Political News

బిగ్ బ్రేకింగ్‌: ఈట‌ల‌పై మ‌రో కేసు

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై సీఎం కేసీఆర్ మ‌రో అస్త్రం ప్ర‌యోగించారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న హ్యాచ‌రీస్ కోసం త‌మ అసైన్డ్ భూముల‌ను ఆక్ర‌మించుకున్నార‌న్న రైతుల ఫిర్యాదుపై వెంట‌నే స్పందించిన కేసీఆర్ అదికారుల‌ను పంపించి క్షేత్ర‌స్థాయిలో నివేదిక‌లు తెప్పించుకున్నారు. ఈలోగానే.. ఆయ‌న‌నుంచి ముందు వైద్య‌, ఆరోగ్య శాఖ‌ను లాగేసుకున్న కేసీఆర్‌.. 24 గంట‌ల్లో ఆయ‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామ‌మే రాష్ట్ర వ్యాప్తంగా భోగిమంట‌గా మండుతుంటే.. ఇప్పుడు మ‌రో అస్త్రం సంధించారు.

శామీర్ పేట‌లోని దేవ‌యాంజ‌ల్ భూముల‌ను ఆక్ర‌మించుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న క‌దిలింది. దీనిపై నిగ్గు తేల్చాలంటూ.. ఏకంగా న‌లుగురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌తో కూడిన క‌మిటీని వేసింది. దీనిలో సీనియ‌ర్ ఐఏఎస్‌లు.. ర‌ఘునంద‌న్‌రావు, ప్ర‌శాంత్ జీవ‌న్‌, భార‌తి హొలికెరి, శ్వేతా మ‌హంతి ఉన్నారు. ఈ భూములను ఆక్ర‌మించారంటూ.. మాజీ మంత్రి ఈటల స‌హా ప‌లువురిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని.. అందుకే తాము క‌మిటీ వేశామ‌ని.. తాజాగా కేసీఆర్ స‌ర్కారు ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని క‌మిటీని ప్ర‌భుత్వం ఆదేశించింది.

ఇక‌, ఈ భూముల విష‌యానికి వ‌స్తే.. 1992లో తాను ఈ భూములు కొన్న‌మాట వాస్త‌వ‌మేన‌ని ఈట‌ల చెప్పుకొచ్చారు. అయితే.. అప్ప‌ట్లో ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ని దేవాదాయ శాఖ‌.. ఇప్పుడు త‌న‌వే ఈ భూముల‌ని చెప్ప‌డం కుట్ర‌లో భాగ‌మేన‌ని ఆరోపించారు. తాను క‌ష్ట‌ప‌డి ఈ భూములు కొనుగోలు చేశాన‌ని చెప్పిన ఈట‌లప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుపై అవ‌స‌ర‌మైతే.. న్యాయ పోరాటం చేసేందుకు సైతం వెనుకాడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలా మొత్త‌గా చూస్తే.. ప్ర‌స్తుతం కేసీఆర్‌కు ఈట‌లకు మ‌ధ్య పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

This post was last modified on May 3, 2021 2:07 pm

Share

Recent Posts

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

34 minutes ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

37 minutes ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

1 hour ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

2 hours ago

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

3 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

3 hours ago