ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్యనేత ఇంకా చెప్పాలంటే నంబర్ 2 అనే పేరొందిన విజయసాయిరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఏదో పొరాపొచ్చాలు వచ్చాయనే ప్రచారం జరిగినప్పటికీ…అదంతా ఓ ప్రచారం లాగానే ముగిసిపోయింది.
అయితే, విజయసాయిరెడ్డి మరో కీలక వార్తతో తెరమీదకు వచ్చారు. అదేంటంటే… ఆయన్ను క్వారంటైన్లో చేర్చాలట. ఎందుకు చేర్చాలి? ఇంతకూ ఎవరు ఈ డిమాండ్ చేశారంటారా? ఇంకెవరు ప్రతిపక్ష టీడీపీ. అయితే, వాళ్ల డిమాండ్ కూడా అంతే లాజిక్గా ఉంది మరి!
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ తెలంగాణ డీజీపీకి కీలక ప్రతిపాదన పెడుతూ లేఖ రాశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని 14 రోజులు క్వారంటైన్లో ఉంచాలని తెలంగాణ డీజీపికి రాసిన లేఖలో వర్ల డిమాండ్ చేశారు.
గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ను హోమ్ క్వారంటైన్లో ఉంచారని పేర్కొన్న వర్ల రామయ్య ఏపీలో విజయసాయిరెడ్డి కూడా ప్రాంతాలు, రాష్ట్రాలు వెళుతూ పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని, అనంతరం హైదరాబాద్కు వస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని తెలంగాణ డీజీపీని కోరారు.
కాగా, ఏపీ టీడీపీ నేత లాజిక్ ప్రకారమే ఈ డిమాండ్ చేసినప్పటికీ… గతంలోని పలు సందర్భాలను ఉటంకించినప్పటికీ…వైసీపీ ముఖ్యనేత విషయంలో తెలంగాణ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకుంటుందా? గత కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో…సీరియస్గా తీసుకునే చాన్స్ ఉందా? లేకపోతే…టీడీపీ నేత లేఖను చెత్త బుట్టలో వేయనుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
This post was last modified on May 18, 2020 4:41 pm
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…