పెరిగిపోతున్న కరోనా ఉదృతిని నియంత్రించటానికి ఈనెల 15వ తేదీ తర్వాత లాక్ డౌన్ పెట్టడం తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. లాక్ డౌన్ విధించటానికి 15వ తేదీకి సంబంధం ఏమిటంటే రంజాన్ పండుగ కాబట్టే. ఈనెల 13-14 తేదీల్లో రంజాన్ పండగుంది. రంజాన్ అయిపోగానే లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో కేసీయార్ ఉన్నట్లు సమాచారం.
నిజానికి మొదటినుండి లాక్ డౌన్ విధించటానికి కేసీయార్ పూర్తి వ్యతిరేకం. సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే ఆర్ధికంగా జరగబోయే భారీ నష్టాలను లెక్కేసే కేసీయార్ మొదటినుండి వ్యతిరేకిస్తున్నారు. అందుకనే లాక్ డౌన్ స్ధానంలో ప్రత్యామ్నాయంగా నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే నైట్ కర్ఫ్యూ ప్రభావం పెద్దగా కనబడలేదు. దాంతో ఉదయం పూట కూడా పాక్షికంగా కర్ఫ్యూని విధించింది. దీనివల్ల కూడా పెద్దగా ఉపయోగం కనబడలేదు.
కర్ఫ్యూ దారి కర్ఫ్యూదే, కరోనా తీవ్రత కరోనాదే అన్నట్లుగా ఉంది వ్యవహారం. దాంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించినట్లే తెలంగాణాలో కూడా టోటల్ లాక్ డౌన్ విధించటం ఒకటే మార్గమని ప్రభుత్వానికి అర్ధమైనట్లుంది. అందుకనే ఇదే విషయమై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతున్నట్లు సమాచారం. వెంటనే రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తే కానీ కరోనా తీవ్రత నియంత్రణలోకి రాదని ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి నివేదికలు అందించారట.
ఇదే సమయంలో వైద్యావసరాల కోసం ఏపి, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్నాటక నుండి వేలాదిమంది రోగులు హైదరాబాద్ వస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం వస్తున్నారు కాబట్టి వీళ్ళను అడ్డుకునేందుకులేదు. అప్పటికి ఏపి నుండి వస్తున్న రోగులను సరిహద్దుల్లో అడ్డుకోవటం వివాదాస్పదమైంది. ఇలాంటి అనేక సమస్యలకు లాక్ డౌన్ విధించటమొకటే పరిష్కారమని ఉన్నతాధికారులు కేసీయార్ తో చెప్పారట. కాబట్టి మంత్రివర్గంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
This post was last modified on May 11, 2021 10:43 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…