Political News

మమత ఎక్కడి నుండి పోటీ చేస్తుంది ?

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. మమతబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస 213 సీట్లతో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 213 మందిని ఒంటిచేత్తో గెలిపించుకున్న మమత చివరకు తాను పోటీచేసిన నందిగ్రామ్ లో ఓడిపోయారు. మమత ఓడిపోవటం ఇదే మొదటిసారి. మరి ఓడిపోయిన మమత సీఎం అయితే మళ్ళీ పోటీచేసి గెలవాలి కదా. ఇపుడీ విషయంపైనే పెద్దఎత్తున చర్చ మొదలైంది.

నందిగ్రామ్ రిజల్టుపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. ఒకసారేమో బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి గెలిచినట్లు చెప్పారు. కొంతసేపటికి లేదు లేదు మమత ఓడిపోలేదు గెలిచారని చెప్పారు. నందిగ్రామ్ ఓట్ల కౌంటింగ్ లో 18 రౌండ్ల లెక్కింత తర్వాత 1256 ఓట్లతో మమత గెలిచినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే తృణమూల్ అఖండ మెజారిటి రావటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు మొదలుపెట్టేశారు.

ఈ నేపధ్యంలోనే మమత గెలవలేదు సుబేందు చేతిలో 1956 ఓట్లతో ఓడిపోయారంటు ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో మమత కూడా తన ఓటమిని అంగీకరించటంతో పాటు ఎన్నికల కమీషన్ పై ఆరోపణలు చేయటంతో గందరగోళం మొదలైపోయింది. తర్వాత కాసేటప్పటికి ఎన్నికల కమీషన్ అధికారికంగా సుబేందు గెలుపును ప్రకటించింది. అయితే మమత మాట్లాడుతు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓడిపోయిన మమత సీఎంగా బాధ్యతలు స్వీకరించినా ఆరునెలల్లో ఎక్కడో ఓ చోటనుండి గెలవాలి. మరి ఎక్కడ నుండి పోటీచేస్తారు ? మమత పోటీచేయటానికి సీటు ఖాళీగా ఉండాలి కదా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మమత పోటీ చేయటానకి మూడుస్ధానాలు ఖాళీగా ఉన్నాయి. 294 అసెంబ్లీలున్న బెంగాల్లో మూడు సీట్లు ఖాళీ అయిపోయాయి.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని  ఖర్దాహా స్ధానంలో తృణమూల్ తరపున పోటీచేసిన కాజల్ సిన్హా గెలిచారు. అలాగే జంగీపూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్పీ అభ్యర్ధి, శంషేర్ గంజ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి మరణించారు. వీళ్ళంతా నామినేషన్లు వేసిన తర్వాత ప్రచారంలో ఉండగా చనిపోయారు.  అయితే ఖర్దాహా నియోజకవర్గంలో కాజల్ మాత్రం పోలింగ్ అయిన తర్వాత చనిపోయారు. తాజా ఫలితాల్లో కాజల్ గెలిచారు కూడా. కాబట్టి మమత పోటీచేయటానికి మూడు సీట్లు రెడీగా ఉన్నాయి. ఎలాగూ తృణమూల్ గెలిచిన సీటే కాబట్టి మమత ఇక్కడి నుండే పోటీచేసే అవకాశాలున్నాయి.

Satya

Recent Posts

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

8 minutes ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

3 hours ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

5 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

10 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

12 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

12 hours ago