Political News

టీడీపీ పరిస్ధితేమిటి ?

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఓ విషయం అర్ధమైపోయింది. అదేమిటంటే టీడీపీ ఓటింగ్ పెద్దగా చెక్కు చెదరలేదని. నిజానికి ఎన్నికలకు ముందే వైసీపీ విజయం ఖాయమైపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని నిలువెల్లా వ్యతిరేకిస్తున్న కారణంగా తిరుపతి ఉపఎన్నికలో పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు రంగంలోకి దించారు.

ఇక్కడ టీడీపీలో ఓ సమస్య కొట్టొచ్చినట్లు కనబడింది. అదేమిటంటే ఎలాగూ ఓడిపోయే సీటే కాబట్టి పెద్దగా పోరాటం చేసేదేముంటుంది ? అనే ధోరణి చాలామంది సీనియర్లలో కనబడింది. దానికితోడు పనబాక కూడా పోటీ విషయంలో వెనకాడిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. పైగా ఎన్నికల ప్రక్రియకు మూడు నెలలకు ముందే పనబాకను అభ్యర్ధిగా ప్రకటించారు. దాంతో నేతల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోయింది.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే వెల్లడైన ఫలితాన్ని బట్టిచూస్తే టీడీపీకి 3.60 లక్షల దాకా ఓట్లొచ్చాయి. నిజానికి ఇన్ని ఓట్లు వస్తాయని చాలామంది నేతలు ఊహించలేదు. కొందరు సీనియర్లయితే 2.5-3 లక్షల ఓట్లొస్తాయని అనుకున్నారు. దానికి తగ్గట్లే 2019 ఎన్నికల్లో జరిగిన 80 శాతం ఓటింగ్ తో పోల్చితే తాజా పోలింగ్ 64 శాతమే. అంటే 16 శాతం తగ్గిపోయింది. దీంతో తమకు పోలింగ్ దగ్గరే 16 శాతం ఓట్లు బొక్కపడిందని టీడీపీ నేతలు అంచనా వేశారు.

తీరా కౌంటింగ్ లో చూస్తే 3.6 లక్షల ఓట్లొచ్చాయి. అంటే నియోజకవర్గానికి సగటున 50 వేల ఓట్లొచ్చినట్లే లెక్క. అంటే దగ్గర దగ్గర 31 శాతం ఓటింగ్ నికరంగా టీడీపీకి ఉందని అర్ధమైపోయింది. నేతలు పెద్దగా పట్టించుకోకపోయినా, అభ్యర్ధి గట్టిగా పోరాటం చేయకపోయినా, ఓటింగ్ తగ్గిపోయినా కూడా టీడీపీకి 31 శాతం ఓటింగ్ రావటం మామూలు విషయంకాదు.

ఇదే మొదటినుండి అభ్యర్ధి, నేతలు గట్టిగా ఓ పట్టుపట్టుంటే టీడీపీకి ఇంకా ఎక్కువ ఓట్లొచ్చేదే అనటంలో సందేహంలేదు. అంటే కేవలం అభ్యర్ధి, పార్టీ అలసత్వం వల్లే ఓట్లు తగ్గిపోయాయని అర్ధమైపోతోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక సంక్షేమపథకాలు అమలవుతున్నా కూడా టీడీపీ ఓటింగ్ తగ్గలేదంటే జనాల్లో పార్టీపై అభిమానం ఉన్నట్లే కదా. ఈ విషయమై చంద్రబాబు అండ్ కో జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే పార్టీ పుంజుకోవటం పెద్ద కష్టమేమీకాదు.

This post was last modified on May 3, 2021 11:33 am

Share
Show comments

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

10 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

1 hour ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

1 hour ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

3 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago