ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత కేసీయార్ పైన ఒత్తిడి పెరిగిపోతోందట. రాజీనామాతో పోయేదానికి కేసీయార్ బర్తరఫ్ దాకా తీసుకెళ్ళారనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది. భూకబ్జాల ఆరోపణలు రాగానే వెంటనే ఈటల రాజేందర్ నుండి మంత్రిత్వ శాఖలను పీకేశారు. మరుసటి రోజు ఏకంగా బర్తరఫ్ చేసేశారు. నిజానికి ఈటలకు జరిగిన ఘోర అవమానంగానే భావించాలి.
ఆశ్చర్యమేమంటే ఇదే విధమైన లేదా ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు, ఎంఎల్ఏలపైన మాత్రం కేసీయార్ అసలు స్పందించనేలేదు. దాంతో ఇపుడు ఈటల బర్తరఫ్ వివాదం కాస్త రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో హైకోర్టు కూడా ఈటల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో రాజేందర్ కు మద్దతు పెరుగుతోంది.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే రాజీనామా విషయంలో కేసీయార్ పైన కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. కేసీయార్ వెంటనే గజ్వేల్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. రాజేందర్ మద్దతుదారులు మాట్లాడుతూ కేసీయార్ వెంటనే రాజీనామా చేసి హుజూర్ నగర్లో ఈటలపై పోటీ చేసి గెలవాలంటూ చాలెంజ్ చేస్తున్నారు.
హుజూర్ నగర్ ఎంఎల్ఏగా తొందరలోనే రాజేందర్ రాజీనామా చేయబోతున్నట్లు మద్దతుదారులు చెబుతున్నారు. అప్పుడు వచ్చే ఉపఎన్నికలో ఈటలపై కేసీయార్ పోటీచేసి గెలవాలంటూ మద్దతుదారులు విసిరిన సవాలుకు మద్దతు పెరిగిపోతోంది. ఇపుడిదే విషయమై టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో పాటు జనాల్లో కూడా బాగా చర్చ జరుగుతోంది. మరి గతంలో లాగ కేసీయార్ ఇపుడు కూడా సవాలును స్వీకరిస్తారా ? చూడాలి ఏమి జరుగుతుందో.
This post was last modified on May 6, 2021 11:01 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…