Political News

‘ఎల్జీ’ ఘ‌ట‌న‌కు ఏడాది: వెంటాడుతున్న జ‌గ‌న్ వైఫ‌ల్యాలు!

దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన‌.. విశాఖ ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌కు నేటితో(మే7) ఏడాది పూర్త‌యింది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా కరోనా మొదటి దశ ఉద్ధృతంగా ఉండగా.. సరిగ్గా ఇదేరోజున రాష్ట్ర ప్రజలను మరో దుర్ఘటన ఉలిక్కి పడేలా చేసింది. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన పెను సంచలనమే సృష్టించింది. అనేక మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచిన ఆ ఘోరం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రాణాల కోసం బాధితుల పరుగులు పెట్టిన దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.

వెంటాడుతున్న ఘోరం!

రంగు మారిన పచ్చని చెట్ల గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ఇంకా ఆ విషాద జ్ఞాపకాలు విశాఖ ప్రజలను వెంటా డుతూనే ఉన్నాయి. విశాఖ శివారులోని గోపాలపట్నం మండలం వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూసివేశారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇచ్చిన వెసులుబాటులో భాగంగా కంపెనీలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ ఏసీలు, ఫ్రిజ్‌లు తయారుచేసే విడిభాగాలు తయారవుతాయి. దీనికి ప్రధాన ముడి సరకు ‘స్టైరిన్‌ మోనోమర్‌’. ఇది ప్రమాదకర రసాయనం. 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

కంపెనీ చేతులు ఎత్తేసినా..

ఆ రోజు జరిగిన సాంకేతిక లోపాల వల్ల స్టైరిన్‌ వాయువు లీకై.. సృష్టించిన విధ్వంసం.. వందలాది జీవితా లను అతలాకుతలం చేసింది. పాలిమర్స్‌ దుర్ఘటనతో వెంకటాపురం, వెంకటాద్రిగార్డెన్‌, పద్మనాభనగర్‌, జనతాకాలనీ, నందగిరినగర్, ఎస్సీ కాలనీ వాసులకు మూడురోజులు కంటి మీద కునుకులేకుండా చేసిం ది. రాత్రంతా రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ తిరుగుతూనే ఉండేలా చేసింది. నాటి విషాద ఘటనకు ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎన్నో ఇబ్బందులు ఈ గ్రామాల ప్రజలను చుట్టుముట్టా యి. అయినా రేపటి మీద ఆశ, నమ్మకం వారిని బతికిచ్చింది. ఎప్పటికైనా ప్రభుత్వం చూడకపోతుందా? ఆదుకోకపోతుందా? అనే భరోసాతో అడుగులు వేస్తూనే ఉన్నారు.

ఎవ‌రూ సుఖంగా లేరు!

ప్రమాదానికి గురైన ట్యాంకర్లు దగ్గరగా ఉన్న వెంకటాపురం, వెంకటాద్రినగర్‌ గ్రామాల్లోని ప్రజలు ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థానికులను ఎవరిని కదిపినా కన్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు అలసట, నీరసం సమస్యతో బాధపడుతున్నారు. గుండెల్లో దడ అనిపించడంతో పాటు కాళ్లూ చేతులు లాగడం, మోకాళ్లు నొప్పులు వారిని కలవరపెడుతున్నాయి. మహిళల్లో ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలు వస్తున్నాయి. కొద్దిమంది యువతలో ఆయాసం, త్వరగా అలసిపోవడం, తల తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.

జ‌గ‌న్ హామీలు నీటిమూట‌లు!

ప్రమాదం జ‌రిగిన‌ప్పుడు.. సీఎం జ‌గ‌న్‌ ప్రభుత్వం త‌మ‌కి ఇచ్చిన హామీలు నెరవేరలేదని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అప్పుడు తాత్కాలిక పరిహారం ఇచ్చి.. చేతులు దులుపుకొందని వాపోతున్నారు. బాధిత గ్రామాలకు ఇచ్చిన హామీల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్య కేంద్రం కొద్ది నెలలే పనిచేసిందని వాపోయా రు. బాధిత గ్రామస్థులకు ఇచ్చిన హెల్త్‌కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శిస్తున్నారు.

This post was last modified on May 7, 2021 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

4 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

29 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

31 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

60 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago