ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) చీఫ్ ఎంకే స్టాలిన్… ఆ పదవిలో ఉండగా అంతగా ఎలివేట్ కాలేదు గానీ… ఎప్పుడైతే తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారో.. తనలోని పరిణతి చెందిన పొలిటీషియన్ యమా స్పీడుగా దూసుకొచ్చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాలంటేనే… ప్రత్యర్థిని చిత్తు చేసే ఎత్తులు, జిత్తులకు పెట్టింది పేరు. అలాంటి రాజకీయాల్లోనే ఓనమాలు దిద్దుకున్న స్టాలిన్… తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… జనం సంక్షేమాన్ని మాత్రమే చూస్తాను గానీ… రాజకీయ కక్షసాధింపులను ఎంతమాత్రం సహించేది లేదన్న రీతిలో తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సీఎంగా ప్రమాణం చేసిన రోజే పేదల సంక్షేమానికి సంబంధించి ఐదు సంతకాలు చేసిన స్టాలిన్… తాజాగా సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాట దివంగత సీఎం జయలలిత హయాంలో పేదలకు రూ.5లకే భోజనం అందించే ఉద్దేశ్యంతో ‘అమ్మ క్యాంటీన’ పేరిట ప్రత్యేకంగా సర్కారీ క్యాంటీన్లను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. జయలలిత మరణం తర్వాత కూడా ఆమె వారసులుగా రాష్ట్రాన్ని పాలించిన పన్నీర్ సెల్వం, పళణిసామిలు కూడా వీటిని కొనసాగించారు. అయితే జయ మరణం తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలు కాగా… స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయం సాధించింది. దీంతో స్టాలిన్ సీఎం పగ్గాలు చేపట్టారు.
సాధారణంగా డీఎంకే కొనసాగించిన పథకాలకు అన్నాడీఎంకే రద్దు చేయగా… అన్నాడీఎంకే ప్రారంభించిన పధకాలకు డీఎంకే రద్దు చేస్తూ సాగాయి. ఈ క్రమంలో అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ సర్కారు రద్దు చేస్తుందని అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా సంచలన నిర్ణయం తీసుకున్న స్టాలిన్… అతి తక్కువ ధరలకే పేదల ఆకలి తీర్చే అమ్మ క్యాంటీన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. అమ్మా క్యాంటీన్లను తన హయాంలో కూడా కొనసాగించనున్నట్లుగా సోమవారం స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు.
స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ఏపీలో టీడీపీ హయాంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లను జగన్ సీఎం కాగానే రద్దు చేసిన వైనం ఠక్కున గుర్తుకు వచ్చేసింది. కనీసం పొరుగు రాష్ట్ర సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసైనా జగన్ నేర్చుకోవాలన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…