తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్పై సీఎం కేసీఆర్ మరో అస్త్రం ప్రయోగించారు. ఇప్పటికే ఆయన తన హ్యాచరీస్ కోసం తమ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న రైతుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కేసీఆర్ అదికారులను పంపించి క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకున్నారు. ఈలోగానే.. ఆయననుంచి ముందు వైద్య, ఆరోగ్య శాఖను లాగేసుకున్న కేసీఆర్.. 24 గంటల్లో ఆయను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామమే రాష్ట్ర వ్యాప్తంగా భోగిమంటగా మండుతుంటే.. ఇప్పుడు మరో అస్త్రం సంధించారు.
శామీర్ పేటలోని దేవయాంజల్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. దీనిపై నిగ్గు తేల్చాలంటూ.. ఏకంగా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేసింది. దీనిలో సీనియర్ ఐఏఎస్లు.. రఘునందన్రావు, ప్రశాంత్ జీవన్, భారతి హొలికెరి, శ్వేతా మహంతి ఉన్నారు. ఈ భూములను ఆక్రమించారంటూ.. మాజీ మంత్రి ఈటల సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయని.. అందుకే తాము కమిటీ వేశామని.. తాజాగా కేసీఆర్ సర్కారు ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక, ఈ భూముల విషయానికి వస్తే.. 1992లో తాను ఈ భూములు కొన్నమాట వాస్తవమేనని ఈటల చెప్పుకొచ్చారు. అయితే.. అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని దేవాదాయ శాఖ.. ఇప్పుడు తనవే ఈ భూములని చెప్పడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. తాను కష్టపడి ఈ భూములు కొనుగోలు చేశానని చెప్పిన ఈటలప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అవసరమైతే.. న్యాయ పోరాటం చేసేందుకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇలా మొత్తగా చూస్తే.. ప్రస్తుతం కేసీఆర్కు ఈటలకు మధ్య పోరు మరింత రసవత్తరంగా మారిందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
This post was last modified on May 3, 2021 2:07 pm
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ…
పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…