ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత కేసీయార్ పైన ఒత్తిడి పెరిగిపోతోందట. రాజీనామాతో పోయేదానికి కేసీయార్ బర్తరఫ్ దాకా తీసుకెళ్ళారనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది. భూకబ్జాల ఆరోపణలు రాగానే వెంటనే ఈటల రాజేందర్ నుండి మంత్రిత్వ శాఖలను పీకేశారు. మరుసటి రోజు ఏకంగా బర్తరఫ్ చేసేశారు. నిజానికి ఈటలకు జరిగిన ఘోర అవమానంగానే భావించాలి.
ఆశ్చర్యమేమంటే ఇదే విధమైన లేదా ఇంతకన్నా ఎక్కువ ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు, ఎంఎల్ఏలపైన మాత్రం కేసీయార్ అసలు స్పందించనేలేదు. దాంతో ఇపుడు ఈటల బర్తరఫ్ వివాదం కాస్త రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో హైకోర్టు కూడా ఈటల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో రాజేందర్ కు మద్దతు పెరుగుతోంది.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే రాజీనామా విషయంలో కేసీయార్ పైన కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. కేసీయార్ వెంటనే గజ్వేల్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. రాజేందర్ మద్దతుదారులు మాట్లాడుతూ కేసీయార్ వెంటనే రాజీనామా చేసి హుజూర్ నగర్లో ఈటలపై పోటీ చేసి గెలవాలంటూ చాలెంజ్ చేస్తున్నారు.
హుజూర్ నగర్ ఎంఎల్ఏగా తొందరలోనే రాజేందర్ రాజీనామా చేయబోతున్నట్లు మద్దతుదారులు చెబుతున్నారు. అప్పుడు వచ్చే ఉపఎన్నికలో ఈటలపై కేసీయార్ పోటీచేసి గెలవాలంటూ మద్దతుదారులు విసిరిన సవాలుకు మద్దతు పెరిగిపోతోంది. ఇపుడిదే విషయమై టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో పాటు జనాల్లో కూడా బాగా చర్చ జరుగుతోంది. మరి గతంలో లాగ కేసీయార్ ఇపుడు కూడా సవాలును స్వీకరిస్తారా ? చూడాలి ఏమి జరుగుతుందో.
This post was last modified on May 6, 2021 11:01 am
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…