Political News

బిగ్ బ్రేకింగ్‌: ఈట‌ల‌పై మ‌రో కేసు

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై సీఎం కేసీఆర్ మ‌రో అస్త్రం ప్ర‌యోగించారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న హ్యాచ‌రీస్ కోసం త‌మ అసైన్డ్ భూముల‌ను ఆక్ర‌మించుకున్నార‌న్న రైతుల ఫిర్యాదుపై వెంట‌నే స్పందించిన కేసీఆర్ అదికారుల‌ను పంపించి క్షేత్ర‌స్థాయిలో నివేదిక‌లు తెప్పించుకున్నారు. ఈలోగానే.. ఆయ‌న‌నుంచి ముందు వైద్య‌, ఆరోగ్య శాఖ‌ను లాగేసుకున్న కేసీఆర్‌.. 24 గంట‌ల్లో ఆయ‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామ‌మే రాష్ట్ర వ్యాప్తంగా భోగిమంట‌గా మండుతుంటే.. ఇప్పుడు మ‌రో అస్త్రం సంధించారు.

శామీర్ పేట‌లోని దేవ‌యాంజ‌ల్ భూముల‌ను ఆక్ర‌మించుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న క‌దిలింది. దీనిపై నిగ్గు తేల్చాలంటూ.. ఏకంగా న‌లుగురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌తో కూడిన క‌మిటీని వేసింది. దీనిలో సీనియ‌ర్ ఐఏఎస్‌లు.. ర‌ఘునంద‌న్‌రావు, ప్ర‌శాంత్ జీవ‌న్‌, భార‌తి హొలికెరి, శ్వేతా మ‌హంతి ఉన్నారు. ఈ భూములను ఆక్ర‌మించారంటూ.. మాజీ మంత్రి ఈటల స‌హా ప‌లువురిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని.. అందుకే తాము క‌మిటీ వేశామ‌ని.. తాజాగా కేసీఆర్ స‌ర్కారు ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని క‌మిటీని ప్ర‌భుత్వం ఆదేశించింది.

ఇక‌, ఈ భూముల విష‌యానికి వ‌స్తే.. 1992లో తాను ఈ భూములు కొన్న‌మాట వాస్త‌వ‌మేన‌ని ఈట‌ల చెప్పుకొచ్చారు. అయితే.. అప్ప‌ట్లో ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ని దేవాదాయ శాఖ‌.. ఇప్పుడు త‌న‌వే ఈ భూముల‌ని చెప్ప‌డం కుట్ర‌లో భాగ‌మేన‌ని ఆరోపించారు. తాను క‌ష్ట‌ప‌డి ఈ భూములు కొనుగోలు చేశాన‌ని చెప్పిన ఈట‌లప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుపై అవ‌స‌ర‌మైతే.. న్యాయ పోరాటం చేసేందుకు సైతం వెనుకాడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలా మొత్త‌గా చూస్తే.. ప్ర‌స్తుతం కేసీఆర్‌కు ఈట‌లకు మ‌ధ్య పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

This post was last modified on May 3, 2021 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

32 minutes ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

2 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

3 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago