌రోనాపై దృష్టి పెడుతుంటే.. ఏపీ, తెలంగాణ‌ల్లో మాత్రం రాజ‌కీయ క‌రోనా రాజుకుంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 12, 2021 9:01 am

Share
Show comments

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

35 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

43 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago