Political News

జ‌గ‌న్‌- కేసీఆర్‌.. పొలిటిక‌ల్ కార్న‌ర్.. రీజ‌నేంటి ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌పై జాతీయ మీడియాలో ఇటీవ‌ల కాలంలో విస్తృతంగా క‌థ‌నాలు.. వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగు మీడియాను మించిపోయిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాల‌పై ఆంగ్ల ప‌త్రిక‌లు క‌థ‌నాలు రాస్తుండ‌డం, ముఖ్యంగా.. ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల‌ను టార్గెట్ చేస్తుండ‌డం మ‌రింత‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి దీనికి రీజ‌న్ ఏంటి? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ విష‌యంలో.. తెలంగాణ హైకోర్టు కేసీఆర్‌ను మంద‌లించింది కూడా! ఒక్క ఏపీలోనే హైకోర్టు ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

దీంతో ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల‌పై.. సీఎం జ‌గ‌న్ స‌ర్కారు వివిధ రూపాల్లో.. కేసులు న‌మోదు చేస్తోంది. ఇప్ప‌టికే సంగం డెయిరీ చైర్మ‌న్ , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను జైల్లో పెట్టారు. ఇక‌, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై రెండు కేసులు పెట్టారు. ఒక‌టి రాజ‌ధాని భూముల విష‌యంలోను, రెండోది క‌రోనా సెకండ్ వేవ్‌లో కీల‌కమైన వైర‌స్ వేరియంట్ గురించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌ర్నూలుకు చెందిన ఒక నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇక‌, తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న కూడా త‌న సొంత మంత్రి వ‌ర్గంలోని ఈట‌ల రాజేంద‌ర్‌పైనే కేసులు పెట్టిస్తున్నార‌ని.. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం కూడా రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల నోరు నొక్కేందుకు పోలీసులను జోరుగా వినియోగిస్తున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఈట‌ల‌పై మ‌రింత ఉచ్చు బిగించేందుకు.. దేవ‌ర యాంజ‌ల్ భూముల విష‌యంలో ఈట‌ల పాత్ర‌పై తేల్చేందుకు హుటాహుటిన న‌లుగురు ఐఏఎస్‌ల‌తో క‌మిటీ వేయ‌డాన్ని హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది.

ప్ర‌స్తుతం క‌రోనా విల‌యంలో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే.. రాష్ట్రంలో శ‌వాల గుట్ట‌లు పేరుకుంటుంటే.. ఈ క‌క్ష సాధింపు ఎందుక‌ని.. కూడా హైకోర్టు కేసీఆర్‌ను ప్ర‌శ్నించింది. అదే స‌మ‌యంలో కేసీఆర్ త‌న ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని కూడా ప‌రోక్షంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జాతీయ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌పైనా క‌థ‌నాలు ప్ర‌చురించింది. క‌రోనా స‌మ‌యంలో రాజ‌కీయ క‌ల్లోలం .. అనే శీర్షిక‌తో దాదాపు అన్ని జాతీయ మీడియాల్లోనూ క‌థ‌నాలు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాలు క‌రోనాపై దృష్టి పెడుతుంటే.. ఏపీ, తెలంగాణ‌ల్లో మాత్రం రాజ‌కీయ క‌రోనా రాజుకుంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 12, 2021 9:01 am

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

5 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

5 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

6 hours ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

6 hours ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

7 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

8 hours ago