తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్పై సీఎం కేసీఆర్ మరో అస్త్రం ప్రయోగించారు. ఇప్పటికే ఆయన తన హ్యాచరీస్ కోసం తమ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న రైతుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కేసీఆర్ అదికారులను పంపించి క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకున్నారు. ఈలోగానే.. ఆయననుంచి ముందు వైద్య, ఆరోగ్య శాఖను లాగేసుకున్న కేసీఆర్.. 24 గంటల్లో ఆయను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామమే రాష్ట్ర వ్యాప్తంగా భోగిమంటగా మండుతుంటే.. ఇప్పుడు మరో అస్త్రం సంధించారు.
శామీర్ పేటలోని దేవయాంజల్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. దీనిపై నిగ్గు తేల్చాలంటూ.. ఏకంగా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేసింది. దీనిలో సీనియర్ ఐఏఎస్లు.. రఘునందన్రావు, ప్రశాంత్ జీవన్, భారతి హొలికెరి, శ్వేతా మహంతి ఉన్నారు. ఈ భూములను ఆక్రమించారంటూ.. మాజీ మంత్రి ఈటల సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయని.. అందుకే తాము కమిటీ వేశామని.. తాజాగా కేసీఆర్ సర్కారు ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక, ఈ భూముల విషయానికి వస్తే.. 1992లో తాను ఈ భూములు కొన్నమాట వాస్తవమేనని ఈటల చెప్పుకొచ్చారు. అయితే.. అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని దేవాదాయ శాఖ.. ఇప్పుడు తనవే ఈ భూములని చెప్పడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. తాను కష్టపడి ఈ భూములు కొనుగోలు చేశానని చెప్పిన ఈటలప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అవసరమైతే.. న్యాయ పోరాటం చేసేందుకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇలా మొత్తగా చూస్తే.. ప్రస్తుతం కేసీఆర్కు ఈటలకు మధ్య పోరు మరింత రసవత్తరంగా మారిందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని కేసు బ్లాక్ బక్ పౌచింగ్. 1998లో హం సాత్ సాత్ హై షూటింగ్…