తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్పై సీఎం కేసీఆర్ మరో అస్త్రం ప్రయోగించారు. ఇప్పటికే ఆయన తన హ్యాచరీస్ కోసం తమ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న రైతుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కేసీఆర్ అదికారులను పంపించి క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకున్నారు. ఈలోగానే.. ఆయననుంచి ముందు వైద్య, ఆరోగ్య శాఖను లాగేసుకున్న కేసీఆర్.. 24 గంటల్లో ఆయను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామమే రాష్ట్ర వ్యాప్తంగా భోగిమంటగా మండుతుంటే.. ఇప్పుడు మరో అస్త్రం సంధించారు.
శామీర్ పేటలోని దేవయాంజల్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. దీనిపై నిగ్గు తేల్చాలంటూ.. ఏకంగా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేసింది. దీనిలో సీనియర్ ఐఏఎస్లు.. రఘునందన్రావు, ప్రశాంత్ జీవన్, భారతి హొలికెరి, శ్వేతా మహంతి ఉన్నారు. ఈ భూములను ఆక్రమించారంటూ.. మాజీ మంత్రి ఈటల సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయని.. అందుకే తాము కమిటీ వేశామని.. తాజాగా కేసీఆర్ సర్కారు ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక, ఈ భూముల విషయానికి వస్తే.. 1992లో తాను ఈ భూములు కొన్నమాట వాస్తవమేనని ఈటల చెప్పుకొచ్చారు. అయితే.. అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని దేవాదాయ శాఖ.. ఇప్పుడు తనవే ఈ భూములని చెప్పడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. తాను కష్టపడి ఈ భూములు కొనుగోలు చేశానని చెప్పిన ఈటలప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అవసరమైతే.. న్యాయ పోరాటం చేసేందుకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇలా మొత్తగా చూస్తే.. ప్రస్తుతం కేసీఆర్కు ఈటలకు మధ్య పోరు మరింత రసవత్తరంగా మారిందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
This post was last modified on May 3, 2021 2:07 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…