తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఇక, పుంజుకునేది లేదని.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని భావిస్తున్న కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అది కూడా గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన కార్పొరేటర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పుంజుకుంది. లింగోజీ గూడ కార్పొరేటర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం దక్కించుకుంది.
వాస్తవానికి గత రెండు నెలల కిందట జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇక, కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయిందని.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే.. లింగోజీగూడ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ్నుంచి పోటీ పెట్టొద్దని మంత్రి కేటీఆర్ను బీజేపీ ముఖ్య నేతలు రిక్వెస్ట్ చేయడంతో.. టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ పెట్టలేదు.
దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్కు నూతన ఉత్సాహం వచ్చినట్లుయ్యింది. కాగా.. లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థి మందుగుల అఖిల్ పవన్గౌడ్, కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్, జల్ల నాగార్జున, షేక్ ఫర్వేజ్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేట్ల సంఖ్య మూడుకు చేరుకుంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండుంటే పరిస్థితులు వేరేగా ఉండేవని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
This post was last modified on May 3, 2021 2:13 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…